Russia-Ukraine: ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు చమురుతోనే!
Russia-Ukraine: ఉక్రెయిన్పై కాలుదువ్విన అనంతరం రష్యాకు నిధుల సమస్య వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో భారత్కు చమురును ఎగుమతి చేయడం ద్వారా రష్యా తన ఖజానాను నింపుకుని.. యుద్ధాన్ని కొనసాగించిందని యూరోపియన్ మేధో బృందం ఒకటి అంటోంది.
భారత్ కొనుగోళ్లతో రష్యాపై ఆంక్షల ప్రభావం పడలేదు
మేధో సంఘం సీఆర్ఈఏ వ్యాఖ్యలు
ఐరోపా దేశాలే ఎక్కువ కొన్నాయన్న భారత్
ఉక్రెయిన్పై కాలుదువ్విన అనంతరం రష్యాకు (Russia) నిధుల సమస్య వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో భారత్కు చమురును ఎగుమతి చేయడం ద్వారా రష్యా తన ఖజానాను నింపుకుని.. యుద్ధాన్ని కొనసాగించిందని యూరోపియన్ మేధో బృందం ఒకటి అంటోంది. అయితే భారత్ నెల రోజుల్లో కొన్న చమురును కొన్ని ఐరోపా దేశాలు ఒక్కపూటలోనే కొన్నాయని మన దేశం గట్టి సమాధానం ఇచ్చింది.
ఉక్రెయిన్ (Ukraine) యుద్ధానికి ముందు అంటే 2021-22లో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2 శాతం మాత్రమే. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్లం.
యుద్ధం మొదలయ్యాక ఏమైంది?: ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై (Ukraine) దాడులు మొదలయ్యాక రష్యా తన చమురు ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇందుకు నేపథ్యం. దీంతో భారత్ తన చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోవడం కోసం రష్యా వైపు చూసింది. 2023లో చమురు దిగుమతుల్లో 30 శాతం దాకా రష్యా నుంచే భారత్ పొందింది. దీంతో ఏప్రిల్-డిసెంబరులో చమురు దిగుమతి బిల్లు 17% మేర తగ్గి 122.48 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. కానీ యూరోపియన్ మేధో బృందం మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
సీఆర్ఈఏ ఏమంటోందంటే..: రష్యా-ఉక్రెయిన్ (Ukraine Crisis) యుద్ధ సమయంలో భారత్ 37 బిలియన్ డాలర్ల మేర రష్యా చమురును కొని ఖజానాను నింపిందని ఫిన్లాండ్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్ఈఏ) అంటోంది. ‘యుద్ధం ముందుతో పోలిస్తే 13 రెట్ల మేర భారత్ కొనుగోళ్లు పెరిగాయి. దీంతో పాశ్చాత్య దేశాల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా మారి.. ఆంక్షల ప్రభావం లేకుండా చేసింది. ఇదంతా చట్టబద్ధమే. అంతే కాదు, రష్యా చమురు నుంచి వచ్చిన ఇంధనాల్లో మూడింట ఒక వంతు జి-7 దేశాలకు భారత్ ఎగుమతి చేసిందని, వీటి విలువ 6.65 బి.డాలర్లని తెలిపింది. (అమెరికాకే 1 బి.డాలర్ల మేర పంపింది.) ఇందులో ఎక్కువ భాగం (5.2 బి.డాలర్లు) రిలయన్స్కు చెందిన జామ్నగర్ రిఫైనరీ నుంచే వచ్చాయని తెలిపింది. ఈ విషయంపై ఆర్ఐఎల్ స్పందించలేదు.
రష్యా ‘షాడో రవాణా’ ఇలా..: భారత్కు రష్యా చమురు విక్రయాలపై ఎటువంటి ఆంక్షలూ లేవు. అయితే లాభాలను పెంచుకోవడం కోసం రష్యా ఒక వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా చమురు ట్యాంకర్ల ‘షాడో ఫ్లీట్’ను సిద్ధం చేసిందని ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ అంటోంది. దీని ద్వారా ఎవరికి పంపుతున్నారో.. ఎలా పంపుతున్నారో తెలియండా చేసిందట. ఉదాహరణకు ఒక భారీ ట్యాంకరు, మరొక చిన్న ట్యాంకరు ఒకదాని పక్కన ఒకటి చమురును రవాణా చేస్తాయి. ఒక దాని నుంచి మరొక దానికి చమురు బదిలీ అవుతూనే ఉంటుంది. దీంతో గమ్యస్థానం ఏమిటి? ఎక్కడి నుంచి చమురు వచ్చింది అన్నది తెలియడం సంక్లిష్టమవుతుంది. ఇందులో ఒక నౌక భారత్కు చెందిన కంపెనీదేనని.. ఇంకొకటి ఎవరో గుర్తుతెలియని వ్యక్తిదని సీఎన్ఎన్ చెబుతోంది. ఈ బదిలీల్లో కొన్ని ఒక్కోసారి చట్టబద్ధంగానే ఉన్నా.. ఆంక్షల బారిన పడకుండా తప్పించుకోవడానికే ఈ వ్యూహాన్ని పన్నినట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది.
కొన్ని నేరుగానే.. కానీ..: యుద్ధం అనంతరం భారత్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని.. అందులో రష్యా ‘షాడో ఫ్లీట్’ ద్వారా జరిగిన లావాదేవీలూ ఉన్నాయని సీఆర్ఈఏ తన నివేదికలో పేర్కొంది. కానీ రష్యా, భారత్ మధ్య చమురు లావాదేవీల్లో కొన్ని నేరుగానే ఉన్నాయని సీఎన్ఎన్ అంటోంది. అంతర్జాతీయ షిప్పింగ్ కదలికలను గమనించిన అనంతరం.. గతేడాది రష్యా నుంచి భారత్కు 588 నౌకలు నేరుగానే వచ్చాయి. అయితే 200 ట్రిప్పులు మాత్రం షాడో ఫ్లీట్ ద్వారా భారత్కు వచ్చాయని చెబుతోంది. మొత్తం మీద భారత చమురు కొనుగోళ్ల వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై చమురు ఆంక్షల ప్రభావం బలహీనపడిందని.. 2023లో రష్యా ప్రభుత్వ ఆదాయాలు 320 బి.డాలర్ల మేర పెరిగాయని సీఎన్ఎన్ అంటోంది.
భారత్ ఏమంటోందంటే..
భారత్ వైపే వేలు ఎందుకు చూపిస్తారని.. తమ కంటే రష్యా చమురును అధికంగా దిగుమతి చేసుకునే ఐరోపా దేశాలూ ఉన్నాయని భారత్ అంటోంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోలు విషయంలో కేవలం తన హక్కులను మాత్రమే వినియోగించుకుందని.. ఎటువంటి ఆంక్షల ఉల్లంఘనలకు పాల్పడలేదని పలుమార్లు ఉద్ఘాటించింది. ‘రష్యాతో మా వాణిజ్యం ఐరోపా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. మేమూ మా ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తున్నామ’ని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అప్పట్లోనే స్పష్టం చేశారు. ఇటీవల ఓ అంతర్జాతీయ వేదికపైనా ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!