ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది.
నేటి నుంచి టీ+0 సెటిల్మెంట్
దిల్లీ
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. ఈ పద్ధతిని మరింత మెరుగు పరచి.. కొనుగోలు/అమ్మకం లావాదేవీ జరిగిన రోజే సెటిల్ చేసే టీ+0 విధానాన్ని గురువారం (ఈనెల 28) నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) అందుబాటులోకి తేనున్నాయి. తొలుత 25 కంపెనీల షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకే ఈ అవకాశాన్ని ఎక్స్ఛేంజీలు అందుబాటులోకి తెచ్చాయి. మిగిలిన కంపెనీల షేర్లకు టీ+1 సెటిల్మెంట్ అమలవుతుంది.
ప్రయోజనాలివీ: టీ+0 అంటే అదే రోజు సెటిల్మెంట్ వల్ల, మార్కెట్ కార్యకలాపాల వ్యయాలు, సమయం ఆదా అవుతాయి. మదుపర్ల నుంచి వసూలు చేసే రుసుముల్లో పారదర్శకత రావడంతో పాటు క్లియరింగ్ కార్పొరేషన్లలో నష్ట నియంత్రణ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఇది దోహదం చేయనుంది.
‘2024 మార్చి 28న పరిమిత సంఖ్యలో షేర్లకు టీ+0 సెటిల్మెంట్ను ప్రారంభించడం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా భారత ట్రేడింగ్ మౌలిక వసతులను మార్చడంలో కీలక అడుగు అవుతుంది. పటిష్ఠమైన, ముప్పు రహిత మార్కెట్ వ్యవస్థకు ఇది మార్గం చూపుతుంద’ని స్టాక్స్బాక్స్ సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు. సెబీ బోర్డు సంప్రదింపులు, అనుమతుల అనంతరం.. ఐచ్ఛిక పద్ధతిలో మార్చి 28 నుంచి టీ+0 ట్రేడ్ సెటిల్మెంట్ బీటా వెర్షన్ను ప్రారంభించేందుకు గతవారం సెబీ విధివిధానాలు జారీ చేసింది.
తొలిదశలో ఈ షేర్లు
తొలి దశలో టీ+0 సెటిల్మెంట్ అయ్యే షేర్ల వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. అవి
1) బజాజ్ ఆటో 2) వేదాంతా 3) హిందాల్కో ఇండస్ట్రీస్, 4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5) ట్రెంట్ 6) టాటా కమ్యూనికేషన్స్ 7) నెస్లే ఇండియా 8) సిప్లా 9) ఎంఆర్ఎఫ్ 10) జేఎస్డబ్ల్యూ స్టీల్, 11) బీపీసీఎల్ 12) ఓఎన్జీసీ 13) అంబుజా సిమెంట్స్ 14) అశోక్ లేలాండ్ 15) బ్యాంక్ ఆఫ్ బరోడా 16) బిర్లా సాఫ్ట్ 17) కోఫోర్జ్ 18) దివీస్ లేబొరేటరీస్ 19) ఇండియన్ హోటల్స్ 20) ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 21) ఎల్టీఐ మైండ్ ట్రీ 22) యూనియన్ బ్యాంక్ ఇండియా 23) ఎన్ఎమ్డీసీ 24) సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్ 25) పెట్రోనెట్ ఎల్ఎన్జీ
ఐచ్ఛికంగానే: బీటా దశ కింద ఐచ్ఛికంగా మాత్రమే టీ+0 సెటిల్మెంట్ అమలవుతుంది. ఎంపిక చేసిన బ్రోకర్ల పరిధిలోని మదుపర్లు అందరూ దీనిని వినియోగించుకోవచ్చు. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రేడింగ్కు దీనిని అమలు చేస్తారు. సూచీని గణించడంలో, టీ+0 కింద సెటిల్ అయిన షేర్ల విలువలను పరిగణనలోకి తీసుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి