రూ.6 లక్షల కోట్ల సంపద హాంఫట్
బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బుధవారం సూచీలు డీలాపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి.
సమీక్ష
బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బుధవారం సూచీలు డీలాపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల పతనంలో, రిలయన్స్ షేరు ఒక్కటే 185.59 పాయింట్ల నష్టాలకు కారణమైంది. ఈ షేరు రూ.61.40 తగ్గి, రూ.2909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22,000 పాయింట్ల దిగువకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 82.91 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.90% నష్టపోయి 82.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సూచీల నష్టాల నేపథ్యంలో.. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.6.02 లక్షల కోట్లు తగ్గి రూ.385.97 లక్షల కోట్ల (4.71 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 73,162.82 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ, మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకదశలో 72,222.29 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.20 పాయింట్లు కోల్పోయి 21,951.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,915.85- 22,229.15 పాయింట్ల మధ్య కదలాడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 26 నష్టాలు నమోదుచేశాయి. పవర్గ్రిడ్ 4.43%, మారుతీ 3.06%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.93%, ఎం అండ్ ఎం 2.68%, విప్రో 2.68%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.49%, ఏషియన్ పెయింట్స్ 2.37%, టాటా స్టీల్ 2.36%, రిలయన్స్ 2.07% డీలాపడ్డాయి. హెచ్యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ 0.68% వరకు లాభపడ్డాయి.
- ఆకట్టుకున్న జునిపర్ హోటల్స్: హయత్ బ్రాండ్ కింద హోటళ్లను నిర్వహిస్తున్న జునిపర్ హోటల్స్ షేరు ఇష్యూ ధర రూ.360తో పోలిస్తే బీఎస్ఈలో 0.33% నష్టంతో రూ.361.20 వద్ద షేరు ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని 10.36% లాభంతో రూ.397.30 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,840.02 కోట్లుగా నమోదైంది.
- రూ.45,000 కోట్ల నిధుల సమీకరణ ప్రకటన మదుపర్లను మెప్పించకపోవడంతో వొడాఫోన్ ఐడియా షేరు 13.99% క్షీణించి రూ.13.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,806.71 కోట్లు తగ్గి రూ.66,447.95 కోట్లకు పరిమితమైంది.
- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతుండటంతో, మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో 4.99% కోల్పోయి రూ.406.15 వద్ద లోయర్ సర్క్యూట్కు పడిపోయింది.
- ఆర్కే స్వామి లిమిటెడ్ ఐపీఓ మార్చి 4న ప్రారంభమై 6న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.270- 288 నిర్ణయించారు. రిటైల్ మదుపర్లకు ఒకలాట్ 50 షేర్లుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.423 కోట్లు సమీకరించనుంది.
- ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 27.76 రెట్ల స్పందన లభించింది.
- ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలోని కంపెనీ సైట్లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఎమ్డీసీ వెల్లడించింది.
- విమాన లీజుదారు సెలెస్టియల్ ఏవియేషన్తో రూ.250 కోట్ల వివాదాన్ని స్పైస్జెట్ సెటిల్ చేసుకుంది. మార్చి 1న ఇరు సంస్థలు అధికారికంగా వివాదాన్ని పరిష్కరించుకోనున్నాయి. సెటిల్మెంట్ గురించి ఎన్సీఎల్టీకి సమాచారం అందించాయి.
- బ్రిటన్లో అతిపెద్ద విద్యుత్ వాహన బ్యాటరీ తయారీ కేంద్రాన్ని సోమర్సెట్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ గ్లోబల్ బ్యాటరీ వ్యాపార విభాగం అగ్రతాస్ వెల్లడించింది.
- ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జరిగిన షేర్ల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన కేసులో బ్రైట్కామ్ గ్రూప్ ప్రమోటర్ సురేశ్ కుమార్ రెడ్డి, ఇతరులపై విధించిన నియంత్రణలను ఉపసంహరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిరాకరించింది. నమోదిత కంపెనీలు, దాని అనుబంధ సంస్థల్లో డైరెక్టర్ వంటి కీలక పదవులు చేపట్టకుండా సంబంధితులపై విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
- ఆదిత్య బిర్లా వెంచర్స్, సిడ్బీల నుంచి 2 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు అంతరిక్ష అంకుర సంస్థ దిగాంతర వెల్లడించింది. తద్వారా ఈ రంగంలోకి బిర్లా, సిడ్బీ అడుగుపెట్టినట్లు తెలిపింది.
మార్కెట్ల నష్టాలకు కారణాలివే..
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు మరింత ఆలస్యం కావొచ్చన్న అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కారణమయ్యాయి.
- గత రెండు నెలల్లో దేశీయ మార్కెట్లు భారీగా దూసుకెళ్లడంతో షేర్ల విలువలు అధిక స్థాయులకు చేరాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మదుపర్లు అప్రమత్తత పాటించడానికి మొగ్గుచూపుతున్నారు.
- చైనా స్థిరాస్తి సంక్షోభంతో ఆసియా మార్కెట్లు కుదేలవ్వగా.. ఈ ప్రభావంతో మిగతా అంతర్జాతీయ మార్కెట్లు అదే బాటలో నడిచాయి.
- ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనుండటంతో, మదుపర్లు పొజిషన్లను ముగిస్తున్నారు. ఇది లాభాల స్వీకరణకు దారితీస్తోంది.
- మార్కెట్ ఒడుదొడుకుల నుంచి చిన్న మదుపర్లను సంరక్షించాల్సిందిగా మ్యూచువల్ ఫండ్లను సెబీ ఆదేశించింది. దీంతో స్మాల్, మిడ్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల జోరు తగ్గొచ్చన్న భయాలు పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?