మూడో త్రైమాసికం.. భళా ఆర్థికం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది.
8.4 శాతానికి వృద్ధిరేటు
2023-24 వృద్ధి అంచనా 7.6 శాతానికి పెంపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవ్వడం, గనుల తవ్వకం, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. 2022-23 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో వృద్ధి రేటు 4.3 శాతమే కావడం గమనార్హం.
ఏ రంగం ఎలా..: సమీక్షా త్రైమాసికంలో తయారీ రంగం 11.6% వృద్ధి చెందింది. ఏడాది క్రితం ఇదే మూడు నెలల్లో 4.8% క్షీణించింది. ఇదే సమయంలో గనుల తవ్వక వృద్ధి రేటు 1.4% నుంచి 7.5 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం మాత్రం మార్పు లేకుండా 9.5% వృద్ధి రేటును కొనసాగించింది. వ్యవసాయ రంగ వృద్ధి 5.2% నుంచి 0.8 శాతానికి పరిమితమైంది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా పెరిగింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది. గురువారం విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో దీన్ని 7.6 శాతానికి పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.2 శాతమని గతంలో పేర్కొనగా, దీన్ని 7 శాతానికి తగ్గించింది.
- 2023-24లో వాస్తవ జీడీపీ (2011-12 స్థిర ధరల వద్ద) రూ.172.90 లక్షల కోట్లుగా నమోదవుతుందని అంచనా వేసింది. 2022-23 తొలి ముందస్తు అంచనా రూ.160.71 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద మాత్రం 2023-24 ఏడాదికి జీడీపీ రూ.293.90 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. 2022-23లో ఇది రూ.269.50 లక్షల కోట్లుగా ఉంది.
- సమీక్షా త్రైమాసికం విషయానికొస్తే.. స్థిర ధరల వద్ద జీడీపీ రూ.43.72 లక్షల కోట్లుగా ఎన్ఎస్ఓ అంచనా వేసింది. 2022-23 మూడో త్రైమాసికం నాటి రూ.40.35 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ప్రస్తుత ధరల వద్ద చూస్తే రూ.68.58 లక్షల కోట్ల నుంచి 10.1% వృద్ధితో రూ.75.49 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపింది.
- తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2021-22లో రూ.1,50,906; 2022-23లో రూ.1,69,496గా ఎన్ఎస్ఓ అంచనా వేసింది.
దేశ సామర్థ్యానికి నిదర్శనం
తాజా జీడీపీ గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సామ ర్థ్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి. వేగవంత వృద్ధికి, 140 కోట్ల మంది భారతీయులు అత్యుత్తమ జీవనాన్ని గడిపేందుకు, ‘వికసిత భారత్’ను సృష్టించేందుకు ప్రభుత్వం తన చర్యలను కొనసాగిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81