అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి.
అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్కు 26% వాటా
దిల్లీ: సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. గౌతమ్ అదానీకి చెందిన ఒక విద్యుత్ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేయడం ఆశ్చర్య పరిచింది. అదానీ పవర్కు పూర్తి అనుబంధ కంపెనీ అయిన మహాన్ ఎనర్జెన్లో ఒక్కో షేరు రూ.10 ముఖ విలువ వద్ద మొత్తం 5 కోట్ల షేర్లను రిలయన్స్ కొనుగోలు చేసింది. ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాల కోసం సంస్థ వినియోగిస్తుంది. ఆ మేరకు 20 ఏళ్ల దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)ను మహాన్తో రిలయన్స్ కుదుర్చుకుంది.
అంబానీకి చమురు-గ్యాస్ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసినా.. పబ్లిక్ నెట్వర్క్ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అదానీ హాజరయ్యారు కూడా.
లోహ రంగంలోకి అదానీ
రూ.10,000 కోట్ల కాపర్ ప్లాంట్ తొలి దశ ప్రారంభం
గుజరాత్లోని ముంద్రా వద్ద నిర్మితమైన కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఒకే ప్రదేశంలో ఏర్పాటైన అతిపెద్ద కాపర్ ప్లాంటు ఇదేనని సంస్థ తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ కంపెనీ అయిన ‘కచ్ కాపర్’ 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,000 కోట్ల) కాపర్ రిఫైనరీలో తొలి దశను ప్రారంభించిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు తొలి బ్యాచ్ కాథోడ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. మన దేశ దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్లాంటు ఉపకరిస్తుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. తొలి దశలో ఏటా 0.5 మిలియన్ టన్నుల రిఫైన్డ్ కాపర్ను ఈ ప్లాంటు ఉత్పత్తి చేయనుంది. 2028-29 కల్లా పూర్తి స్థాయి(1 మిలియన్ టన్నుల) సామర్థ్యానికి చేరుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ ప్లాంటు వల్ల నేరుగా 2,000 మందికి, పరోక్షంగా 5000 మందికి ఉపాధి లభించనుంది.
అంబుజా సిమెంట్స్లో రూ.6,661 కోట్ల అదానీ పెట్టుబడులు
అంబుజా సిమెంట్స్లో అదానీ గ్రూప్ రూ.6,661 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా తన వాటాను 3.6% పెంచుకుని 66.7 శాతానికి చేర్చుకుంది. ఇందు కోసం ఒక్కో షేరు ధరను రూ.314.15 గా పరిగణించి, ప్రమోటరు సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కు చెందిన 21.20 కోట్ల వారెంట్లను షేర్లుగా మార్చుకోవడానికి అంబుజా సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది. 2028 కల్లా సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మి. టన్నులకు చేర్చుకోవాలన్న ప్రణాళికలకు తాజా పరిణామం ఉపయోగపడగలదని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఏసీసీ సహా అనుబంధ కంపెనీలను కలిపితే అంబుజా సిమెంట్స్కు ఏటా 77.4 మి. టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
రూ.19,700 కోట్ల రుణాలను ఒకే రుణంగా మార్చుకున్న అదానీ పవర్: కంపెనీకి చెందిన ఆరు ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)లు తీసుకున్న మొత్తం రూ.19,700 కోట్ల వేర్వేరు స్వల్పకాల రుణాలను ఒక దీర్ఘకాల రుణంగా అదానీ పవర్ ఏకీకరించింది. ఈ సర్దుబాటు వల్ల వడ్డీ రేటు తగ్గడంతో పాటు ఏకరూప గడువు ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే