సంక్షిప్త వార్తలు
దేశ వ్యాప్తంగా రూ.1.62 లక్షల కోట్ల చమురు-గ్యాస్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బిహార్లోని బెగుసరాయ్ జిల్లా నుంచి ఆవిష్కరించారు.
రూ.1.62 లక్షల కోట్ల చమురు-గ్యాస్ ప్రాజెక్టుల ఆవిష్కరణ
బిహార్: దేశ వ్యాప్తంగా రూ.1.62 లక్షల కోట్ల చమురు-గ్యాస్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బిహార్లోని బెగుసరాయ్ జిల్లా నుంచి ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులు బిహార్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉన్నాయి. ‘వికసిత భారత్’ కార్యక్రమంలో భాగంగా బిహార్ను అభివృద్ధి చేయాలని తీర్మానించుకుని బెగుసరాయ్ జిల్లాకు వచ్చానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభావంతులైన యువత, బలమైన రైతులు, కార్మికులు ఉన్నారని కితాబిచ్చారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఇప్పుడు ఆవిష్కరించిన ఈ చమురు-గ్యాస్ ప్రాజెక్టులు కూడా దోహదం చేస్తాయని వివరించారు. 4 రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం నీతీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్లో ఓఎన్జీసీకి చెందిన కేజీ బ్లాక్ కేజీ-డీడబ్ల్యూఎన్-98/2లో జనవరి నుంచి ముడి చమురు ఉత్పత్తి ప్రారంభం కాగా, తొలి ట్యాంకర్ ‘స్వర్ణ సింధు’ను శనివారం మోదీ జెండా ఊపి ప్రారంభించారని సంస్థ తెలిపింది. గరిష్ఠ సామర్థ్యం వద్ద ఈ ప్రాజెక్టు.. భారత చమురు-గ్యాస్ ఉత్పత్తికి 7 శాతం జత చేయగలదని పేర్కొంది.
విస్తరణ బాటలో ఏవెన్స్ ఇండియా
ఈనాడు, హైదరాబాద్: వాహనాలను అద్దెకు ఇచ్చే ఏవెన్స్ ఇండియా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం 44,000 వాహనాలను సిద్ధం చేసింది. దేశంలో 280కి పైగా ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యుత్ వాహనాలనూ అధికంగా వినియోగించనుంది. ఏవెన్స్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ సువాజిత్ కర్మాకర్ మాట్లాడుతూ.. వాహనాలను అద్దెకిచ్చే సేవల రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు తెలిపారు. ఏఎల్డీ ఆటోమోటివ్, లీజ్ప్లాన్ ఇండియా కలిసి ఏవెన్స్ ఇండియాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్