మన స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లు
భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు మక్కువ చూపుతూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన మార్కెట్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం.
2023-24లోనే ఇంత మొత్తం
దేశ ఆర్థిక ప్రగతిపై ఆశావహ దృక్పథం వల్లే
దిల్లీ: భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు మక్కువ చూపుతూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన మార్కెట్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక మూలాలు బలంగా ఉండటం ఇందుకు కలిసొచ్చింది. డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా దాదాపు రూ.2.08 లక్షల కోట్లు, డెట్ మార్కెట్లలో రూ.1.2 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.3.4 లక్షల కోట్లు చొప్పించారు. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో.. 2021-22లో రూ.1.4 లక్షల కోట్లు, 2022-23లో రూ.37,632 కోట్ల పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారు. గతంలో చూస్తే 2020-21లో రికార్డులో స్థాయిలో రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఎఫ్పీఐలు మన స్టాక్ మార్కెట్లలో పెట్టారు.
- 2023-24 ఆర్థిక సంవత్సరం చూస్తే.. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఎఫ్పీఐలు రూ.1.62 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. సెప్టెంబరు-అక్టోబరుల్లో రూ.39,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. మళ్లీ నవంబరు, డిసెంబరు నెలల్లో రూ.66,135 కోట్లు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా, మార్చిలో రూ.35,000 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
- వచ్చే ఆర్థిక సంవత్సరంపైనా ఆశావహంగా ఉన్నా, అప్రమత్తతతో వ్యవహరిస్తారనే అంచనాలున్నాయి. దేశంలో సంస్కరణల అమలు కొనసాగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం వంటివి ఎఫ్పీఐ పెట్టుబడుల ఆకర్షణకు కీలక అంశాలని మజార్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ధావన్ అన్నారు. అంతర్జాతీయ భౌగోళిక అంశాల మేరకు పెట్టుబడుల్లో ఒడుదొడుకులు ఉంటాయని అంచనా వేశారు.
- అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరిస్థితులు కీలకం కానున్నాయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల