ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది.
నేటి నుంచి టీ+0 సెటిల్మెంట్
దిల్లీ
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. ఈ పద్ధతిని మరింత మెరుగు పరచి.. కొనుగోలు/అమ్మకం లావాదేవీ జరిగిన రోజే సెటిల్ చేసే టీ+0 విధానాన్ని గురువారం (ఈనెల 28) నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) అందుబాటులోకి తేనున్నాయి. తొలుత 25 కంపెనీల షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకే ఈ అవకాశాన్ని ఎక్స్ఛేంజీలు అందుబాటులోకి తెచ్చాయి. మిగిలిన కంపెనీల షేర్లకు టీ+1 సెటిల్మెంట్ అమలవుతుంది.
ప్రయోజనాలివీ: టీ+0 అంటే అదే రోజు సెటిల్మెంట్ వల్ల, మార్కెట్ కార్యకలాపాల వ్యయాలు, సమయం ఆదా అవుతాయి. మదుపర్ల నుంచి వసూలు చేసే రుసుముల్లో పారదర్శకత రావడంతో పాటు క్లియరింగ్ కార్పొరేషన్లలో నష్ట నియంత్రణ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఇది దోహదం చేయనుంది.
‘2024 మార్చి 28న పరిమిత సంఖ్యలో షేర్లకు టీ+0 సెటిల్మెంట్ను ప్రారంభించడం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా భారత ట్రేడింగ్ మౌలిక వసతులను మార్చడంలో కీలక అడుగు అవుతుంది. పటిష్ఠమైన, ముప్పు రహిత మార్కెట్ వ్యవస్థకు ఇది మార్గం చూపుతుంద’ని స్టాక్స్బాక్స్ సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు. సెబీ బోర్డు సంప్రదింపులు, అనుమతుల అనంతరం.. ఐచ్ఛిక పద్ధతిలో మార్చి 28 నుంచి టీ+0 ట్రేడ్ సెటిల్మెంట్ బీటా వెర్షన్ను ప్రారంభించేందుకు గతవారం సెబీ విధివిధానాలు జారీ చేసింది.
తొలిదశలో ఈ షేర్లు
తొలి దశలో టీ+0 సెటిల్మెంట్ అయ్యే షేర్ల వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. అవి
1) బజాజ్ ఆటో 2) వేదాంతా 3) హిందాల్కో ఇండస్ట్రీస్, 4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5) ట్రెంట్ 6) టాటా కమ్యూనికేషన్స్ 7) నెస్లే ఇండియా 8) సిప్లా 9) ఎంఆర్ఎఫ్ 10) జేఎస్డబ్ల్యూ స్టీల్, 11) బీపీసీఎల్ 12) ఓఎన్జీసీ 13) అంబుజా సిమెంట్స్ 14) అశోక్ లేలాండ్ 15) బ్యాంక్ ఆఫ్ బరోడా 16) బిర్లా సాఫ్ట్ 17) కోఫోర్జ్ 18) దివీస్ లేబొరేటరీస్ 19) ఇండియన్ హోటల్స్ 20) ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 21) ఎల్టీఐ మైండ్ ట్రీ 22) యూనియన్ బ్యాంక్ ఇండియా 23) ఎన్ఎమ్డీసీ 24) సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్ 25) పెట్రోనెట్ ఎల్ఎన్జీ
ఐచ్ఛికంగానే: బీటా దశ కింద ఐచ్ఛికంగా మాత్రమే టీ+0 సెటిల్మెంట్ అమలవుతుంది. ఎంపిక చేసిన బ్రోకర్ల పరిధిలోని మదుపర్లు అందరూ దీనిని వినియోగించుకోవచ్చు. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రేడింగ్కు దీనిని అమలు చేస్తారు. సూచీని గణించడంలో, టీ+0 కింద సెటిల్ అయిన షేర్ల విలువలను పరిగణనలోకి తీసుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం