పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
గత పదేళ్లలో ఓ2సీ (ఆయిల్-టు-కెమికల్స్), టెలికాం వ్యాపారంపై దృష్టి సారించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సుమారు 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,37,500 కోట్ల)కు పైగా మూలధన పెట్టుబడులు పెట్టినట్లు గోల్డ్మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది.
రిలయన్స్పై గోల్డ్మన్ శాక్స్ నివేదిక
దిల్లీ: గత పదేళ్లలో ఓ2సీ (ఆయిల్-టు-కెమికల్స్), టెలికాం వ్యాపారంపై దృష్టి సారించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సుమారు 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,37,500 కోట్ల)కు పైగా మూలధన పెట్టుబడులు పెట్టినట్లు గోల్డ్మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. వచ్చే మూడేళ్లలో రిటైల్, నూతన ఇంధన రంగంపై ఆర్ఐఎల్ దృష్టి సారించనున్నట్లు తెలిపింది. దీర్ఘకాల మూలధన వ్యయాల చట్రం నుంచి కంపెనీ క్రమంగా బయటకొస్తోందని విశ్లేషించింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 2013-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ఓ2సీ వ్యాపారంలో 30 బి.డాలర్ల (సుమారు రూ. 2.50 లక్షల కోట్ల) మూలధనాన్ని చొప్పించింది. 2013-24 మధ్య 4జీ/5జీ నెట్వర్క్ల కోసం టెలికాం వ్యాపారంలో 60 బి.డాలర్ల (సుమారు రూ.5 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణను దాదాపు పూర్తి చేసింది. త్వరలో టెలికాం టారిఫ్లు పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పటికే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఓ2సీ వ్యాపారంతో పాటు టెలికాం రంగం నుంచి కూడా రిలయన్స్కు భారీగా నగదు ప్రవాహం ఉండనుంది. తక్కువ మూలధనం అవసరమయ్యే రిటైల్, నూతన ఇంధన రంగాలపై కంపెనీ వచ్చే మూడేళ్లలో దృష్టి సారించే అవకాశం ఉందని నివేదిక వివరించింది.
- 2022-23లో రిలయన్స్ మూలధన వ్యయం 17.6 బి.డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్ల)కు చేరినట్లు అంచనా వేసిన నివేదిక.. 2025-26 నాటికి అది క్రమంగా తగ్గి 11.2 బి.డాలర్ల (సుమారు రూ.93,000 కోట్ల)కు పరిమితమవుతుందని తెలిపింది. 2024-27 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ రిటైల్ వ్యాపార ఎబిటా రెండింతలు అవుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్త ఇంధన విభాగం కింద సౌర విద్యుత్, ఎలక్ట్రోలైజర్, పవన విద్యుత్ సామర్థ్యాలను ఆర్ఐఎల్ మెరుగ్గా వినియోగించుకుంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..