అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి.
అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్కు 26% వాటా
దిల్లీ: సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. గౌతమ్ అదానీకి చెందిన ఒక విద్యుత్ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేయడం ఆశ్చర్య పరిచింది. అదానీ పవర్కు పూర్తి అనుబంధ కంపెనీ అయిన మహాన్ ఎనర్జెన్లో ఒక్కో షేరు రూ.10 ముఖ విలువ వద్ద మొత్తం 5 కోట్ల షేర్లను రిలయన్స్ కొనుగోలు చేసింది. ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాల కోసం సంస్థ వినియోగిస్తుంది. ఆ మేరకు 20 ఏళ్ల దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)ను మహాన్తో రిలయన్స్ కుదుర్చుకుంది.
అంబానీకి చమురు-గ్యాస్ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసినా.. పబ్లిక్ నెట్వర్క్ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అదానీ హాజరయ్యారు కూడా.
లోహ రంగంలోకి అదానీ
రూ.10,000 కోట్ల కాపర్ ప్లాంట్ తొలి దశ ప్రారంభం
గుజరాత్లోని ముంద్రా వద్ద నిర్మితమైన కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఒకే ప్రదేశంలో ఏర్పాటైన అతిపెద్ద కాపర్ ప్లాంటు ఇదేనని సంస్థ తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ కంపెనీ అయిన ‘కచ్ కాపర్’ 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,000 కోట్ల) కాపర్ రిఫైనరీలో తొలి దశను ప్రారంభించిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు తొలి బ్యాచ్ కాథోడ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. మన దేశ దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్లాంటు ఉపకరిస్తుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. తొలి దశలో ఏటా 0.5 మిలియన్ టన్నుల రిఫైన్డ్ కాపర్ను ఈ ప్లాంటు ఉత్పత్తి చేయనుంది. 2028-29 కల్లా పూర్తి స్థాయి(1 మిలియన్ టన్నుల) సామర్థ్యానికి చేరుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ ప్లాంటు వల్ల నేరుగా 2,000 మందికి, పరోక్షంగా 5000 మందికి ఉపాధి లభించనుంది.
అంబుజా సిమెంట్స్లో రూ.6,661 కోట్ల అదానీ పెట్టుబడులు
అంబుజా సిమెంట్స్లో అదానీ గ్రూప్ రూ.6,661 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా తన వాటాను 3.6% పెంచుకుని 66.7 శాతానికి చేర్చుకుంది. ఇందు కోసం ఒక్కో షేరు ధరను రూ.314.15 గా పరిగణించి, ప్రమోటరు సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కు చెందిన 21.20 కోట్ల వారెంట్లను షేర్లుగా మార్చుకోవడానికి అంబుజా సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది. 2028 కల్లా సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మి. టన్నులకు చేర్చుకోవాలన్న ప్రణాళికలకు తాజా పరిణామం ఉపయోగపడగలదని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఏసీసీ సహా అనుబంధ కంపెనీలను కలిపితే అంబుజా సిమెంట్స్కు ఏటా 77.4 మి. టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
రూ.19,700 కోట్ల రుణాలను ఒకే రుణంగా మార్చుకున్న అదానీ పవర్: కంపెనీకి చెందిన ఆరు ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)లు తీసుకున్న మొత్తం రూ.19,700 కోట్ల వేర్వేరు స్వల్పకాల రుణాలను ఒక దీర్ఘకాల రుణంగా అదానీ పవర్ ఏకీకరించింది. ఈ సర్దుబాటు వల్ల వడ్డీ రేటు తగ్గడంతో పాటు ఏకరూప గడువు ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!