తప్పు చేసి.. క్షమాపణ చెబితే సరిపోదు: ఏఐ ప్లాట్ఫారాలకు కేంద్రం సూచనలు
ప్రధాని మోదీపై అడిగిన ప్రశ్నలకు గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్ ప్రతిస్పందన వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్ఫామ్లకు సలహా పత్రాన్ని(అడ్వైజరీ) జారీ చేసింది.
దిల్లీ: ప్రధాని మోదీపై అడిగిన ప్రశ్నలకు గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్ ప్రతిస్పందన వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్ఫామ్లకు సలహా పత్రాన్ని(అడ్వైజరీ) జారీ చేసింది. పరీక్ష దశలో ఉన్న ఏఐ నమూనాలను లేబుల్ చేయడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను హోస్ట్ చేయడాన్ని నిరోధించడానికి ఈ సలహా పత్రాన్ని జారీ చేసింది. ఈ నెల 1న ఇంటర్మీడియరీలు/ప్లాట్ఫామ్లకు జారీ చేసిన అడ్వైజరీలో.. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలు పాటించని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ఇంటర్మీడియరీలు లేదా ప్లాట్ఫామ్లు కృత్రిమ మేధ(ఏఐ) నమూనాలు/ఎల్ఎల్ఎం/జనరేటివ్ ఏఐ, సాఫ్ట్వేర్లు లేదా అల్గారిథమ్లను వాటి కంప్యూటర్ రిసోర్స్లో లేదా దాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదార్లను హోస్ట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, సవరించడానికి, ప్రదర్శించడానికి అనుమతించకూడదని సలహా పత్రంలో ప్రభుత్వం సూచించింది. ఏదైనా ఉల్లంఘనలకు అన్ని ప్లాట్ఫామ్లు, ఇంటర్మీడియరీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.
గూగుల్ జెమిని ఏఐ ప్లాట్ఫామ్ ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందించిన తీరు ఐటీ చట్టాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. తన ప్లాట్ఫామ్ ఇంకా పరీక్ష (ట్రయల్) దశలోనే ఉందని గూగుల్ అంటున్నా, విచారణ నుంచి తప్పించుకోవడానికి దీన్ని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపారు. ముందు తప్పు చేసి తర్వాత క్షమాపణలు చెప్పి బాధ్యతల నుంచి ఏ ప్లాట్ఫామ్ కూడా తప్పించుకోలేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
యాపిల్ కంపెనీ ఐఓఎస్18తో కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్లో ఏఐ సదుపాయాన్ని జోడించాలనుకుంటోంది. అందులో భాగంగా యాపిల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు