మన విమానం ఆకర్షణీయం
మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్యలో శర వేగం
ఆదాయాలు, లాభాల్లో వృద్ధి
మౌలిక సదుపాయాలు విస్తరిస్తే ఇంకా మేలు
ఈనాడు, హైదరాబాద్:
మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కొవిడ్ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికే అధిగమించగా, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా ఆకర్షణీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్ ముందు దేశీయంగా ఏడాదికి దాదాపు 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా విమాన ప్రయాణాలు చేసినట్లు రేటింగ్, కన్సల్టెన్సీ సేవల సంస్థ ఇక్రా వివరించింది. మనదేశం నుంచి విదేశాలకు ప్రయాణాలు చేసిన వారి సంఖ్య కొవిడ్ ముందు ఏడాదికి 2.5 కోట్లు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ సంఖ్యకు దగ్గరగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 2.7 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. తద్వారా క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 7-12% వృద్ధి ఉంటుందని అంచనా. ఈ సానుకూలత వల్ల విమానయాన రంగంలోని సంస్థల ఆదాయాలు, లాభాలు పెరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగి, విమాన సేవల సంస్థలు ఆకర్షణీయ ఆదాయాలు నమోదు చేస్తాయని ఇక్రా పేర్కొంది. విమాన ఇంజిన్ల సమస్య, విమాన ఇంధన ధర అధికంగా ఉండటం, సరఫరా వ్యవస్థ అంతరాయాలున్నా, దేశీయ విమానయాన రంగం దూసుకెళ్తోందని విశ్లేషించింది.
ప్రపంచ సగటు కంటే అధిక వృద్ధి
వచ్చే కొన్నేళ్ల పాటు ప్రపంచ సగటు కంటే భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని బోయింగ్, ఇటీవల పేర్కొంది. మనదేశ జనాభా ప్రస్తుతం 140 కోట్లకు దగ్గరగా ఉండగా, 2042 నాటికి 160 కోట్లకు చేరుతుందని అంచనా. అదే సమయంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య ప్రస్తుత 35 కోట్ల నుంచి 70 కోట్లకు పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకునే వారి సంఖ్య ఇప్పుడు 25 కోట్లు కాగా, 2042 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పెరగొచ్చు. దీంతో పాటు విమానాల ద్వారా సరకు రవాణాలోనూ భారీ అవకాశాలున్నట్లు విశ్లేషించింది. వచ్చే 20 ఏళ్లలో మనదేశంలో సరకు రవాణా విమానాల సంఖ్య 80కు పెరుగుతుందని బోయింగ్ అంచనా వేసింది.
భారతదేశం కేంద్ర స్థానం అవుతుంది
వచ్చే 15 ఏళ్లలో భారతదేశం విమాన పరిశ్రమకు కేంద్ర స్థానం అవుతుందని ఎయిర్బస్ భావిస్తోంది. సమీప భవిష్యత్తులో విమాన పరిశ్రమకు అధిక డిమాండ్ కలిగిన పెద్ద మార్కెట్ భారతదేశమే. ఈ పరిశ్రమకు కేంద్రస్థానంగా భారత్ మారుతుందనడంలో సందేహం లేదని ఎయిర్బస్ ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్బస్ విమానాల కొనుగోలుకు గత ఏడాదిలో రెండు అతిపెద్ద ఆర్డర్లు లభించింది మనదేశం నుంచే కావడం గమనార్హం. ఎయిర్ఇండియా 470 విమానాల (250 ఎయిర్బస్, 220 బోయింగ్ విమానాలు)కు ఆర్డర్ ఇవ్వగా, ఇండిగో 500 విమానాలు (ఎయిర్బస్ ఏ320 నియో) ఆర్డర్ చేసింది.
విమానాశ్రయాల్లో సదుపాయాలు పెరగాలి
ప్రయాణికులు, సరకు రవాణా విభాగాల్లో అధిక వృద్ధి అంచనాలకు అనుగుణంగా విమానాశ్రయాల్లో, సంబంధిత ఇతర విభాగాల్లో సదుపాయాలను పెద్దఎత్తున విస్తరించాల్సి ఉందని ఎయిర్బస్ అభిప్రాయపడుతోంది. దేశీయ ప్రయాణికులు.. అంతర్జాతీయ విమాన సర్వీసుకు మారాలన్నా; విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు దేశీయ విమాన సర్వీసుకు మారడం మన విమానాశ్రయాల్లో ఎంతో ఇబ్బందితో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఈ ప్రక్రియను సరిదిద్దాల్సి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు మెరుగుపరచాల్సి ఉందని ఎయిర్బస్ పేర్కొంది. సింగపూర్, దుబాయ్, దోహ.. తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసుకు మారడం ఎంతో సులువుగా ఉందని ఉదాహరణగా చూపుతోంది.
అక్కడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మారినంత సులువుగా విమాన సర్వీసు మారే వీలుందని పేర్కొంది. ప్రయాణికులు బ్యాగేజీ మోయాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు తమ బ్యాగేజీ పోతుందనే భయం కానీ అక్కడ ఉండదు. ఆగ్నేయ ఆసియా దేశాలకు, పశ్చిమ ఆసియా/ ఐరోపా దేశాల మధ్య ‘ట్రాన్సిట్ హబ్’ గా మనదేశంలోని విమానాశ్రయాలు మారాలంటే, ఇటువంటి సదుపాయాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాల్సి ఉంది. దానివల్ల అంతర్జాతీయ విమానాలను, ప్రయాణికులను అధికంగా ఆకర్షించే అవకాశం ఏర్పడుతుంది.
కొత్త విమానాలు మరింత ఆలస్యం?
విమానాలు, ఇంజిన్ తయారీ సంస్థలకు సరఫరాల పరంగా ఎదురవుతున్న ఆటంకాల వల్ల, దేశీయ విమానయాన సంస్థలు ఆర్డరు ఇచ్చిన విమానాల డెలివరీ కొంత ఆలస్యం కావచ్చని ఇక్రా పేర్కొంది. దేశీయ విమానాయాన సంస్థలన్నీ కలిపి దాదాపు 1700 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఇందులో ఎయిరిండియా, ఆకాశ ఎయిర్, ఇండిగో ఆర్డర్లే 1120 విమానాలున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఇవి క్రమంగా డెలివరీ కావాల్సి ఉంది. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సమస్యలు ఎదుర్కొంటుండగా, ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తన ఇంజిన్ల వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. దేశంలో కొన్ని విమానాలు వివిధ సమస్యల వల్ల కార్యకలాపాలు నిలిపేశాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొత్త విమానాల చేరిక కొంత ఆలస్యం కావచ్చన్నది ఇక్రా అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
అనేక పాశ్చాత్య దేశాల సంస్థలు తమ పెట్టుబడులను పెట్టేందుకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. -
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు..
తాజా వార్తలు (Latest News)
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్