ఆర్థిక స్వావలంబనే మన ధ్యేయం
వచ్చే పదేళ్లలో భారత్ తన ఆర్థిక స్వావలంబనను మరింత పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని పరిమితం చేసుకోగలమన్నారు. రూపాయిని మారక ద్రవ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించేలా ప్రయత్నించాలని సూచించారు.
రూపాయికి ప్రపంచవ్యాప్త ఆమోదం సాధిద్దాం
ఆర్బీఐ 90 వసంతాల వేడుకల్లో ప్రధాని మోదీ
ముంబయి: వచ్చే పదేళ్లలో భారత్ తన ఆర్థిక స్వావలంబనను మరింత పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని పరిమితం చేసుకోగలమన్నారు. రూపాయిని మారక ద్రవ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించేలా ప్రయత్నించాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్మారక నాణేన్ని విడుదల చేసిన అనంతరం మోదీ ఏమన్నారంటే..
ప్రపంచ వృద్ధికి భారతే ఇంజిన్..: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) పాత్రను ప్రశంసించాల్సిందే. దేశీయంగా ధరలను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు కరోనా పరిణామాల్లోనూ ద్రవ్య స్థిరీకరణకు అడుగులు వేయడం ద్వారా, ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో ఆర్బీఐ ఎంతో కీలకంగా వ్యవహరించింది. ప్రపంచ జీడీపీ వృద్ధిలో 15% వాటాతో భారత్ ఒక ఇంజిన్లా వ్యవహరిస్తోంది. చాలా దేశాలు ఇప్పటికీ కరోనా పరిణామాల ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే.. మనదేశం మాత్రం వృద్ధి విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణకు, వృద్ధికి మధ్య సమతౌల్యాన్ని పాటించడం ఏ దేశానికైనా అత్యంత ప్రధానం. ఆర్బీఐ ఈ విషయంలో ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. రూపాయిని అన్ని దేశాలూ ఆమోదించే కరెన్సీగా తీర్చిదిద్దాలి. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు.. అంతరిక్షం, పర్యాటకం వంటి సరికొత్త, సంప్రదాయ రంగాల అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుందన్న నిపుణుల అంచనాలను గుర్తు చేస్తున్నాను. బలమైన బ్యాంకులుంటే, ఏ దేశంలో అయినా ప్రాజెక్టులకు నిధులు సమకూరుతాయి. ఇదే లక్ష్యంతో ఆర్బీఐ చర్యలున్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ బ్యాంకింగ్లో సైబర్ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. కృత్రిమమేధ, బ్లాక్చైన్ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి.
మొండి బకాయిలు తగ్గాయి: 2014లో ఆర్బీఐ 80 ఏళ్ల సంబరాల్లో పాల్గొన్నాను. అప్పట్లో మొండి బకాయిల తీవ్రతతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో అస్థిరత ఉండేది. ఇపుడు ప్రపంచంలోనే బలమైన, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థను మనం చూస్తున్నాం. 2018లో 11.25 శాతం ఉన్న నిరర్థక ఆస్తులు 2023 సెప్టెంబరు నాటికి 3 శాతం దిగువకు వచ్చాయి.
ఆర్బీఐ వల్లే అనిశ్చితికి దూరం: అంతర్జాతీయ అనిశ్చితులు, అసమతౌల్యాల నుంచి దేశం బయటపడటంలో ఆర్బీఐ పాత్ర ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ సమస్యలను ఆర్బీఐ చాలా చక్కగా పరిష్కరిస్తోందని ప్రశంసించారు.
ఆర్థిక ప్రగతికి పునాదిగా ఉంటాం.. శక్తికాంత దాస్: ‘దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేస్తున్నాం. వచ్చే పదేళ్లలో ఆర్బీఐ 100వ వార్షికోత్సవ సమయానికి మరింత స్థిరమైన, బలమైన ఆర్థిక వ్యవస్థను అందించడానికి ఆర్బీఐ కృషి చేస్తుంద’ని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 1935 ఏప్రిల్ 1న కార్యకలాపాలు ప్రారంభించిన ఆర్బీఐ అప్పుడు, ఇప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ