సరికొత్త భారతానికి అంకురాలే వెన్నెముక
సరికొత్త భారతానికి అంకుర సంస్థలు వెన్నెముకగా నిలవగలవని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్
మార్చి 18-20 తేదీల్లో ‘మహాకుంభ్’
దిల్లీ: సరికొత్త భారతానికి అంకుర సంస్థలు వెన్నెముకగా నిలవగలవని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. 2047 కల్లా 35 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.2905 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మనదేశం ఎదిగే యత్నాల్లో, వచ్చే అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత్ ఇప్పటికే అంతర్జాతీయ శక్తిగా మారింది. అందుకు కారణం మనపై మనకున్న విశ్వాసం, సుపరిపాలన, వినూత్న ఆవిష్కరణల కొనసాగింపు. ఇది మన సమయమ’ని మంగళవారమిక్కడ జరిగిన స్టార్టప్ మహాకుంభ్ సదస్సు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగం కోసం కాదు.. ఉద్యోగ సృష్టి వైపు వెళ్లాలి..: వచ్చే నెల 18-20 తేదీల్లో మహాకుంభ్ పేరిట జరిగే సదస్సులో మన అంకురాలు సృష్టించిన విప్లవాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ‘అమృత్ కాల్’లో వినూత్నత, అంకురాల ఏర్పాటు దిశగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గోయల్ అన్నారు.
మహాకుంభ్ ఎందుకంటే..: అంకుర ప్రపంచానికి చాలా శక్తి ఉంది. కేవలం ఎనిమిదేళ్లలోపే 100కు పైగా యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన సంస్థ)లు వచ్చాయి. మరిన్ని ఆలోచనలు ఆ స్థాయికి చేరనున్నాయి. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ మారాం. మహాకుంభ్లో 57 రకాల రంగాలకు చెందిన అంకురాల ప్రదర్శన జరగనుంది. 10కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. అంకురాల వ్యవస్థాపకులు, పెట్టుబడుదార్లు, ఇంక్యుబేటర్లు.. ఇలా అందరినీ ఒకదగ్గరికి చేర్చడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనియన్ బ్యాంక్ లాభం రూ.3,328 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రూ.3,328 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 18.36 శాతం ఎక్కువ. -
మన ల్యాబ్ తయారీ వజ్రాలు విదేశాల్లో మెరుస్తున్నాయ్
ల్యాబ్ తయారీ వజ్రాల (ఎల్జీడీ) ఎగుమతులు 2024-25లో 7-9 శాతం వృద్ధి చెంది 1500-1530 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,450-12,700 కోట్ల)కు చేరొచ్చని కేర్ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికితీసే వజ్రాలకు గిరాకీ మందకొడిగా ఉండటం ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. -
భారత కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించొచ్చు
గత ఆర్థిక సంవత్సరం(2023-24) జనవరి-మార్చి త్రైమాసికంలో భారత కంపెనీల ఆదాయాలు 4-6 శాతమే పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 పరిణామాల ప్రభావం నుంచి కంపెనీలు పుంజుకోవడం ప్రారంభమైన 2021 సెప్టెంబరు తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయ వృద్ధి అని తెలిపింది. -
తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ!
అధికారం చేపట్టిన ‘తొలి 100 రోజుల ప్రణాళిక’లో భాగంగా ‘ఇండియా ఏఐ మిషన్’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కింద 2024-25 ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ ‘ఇన్ఫామిస్ట్’ తన కథనంలో పేర్కొంది. -
2024-25లో భారత వృద్ధి 7 శాతానికి పైనే
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు, సాధారణానికి మించి వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేయొచ్చని ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. -
గ్రామ పంచాయతీల్లోకి ‘బీమా’ సేవలు
గ్రామ పంచాయతీలకు జీవిత, సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. ‘2047 కల్లా అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
ఒమేగా హాస్పిటల్స్లో మోర్గాన్ స్టాన్లీకి వాటా
క్యాన్సర్ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఒమేగా హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.600 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ సంస్థకు ఒమేగా హాస్పిటల్స్లో 15 శాతం వరకూ వాటా లభిస్తుంది. -
సీసీఎల్ ప్రోడక్ట్స్కు తగ్గిన లాభాలు
ఇన్స్టెంట్ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్ ప్రోడక్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.730 కోట్ల ఆదాయాన్ని, రూ.65.22 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.4.90గా నమోదైంది. -
ఏఐ ప్రాజెక్టులపై బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ దృష్టి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.213.34 కోట్ల ఆదాయాన్ని, రూ.8.41 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
క్యాప్స్టన్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు
మ్యాన్ పవర్, స్టాఫింగ్ సేవల సంస్థ అయిన క్యాప్స్టన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి, నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ సంస్థ రూ.521 కోట్ల ఆదాయాన్ని, రూ.12.57 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
కూల్ నుంచి అధునాతన కూలర్
కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ సరికొత్త ‘డెజర్ట్ కూలర్ ఎక్సెల్ హెచ్1’ కూలర్ను తీసుకొచ్చింది. అధునాతన బీఎల్డీసీ మోటార్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఫ్యాన్ విద్యుత్ను 65% వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటికి సరికొత్త స్టైల్, అందాన్ని తీసుకొస్తుందని వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(5)
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐషర్ మోటార్స్ ఏకీకృత నికర లాభం రూ.1,070 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.906 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అధిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. -
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ
గత నెల రోజులుగా బెంగళూరులో ఉంటున్న టెక్ జపాన్ వ్యవస్థాపకుడు భారతీయ నాయకత్వం గురించి కొనియాడారు.