పన్ను విధానంలో మార్పులేమీ లేవు
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు వర్తించే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులను కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది.
స్పష్టం చేసిన ఆర్థిక శాఖ
ఈనాడు, హైదరాబాద్: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు వర్తించే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులను కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. 2024-25 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకునేందుకు వీలుందని పేర్కొంది. వ్యాపారాదాయం లేని వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరం కొత్త, పాత పన్ను విధానాల్లో తమకు అనువైన దానికి మారిపోవచ్చని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై జరుగుతున్నవి తప్పుడు ప్రచారాలని స్పష్టం చేసింది.
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల పరంగా ఎలాంటి మార్పులూ లేవు.
- ఆర్థిక చట్టం 2023 ప్రకారం పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115బీఏసీ(1) కింద కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది.
- గత ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా వర్తిస్తుంది. 2024-25 మదింపు సంవత్సరం రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి.
- కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకోవాలి. పాత పన్ను విధానంతో పోలిస్తే రేట్లు తక్కువ. పన్ను రాయితీల కోసం ఎలాంటి పెట్టుబడులూ చూపించాల్సిన అవసరం లేదు. రెండు విధానాల్లోనూ ప్రామాణిక తగ్గింపు రూ.50,000, కుటుంబ పింఛను రూ.15,000 మినహాయింపు లభిస్తుంది.
- కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా ఉన్నప్పటికీ.. పాత పన్ను విధానం లాభదాయకం అనుకుంటే, దాన్నే ఎంచుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పన్ను శ్లాబుల విషయానికి వస్తే కొత్త పన్ను విధానం ప్రకారం
ఆదాయం పన్ను%
రూ.3 లక్షల వరకు 0
రూ.3- 6లక్షల వరకు 5
రూ.6-9 లక్షల వరకు 10
రూ.9-12 లక్షల వరకు 15
రూ.12-15 లక్షల వరకు 20
రూ.15 లక్షలు ఆ పైన 30
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఆదాయం రూ.7.50 లక్షల లోపు (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్నప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు.
పాత పన్ను విధానంలో
ఆదాయం పన్ను%
రూ.2.5 లక్షల వరకు 0
రూ.2.5 - 5 లక్షల వరకు 5
రూ.5-10 లక్షల వరకు 20
రూ.10 లక్షలకు పైన 30
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ