సంక్షిప్త వార్తలు
వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆదేశించింది.
కాగ్నిజెంట్ ఉద్యోగులూ కార్యాలయాలకే!
దిల్లీ: వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆదేశించింది. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు కంపెనీకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి టీమ్ లీడర్లు నిర్ణయిస్తారని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. ప్రాజెక్టులు, శిక్షణ, బృందాల వారీగా కలిసి పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్కు 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇందులో 2,54,000 మంది భారత్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా పలు కంపెనీలు ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలకడానికి సంకేతాలివ్వగా.. తాజా ఆ జాబితాలో కాగ్నిజెంట్ చేరింది. పని సంస్కృతి మెరుగు పడుతుందని, సహ ఉద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల ఉత్పాదకత బాగుంటుందనే కారణాలను కంపెనీలు చూపిస్తున్నాయి.
ఇళ్ల ధరలు 20% పెరిగాయ్: క్రెడాయ్
దిల్లీ: గత రెండేళ్ల (2021-23)లో దేశంలోని అగ్రగామి 8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 20% పెరిగాయని స్థిరాస్తి సంస్థల సమాఖ్య క్రెడాయ్ తాజా నివేదిక తెలిపింది. నిర్మాణ వ్యయాలకు తోడు, గిరాకీ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. అగ్రగామి 8 నగరాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం, పుణె ఉన్నాయి. స్థిరాస్తి కన్సల్టెంట్ కొలియర్స్, డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్లతో కలిసి క్రెడాయ్ ఈ నివేదికను వెలువరించింది. 2021 స్థాయులతో పోలిస్తే 2023లో దిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, కోల్కతాలలో ఇళ్ల ధరలు సగటున 30% పెరిగాయని తెలిపింది.
డబ్ల్యూజీసీ భారత సీఈఓగా సచిన్ జైన్
ముంబయి: ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఇండియా ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సచిన్ జైన్ను నియమించింది. ఈ నియామకం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. డబ్ల్యూజీసీలోకి రావడానికి ముందు డీబీర్స్ ఇండియాలో జైన్ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. డీబీర్స్ ఇండియా ఎండీగా ఆయన భారత్, మధ్య ప్రాచ్య దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. రిటైల్ విపణి, ఆభరణాల పరిశ్రమలో సచిన్కు ఉన్న అనుభవం.. దేశీయ పసిడి పరిశ్రమపై వినియోగదార్ల నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూజీసీ గ్లోబల్ సీఈఓ డేవిడ్ టెయిట్ వెల్లడించారు. ప్రస్తుతం డబ్ల్యూజీసీ భారత సీఈఓగా ఉన్న సోమసుందరమ్, ఇకపై సలహాదారు హోదాలో పని చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్