సునీల్ మిత్తల్కు బ్రిటన్ నైట్హుడ్
భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ (66)కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్, భారత వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్హుడ్ పొందనున్నారు.
కింగ్ ఛార్లెస్ నుంచి ఈ పురస్కారం పొందనున్న తొలి భారతీయుడు
లండన్: భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ (66)కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్, భారత వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్హుడ్ పొందనున్నారు. యూకే కేబినెట్ ఆఫీస్ ఆవిష్కరించిన ఈ గౌరవ బ్రిటిష్ పురస్కారాల జాబితాలో మిత్తల్కు మోస్ట్ ఎక్సెలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ కింద నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్(కేబీఈ)ను ప్రకటించారు. కింగ్ ఛార్లెస్ నుంచి ఈ గౌరవాన్ని పొందనున్న తొలి భారతీయ పౌరుడు మిత్తలే. బ్రిటిష్ హై కమిషనర్ నిర్వహించే ఈ అవార్డుల ప్రదానోత్సవ తేదీని తర్వాత ప్రకటిస్తారు. ఆ సమయంలో అధికారికంగా మిత్తల్కు ఈ అరుదైన గౌరవాన్ని అందజేస్తారు.భారత్లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను 2007లో మిత్తల్ పొందారు.
అంతక్రితం వీరికి..: సాధారణంగా బ్రిటన్ పౌరులకు నైట్హుడ్ ఇస్తే వారి పేర్లకు ముందు సర్ లేదా డేమ్ హోదాను ఇస్తారు. బ్రిటిష్యేతర్లకు మాత్రం వారి పేర్ల ముందు కేబీఈ (మహిళలకైతే డీబీఈ)ని ఉంచుతారు. అంతక్రితం గౌరవ కేబీఈని రతన్ టాటా (2009), రవి శంకర్(2001), జెంషెడ్జీ ఇరానీ(1997)లకు దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 అందజేశారు.
‘ఇది అత్యంత గౌరవం’..మిత్తల్: ‘బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 నుంచి దక్కిన ఈ గుర్తింపును అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. యూకే, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఇవి మరింత బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దేశాన్ని ఆకర్షణీయ పెట్టబడి స్థానంగా మార్చడంలో శ్రద్ధ వహించిన యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని సునీల్ మిత్తల్ సంతోషం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో విశిష్ఠ సేవలందించిన విదేశీ పౌరులను ఈ పురస్కారం(కేబీఈ)తో గౌరవిస్తుంటారు.
బ్రిటన్తో అనుబంధమిదీ..: ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం, ఇతర పెట్టుబడిదార్లతో కలిసి వన్వెబ్ (ప్రస్తుతం యూటెల్శాట్)ను పునరుజ్జీవింపజేసి అంతర్జాతీయంగా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి మిత్తల్ కృషి చేస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఎయిర్టెల్ ఆఫ్రికా నమోదై ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట