సంక్షిప్త వార్తలు
తమ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మొత్తం 100% వాటాను విక్రయించాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయించింది.
అమ్మకానికి హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్
దిల్లీ: తమ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మొత్తం 100% వాటాను విక్రయించాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయించింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఈ లావాదేవీ జరుగుతుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఆసక్తి కలిగిన పార్టీతో తప్పనిసరిగా అమలు చేయాల్సిన షరతులపై ఒప్పందం చేసుకున్నామని, ఆసక్తి కలిగిన ఇతర పార్టీలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. స్విస్ ఛాలెంజ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ను ఎవరు కొనుగోలు చేసేదీ నిర్ణయిస్తామని వివరించింది. మూడు ఎడ్యుకేషన్ స్కూళ్లకు సేవలు అందించే కార్యకలాపాలను హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది.
రూ.1.48 లక్షల కోట్ల షేర్లకు పూర్తికానున్న లాకిన్ గడువు
దిల్లీ: వచ్చే 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ కాలవ్యవధి పూర్తికానుంది. దీంతో ఈ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. లాకిన్ పూర్తయితే ఆయా షేర్ల నుంచి యాంకర్, ఇతర మదుపర్లు వైదొలిగే అవకాశం ఉంటుంది. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. ఐపీఓలో షేర్లు పొందిన యాంకర్ మదుపర్లు 90 రోజుల పాటు విక్రయించడానికి వీలు లేకపోవడమే లాకిన్.
దేశీయంగా సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ
ఐఓసీతో పానసోనిక్ భాగస్వామ్యం
దిల్లీ: సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ నిమిత్తం దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)తో పానసోనిక్ గ్రూప్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. జపాన్కు చెందిన పానసోనిక్ గ్రూప్ సంస్థ పానసోనిక్ ఎనర్జీ కంపెనీ ఇందుకు సంబంధించి ఐఓసీతో జట్టు కడుతోంది. భారత విపణిలో ద్వి-త్రిచక్ర వాహన బ్యాటరీలతో పాటు ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్కు గిరాకీ మరింత విస్తృతం అవుతుందనే అంచనాతో దేశీయంగా బ్యాటరీలు తయారు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఇవి తయారు చేయబోయే సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, పవర్ టూల్స్, విద్యుత్తు వాహనాల్లో వినియోగిస్తారు. 2046 కల్లా నికర కర్బన ఉద్గారాల్లో శూన్య స్థితికి చేరాలన్న ఐఓసీ లక్ష్యంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణరేటు స్వల్పంగా పెంపు
దిల్లీ: ఏప్రిల్ 1 నుంచి రుణరేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ప్రకటించింది. ఇందువల్ల రిటైల్ రుణాలు సహా ఇతర విభాగ రుణాల వడ్డీ పెరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఏప్రిల్ 5న వెలువడనున్న నేపథ్యంలో బీఓఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రెపో రేటు ఆధారిత వడ్డీరేటు 9.35 శాతం అవుతుందని తెలిపింది.
బేస్రేటు, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. కొత్తరేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు