మన విమానం ఆకర్షణీయం
మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్యలో శర వేగం
ఆదాయాలు, లాభాల్లో వృద్ధి
మౌలిక సదుపాయాలు విస్తరిస్తే ఇంకా మేలు
ఈనాడు, హైదరాబాద్:
మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్ ముందు దేశీయంగా ఏడాదికి దాదాపు 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా విమాన ప్రయాణాలు చేసినట్లు రేటింగ్, కన్సల్టెన్సీ సేవల సంస్థ ఇక్రా వివరించింది. మనదేశం నుంచి విదేశాలకు ప్రయాణాలు చేసిన వారి సంఖ్య కొవిడ్ ముందు ఏడాదికి 2.5 కోట్లు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ సంఖ్యకు దగ్గరగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 2.7 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. తద్వారా క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 7-12% వృద్ధి ఉంటుందని అంచనా. ఈ సానుకూలత వల్ల విమానయాన రంగంలోని సంస్థల ఆదాయాలు, లాభాలు పెరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగి, విమాన సేవల సంస్థలు ఆకర్షణీయ ఆదాయాలు నమోదు చేస్తాయని ఇక్రా పేర్కొంది. విమాన ఇంజిన్ల సమస్య, విమాన ఇంధన ధర అధికంగా ఉండటం, సరఫరా వ్యవస్థ అంతరాయాలున్నా, దేశీయ విమానయాన రంగం దూసుకెళ్తోందని విశ్లేషించింది.
ప్రపంచ సగటు కంటే అధిక వృద్ధి
వచ్చే కొన్నేళ్ల పాటు ప్రపంచ సగటు కంటే భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని బోయింగ్, ఇటీవల పేర్కొంది. మనదేశ జనాభా ప్రస్తుతం 140 కోట్లకు దగ్గరగా ఉండగా, 2042 నాటికి 160 కోట్లకు చేరుతుందని అంచనా. అదే సమయంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య ప్రస్తుత 35 కోట్ల నుంచి 70 కోట్లకు పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకునే వారి సంఖ్య ఇప్పుడు 25 కోట్లు కాగా, 2042 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పెరగొచ్చు. దీంతో పాటు విమానాల ద్వారా సరకు రవాణాలోనూ భారీ అవకాశాలున్నట్లు విశ్లేషించింది. వచ్చే 20 ఏళ్లలో మనదేశంలో సరకు రవాణా విమానాల సంఖ్య 80కు పెరుగుతుందని బోయింగ్ అంచనా వేసింది.
భారతదేశం కేంద్ర స్థానం అవుతుంది
వచ్చే 15 ఏళ్లలో భారతదేశం విమాన పరిశ్రమకు కేంద్ర స్థానం అవుతుందని ఎయిర్బస్ భావిస్తోంది. సమీప భవిష్యత్తులో విమాన పరిశ్రమకు అధిక డిమాండ్ కలిగిన పెద్ద మార్కెట్ భారతదేశమే. ఈ పరిశ్రమకు కేంద్రస్థానంగా భారత్ మారుతుందనడంలో సందేహం లేదని ఎయిర్బస్ ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్బస్ విమానాల కొనుగోలుకు గత ఏడాదిలో రెండు అతిపెద్ద ఆర్డర్లు లభించింది మనదేశం నుంచే కావడం గమనార్హం. ఎయిర్ఇండియా 470 విమానాల (250 ఎయిర్బస్, 220 బోయింగ్ విమానాలు)కు ఆర్డర్ ఇవ్వగా, ఇండిగో 500 విమానాలు (ఎయిర్బస్ ఏ320 నియో) ఆర్డర్ చేసింది.
విమానాశ్రయాల్లో సదుపాయాలు పెరగాలి
ప్రయాణికులు, సరకు రవాణా విభాగాల్లో అధిక వృద్ధి అంచనాలకు అనుగుణంగా విమానాశ్రయాల్లో, సంబంధిత ఇతర విభాగాల్లో సదుపాయాలను పెద్దఎత్తున విస్తరించాల్సి ఉందని ఎయిర్బస్ అభిప్రాయపడుతోంది. దేశీయ ప్రయాణికులు.. అంతర్జాతీయ విమాన సర్వీసుకు మారాలన్నా; విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు దేశీయ విమాన సర్వీసుకు మారడం మన విమానాశ్రయాల్లో ఎంతో ఇబ్బందితో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఈ ప్రక్రియను సరిదిద్దాల్సి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు మెరుగుపరచాల్సి ఉందని ఎయిర్బస్ పేర్కొంది. సింగపూర్, దుబాయ్, దోహ.. తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసుకు మారడం ఎంతో సులువుగా ఉందని ఉదాహరణగా చూపుతోంది.
అక్కడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మారినంత సులువుగా విమాన సర్వీసు మారే వీలుందని పేర్కొంది. ప్రయాణికులు బ్యాగేజీ మోయాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు తమ బ్యాగేజీ పోతుందనే భయం కానీ అక్కడ ఉండదు. ఆగ్నేయ ఆసియా దేశాలకు, పశ్చిమ ఆసియా/ ఐరోపా దేశాల మధ్య ‘ట్రాన్సిట్ హబ్’ గా మనదేశంలోని విమానాశ్రయాలు మారాలంటే, ఇటువంటి సదుపాయాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాల్సి ఉంది. దానివల్ల అంతర్జాతీయ విమానాలను, ప్రయాణికులను అధికంగా ఆకర్షించే అవకాశం ఏర్పడుతుంది.
కొత్త విమానాలు మరింత ఆలస్యం?
విమానాలు, ఇంజిన్ తయారీ సంస్థలకు సరఫరాల పరంగా ఎదురవుతున్న ఆటంకాల వల్ల, దేశీయ విమానయాన సంస్థలు ఆర్డరు ఇచ్చిన విమానాల డెలివరీ కొంత ఆలస్యం కావచ్చని ఇక్రా పేర్కొంది. దేశీయ విమానాయాన సంస్థలన్నీ కలిపి దాదాపు 1700 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఇందులో ఎయిరిండియా, ఆకాశ ఎయిర్, ఇండిగో ఆర్డర్లే 1120 విమానాలున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఇవి క్రమంగా డెలివరీ కావాల్సి ఉంది. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సమస్యలు ఎదుర్కొంటుండగా, ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తన ఇంజిన్ల వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. దేశంలో కొన్ని విమానాలు వివిధ సమస్యల వల్ల కార్యకలాపాలు నిలిపేశాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొత్త విమానాల చేరిక కొంత ఆలస్యం కావచ్చన్నది ఇక్రా అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్