విస్తృత భాగస్వామ్యాలతో కొత్త ఔషధాలు
విస్తృత భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా కొత్త ఔషధాలను త్వరగా ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని డాక్టర్ రెడ్డీస్ సహ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జీవీ ప్రసాద్ తెలిపారు.
దేశీయ ఫార్మా కంపెనీలకు డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ సూచన
రీసెర్చ్ హాస్పిటల్స్తో పరిశోధనలకు సహకారం
ఈనాడు, హైదరాబాద్
విస్తృత భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా కొత్త ఔషధాలను త్వరగా ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని డాక్టర్ రెడ్డీస్ సహ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జీవీ ప్రసాద్ తెలిపారు. మన ఫార్మా కంపెనీలు, విదేశీ భాగస్వామ్యాలపై దృష్టి సారించాలని కోరారు. ‘జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో మనం పైచేయి సాధించాం.. ఇక కొత్త ఔషధాల ఆవిష్కరణపై దృష్టి సారించాలి’ అని బయో ఆసియా 2024 సదస్సులో నిర్వహించిన చర్చాగోష్ఠిలో సూచించారు. పరిశోధనలకు భారీ వ్యయప్రయాసలు తప్పవని పేర్కొంటూ.. చక్కెర వ్యాధిని అదుపు చేసే మందులను ఆవిష్కరించడానికి 2 దశాబ్దాల క్రితం డాక్టర్ రెడ్డీస్ చేసిన కృషిని ప్రసాద్ వివరించారు. ‘దాదాపు 150 మిలియన్ డాలర్లు (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం సుమారు రూ.1250 కోట్లు) ఖర్చు చేశాం. కొన్ని ఔషధాలను రెండో దశ క్లినికల్ పరీక్షల స్థాయికి తీసుకెళ్లాం. ఇంకొన్ని పరిశోధనా ప్రాజెక్టులపై ఇతర సంస్థలకు లైసెన్సులు ఇచ్చాం. ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేశాం’ అని ఆయన వివరించారు. ఆ తర్వాత మందుల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, భాగస్వామ్యాల ద్వారా ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మనదేశంలో నైపుణ్యాలకు కొదవ లేదు, కానీ పరిశోధనలు చేపట్టేందుకు భారీగా నిధులు అవసరమవుతాయని, ఈ లభ్యత తక్కువని అన్నారాయన. చైనాలో మాదిరిగా రీసెర్చ్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడం దీనికి కొంత పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడంతో పాటు పెద్దఎత్తున ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలూ చేపట్టాలని తెలిపారు. మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ పరిశోధనను వేగవంతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
మంగళవారం ఇక్కడ ప్రారంభమైన బయో ఆసియా సదస్సులో భాగంగా పలు అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. ఇందులో ప్రముఖ ఫార్మా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆవిష్కరణల కేంద్రంగా భారత్
- క్రిస్టోఫర్ బోర్నర్, సీఈఓ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్
ఆవిష్కరణలన్నీ అమెరికా నుంచి వస్తాయని అనుకుంటారు. కానీ, ప్రపంచంలోని పలు ఆవిష్కరణల వెనుక భారత్ ఉన్న మాట వాస్తవం. సమస్యలకు విభిన్నంగా పరిష్కారాలను ఆలోచించే వ్యక్తుల నుంచే ఇవి వస్తాయి. ఏటా 20 లక్షల మందికి పైగా నిపుణులు భారత్ నుంచి వస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది. కొవిడ్ సమయంలో దేశ వ్యాప్తంగా నిమిషానికి 14,000 మందికి పైగా టీకాలు వేసిన ఘనత భారత్ది. నిజానికి భారత్ హృదయం ఉన్న దేశం. హైదరాబాద్లో రూ.820 కోట్లతో కార్యాలయం ప్రారంభించాం. 2025 నాటికి అమెరికా తర్వాత ఇదే పెద్ద కార్యాలయం అవుతుంది. ఆవిష్కరణలకు ఇక్కడ ఉన్న అవకాశాలపై మాకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. క్యాన్సర్ చికిత్సలో సెల్ థెరపీ కొత్త సాంకేతికత. శరీరాన్నే ఔషధంగా మార్చే ఈ ప్రక్రియ అగ్రగామి కానుంది. క్యాన్సర్తో పోరాడే శరీర రోగ నిరోధక వ్యవస్థను (ఇమ్యునోథెరపీ) మరింత అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా శ్రమిస్తున్నారు. ఇందుకు కృత్రిమ మేధలాంటి సాంకేతికతలు ఉపకరిస్తాయి. ఒక వ్యక్తికి రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయితే, శరీరం నుంచి కణాలను తీసి, వాటిని రీ ఇంజినీరింగ్ చేయొచ్చు. ఇలా చేసిన కణాలను తిరిగి రోగిలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి క్యాన్సర్ కణాలపై దాడి చేసి చంపుతాయి. ఇది అధ్భుతమైన శాస్త్రీయ పురోగతి. తదుపరి ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఈ వ్యాధి లక్షణాలను అంచనా వేసేందుకు, వేల మంది రోగులపై ఏఐ (కృత్రిమ మేధ) ఉపయోగిస్తున్నాం. హృద్రోగాన్ని ముందే పసిగట్టేందుకూ ఏఐ ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల మంది ఈసీజీ ఫలితాలను విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. జీవ ఔషధాల రంగంలో 100 సంవత్సరాలుగా ఎంతో పురోగతి చూస్తున్నాం. ఆధునిక టీకాల ఆవిష్కరణలతో 25 ఏళ్ల ఆయుర్దాయాన్ని పొందుతున్నాం. డిజిటల్ టెక్నాలజీ ఏకీకృతం చేస్తున్నందున వేగంగా మరో 25 ఏళ్ల ఆయుర్దాయాన్ని జోడించగలం.
వైద్య రంగానికి సాంకేతికత తోడు
- రాడ్ హాచ్మన్, ప్రెసిడెంట్, సీఈఓ, ప్రొవిడెన్స్
ఆరోగ్య రంగంలో సమాచారం, సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక చోట ఉన్న వైద్యుడు, ఎక్కడో ఉన్న రోగికి రోబోటిక్ శస్త్రచికిత్స చేసే రోజులు వచ్చాయి. భవిష్యత్తులో ఇది మరింత వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సంరక్షణ డిజిటలీకరణ చెందుతోంది. హైదరాబాద్లోని మా కార్యాలయం ఇందుకు తగిన మద్ధతునిస్తుంది. రోగుల నుంచి సమాచారం సేకరించేందుకు కృత్రిమ మేధ, బాట్లు ఉపయోగపడతాయి. దీనివల్ల వైద్యులు, నర్సుల మీద భారం తగ్గుతుంది. సంక్లిష్ట చికిత్సల కోసం ఇవి వైద్యులకూ సమాధానం ఇవ్వగలవు. ఆరోగ్య వ్యవస్థల ఏకీకరణ జరిగితే భవిష్యత్లో ఏ మహమ్మారినైనా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూ సైబర్ భద్రత ఉండాలి.
నిబంధనలు కఠినంగా ఉన్నాయి: కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే క్రమంలో, కఠిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు తమ కంపెనీ వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.
పరిశోధనలకు విశ్వవిద్యాలయాలు కేంద్రంగా మారాలి
డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔషధ పరిశోధనలకు యూనివర్సిటీలు కేంద్రస్థానంగా ఉన్నాయని, ఇటువంటి సానుకూలత మనదేశంలో కొరవడిందని డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. బయో ఆసియా 2024లో భాగంగా నిర్వహించిన సీఈఓ సదస్సులో ఆయన మాట్లాడారు. పదేళ్ల క్రితం వరకు ఔషధ పరిశోధనల్లో చైనా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ, విశ్వవిద్యాయాలు, ఆసుపత్రుల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా సత్వర అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. ఔషధ పరిశోధనలకు సంబంధించి కచ్చిత లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ మేరకు విద్యార్థులకు నిధులు సమకూర్చాలని సూచించారు. మందుల తయారీలో కీలక ముడిపదార్థాల సరఫరాకు సంబంధించి, రవాణా సమస్యలు అధికమైనందున, వ్యయాలు పెరుగుతున్నట్లు సతీష్రెడ్డి వివరించారు. రవాణా సమస్యలను అధిగమించగలిగితే ఔషధ పరిశోధన, ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
అన్నీ ఒకేచోట కోరుతున్నారు
లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ చావ మాట్లాడుతూ, గతంలో మాదిరిగా ప్రాథమిక ముడిపదార్థాలు చైనా నుంచి, ఇంటర్మీడియేట్ ఔషధాలు మనదేశం నుంచి, ఏపీఐలను వేరే దేశం నుంచి కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఇష్టపడటం లేదని, అన్నీ ఒకే చోట లభిస్తే సరఫరా- రవాణా సమస్యలు తగ్గుతాయనే ఆలోచనే ఇందుకు కారణమని వివరించారు. ఔషధ, జీవ శాస్త్రాల పరిశ్రమకు మనదేశంలో నిపుణుల కొరత ఉన్నట్లు ఆయన వివరించారు. ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నప్పటికీ, అందులో ఎక్కువ మంది ఇంజినీరింగ్ నుంచే ఉంటున్నారని, జీవ శాస్త్రాల వైపు వస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువని తెలిపారు. మనదేశంలో ‘ప్రాసెస్ రీసెర్చ్’ అధికంగా ఉన్నప్పటికీ, ఔషధ పరిశోధన తగినంతగా లేదని వివరించారు. ఈ పరిస్థితి మారాలంటే విశ్వవిద్యాలయాలకు అధికంగా నిధులు కేటాయించి, వాటిని పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి అందుకు అనువైన వ్యవస్థలను ఆవిష్కరించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!