ద్విచక్ర వాహన విక్రయాలు భళా
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మార్చిలో దేశీయంగా 3,58,151 ద్విచక్ర వాహనాలు టోకుగా విక్రయించింది.
దిల్లీ: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మార్చిలో దేశీయంగా 3,58,151 ద్విచక్ర వాహనాలు టోకుగా విక్రయించింది. 2023 ఇదే నెలలో కంపెనీ డీలర్లకు సరఫరా చేసిన 1,97,542 వాహనాలతో పోలిస్తే, ఇవి 81% ఎక్కువ. వాహన ఎగుమతులు 14,460 నుంచి 95% పెరిగి 28,304కు చేరాయి. మొత్తం విక్రయాలు 2,12,002 నుంచి 3,86,455కు చేరాయి. 2022-23లో సంస్థ 43,50,967 వాహనాలను విక్రయించగా, 2023-24లో 48,93,522 వాహనాలను అమ్మింది.
- బజాజ్ ఆటో: బజాజ్ ఆటో గత నెలలో ఎగుమతులతో కలిపి మొత్తం 3,65,904 వాహనాలను టోకుగా విక్రయించింది. 2023 మార్చిలో అమ్మిన 2,91,567 వాహనాలతో పోలిస్తే ఇవి 25% అధికం. మొత్తం దేశీయ విక్రయాలు (వాణిజ్య వాహనాలతో కలిపి) 1,86,522 నుంచి 18% వృద్ధితో 2,20,393కు చేరాయి. మొత్తం ఎగుమతులు 1,05,045 నుంచి 39% పెరిగి 1,45,511 వాహనాలకు చేరాయి. 2023-24లో మొత్తం 43,50,933 వాహనాలను సంస్థ విక్రయించింది. 2022-23లో విక్రయించిన 39,27,857 వాహనాలతో పోలిస్తే ఇవి 11% అధికం. దేశీయంగా డీలర్లకు సరఫరాలు 21,06,617 నుంచి 29% పెరిగి 27,14,723 వాహనాలకు చేరాయి. ఎగుమతులు 18,21,240 నుంచి 10% తగ్గి 16,36,210కు పరిమితమయ్యాయి.
- ఆడి ఇండియా: విలాస కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 7,027 రిటైల్ వాహన విక్రయాలను నమోదు చేసింది. 2022-23లో కంపెనీ విక్రయించిన 5,275 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 33% అధికం. 2024 జనవరి-మార్చిలో 1,046 వాహనాలను సంస్థ విక్రయించింది. 2023 ఇదే సమయంలో కంపెనీ 1,950 వాహనాలను అమ్మింది. సరఫరా చైన్లో అంతరాయాల వల్లే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాలపై ప్రభావం పడిందని కంపెనీ వెల్లడించింది.
- 7% తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు: హిందుజా గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చిలో 7% తగ్గి 21,317కు పరిమితమయ్యాయి. 2023 ఇదే నెలలో సంస్థ 22,885 వాహనాలను విక్రయించింది. గత నెలలో విక్రయించిన వాటిలో 14,517 వాహనాలు మధ్య, భారీ వాణిజ్య వాహనాలు కాగా, 6,800 తేలికపాటి వాణిజ్య వాహనాలని కంపెనీ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మొత్తం విక్రయాలు 1,80,916 నుంచి 1% పెరిగి 1,82830కు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం