రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి.
సమీక్ష
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు తగ్గి 83.33 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 0.96% నష్టంతో 85.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 72,692.16 పాయింట్ల వద్ద ప్రారంభమై ఆద్యంతం సానుకూలంగా కదలాడింది. ఒక దశలో 668.43 పాయింట్లు లాభపడి 73,138.73 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 526.01 పాయింట్ల లాభంతో 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 118.95 పాయింట్ల లాభంతో 22,123.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,193.60-22,052.85 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.6%, మారుతీ సుజుకీ 2.16%, టైటన్ 1.65%, బజాజ్ ఫైనాన్స్ 1.63%, యాక్సిస్ బ్యాంక్ 1.23%, కోటక్ బ్యాంక్ 1.18% చొప్పున పెరిగాయి. విప్రో 1.57%, హెచ్సీఎల్ టెక్ 1.02%, టీసీఎస్ 1.02% మేర తగ్గాయి.
రూ.20 లక్షల కోట్లు మించిన ఆర్ఐఎల్ విలువ
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లను అధిగమించింది. ఈ షేరు ధర ఎన్ఎస్ఈలో 3.48% పెరిగి రూ.2983.75 వద్ద స్థిరపడగా, బీఎస్ఈలో 3.60% రాణించి రూ.2983.85 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ.70,039.26 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరింది. ఇంట్రాడేలో ఆర్ఐఎల్ షేరు ఒక దశలో 4% వరకు పెరిగి రూ.2,999.90 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.
- మారుతీ సుజుకీ మార్కెట్ విలువ ఇంట్రాడేలో రూ.4 లక్షల కోట్లను అధిగమించింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో ఒక దశలో ఈ షేరు 3.82% పెరిగి రూ.12,724.95 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసినప్పుడు, మార్కెట్ విలువ రూ.4,00,075.70 కోట్లకు చేరింది. చివరకు షేరు రూ.12,550 వద్ద ముగియడంతో మార్కెట్ విలువ రూ.3,94,575.23 కోట్లుగా నమోదైంది.
- దిగ్గజ న్యాయ సంస్థ శార్దూల్ అమర్చంద్ మంగళదాస్ అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ పల్లవి ష్రాఫ్ ఏషియన్ పెయింట్స్ స్వతంత్ర డైరెక్టర్గా కొనసాగేందుకు రెండోసారీ నిరాకరించారు.
- స్టూడెంట్ రిక్రూట్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ క్రిజాక్ లిమిటెడ్ రూ.1,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
- పీఎన్ గాడ్జిల్ జ్యువెలర్స్ రూ.1,100 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేసింది.
- 2024 ఆఖరుకు సంయుక్తంగా 5,000 వాహన ఛార్జింగ్ స్టేషన్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు టాటా మోటార్స్, హెచ్పీసీఎల్ జట్టు కట్టాయి.
- అదానీ పవర్ నుంచి 1600 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.4,000 కోట్ల ఆర్డర్ను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) దక్కించుకుంది.
- సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్)లో 7.18% వాటాను రూ.1,266 కోట్లకు స్టాండర్డ్ ఛార్టెర్డ్ బ్యాంక్ బుధవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా విక్రయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?