ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ
మూడు రోజుల సూచీల వరుస లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో కొన్ని ఐటీ, ప్రైవేట్ బ్యాంకులు, వాహన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.
సమీక్ష
మూడు రోజుల సూచీల వరుస లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో కొన్ని ఐటీ, ప్రైవేట్ బ్యాంకులు, వాహన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. విదేశీ అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.42 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.61% లాభంతో 88.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 74,022.30 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఒకదశలో 73,743.77 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరి, చివరకు 110.64 పాయింట్ల నష్టంతో 73,903.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8.70 పాయింట్లు తగ్గి 22,453.30 దగ్గర స్థిరపడింది.
- మార్చిలో విక్రయాలు 25% పెరగడంతో బజాజ్ ఆటో షేరు ఇంట్రాడేలో 3.48% పెరిగి రూ.9,356 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.61% లాభంతో రూ.9,276.65 వద్ద ముగిసింది.
- దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా ధరలను రూ.10-15 మేర కంపెనీలు పెంచడంతో ఆయా కంపెనీల షేర్లు మెరిశాయి. ఏసీసీ 4.09%, దాల్మియా భారత్ 1.51%, అల్ట్రాటెక్ సిమెంట్ 0.84%, శ్రీ సిమెంట్ 0.12% చొప్పున పెరిగాయి.
- మధురా ఫ్యాషన్ను ప్రత్యేక కంపెనీగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నట్లు ప్రకటించడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 11.55% దూసుకెళ్లి రూ.236.15 వద్ద ముగిసింది.
- రెండో రోజూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. అదానీ పవర్ 5%, అదానీ విల్మర్ 4.15%, ఏసీసీ 4.09%, ఎన్డీటీవీ 2.81%, అంబుజా 2.09%, అదానీ పోర్ట్స్ 2.02%, అదానీ టోటల్ 0.65%, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.51%, అదానీ గ్రీన్ 0.30% పెరిగాయి.
- సెన్సెక్స్ 30 షేర్లలో 16 నష్టపోయాయి. కోటక్ బ్యాంక్ 1.84%, హెచ్సీఎల్ టెక్ 1.82%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.63%, ఇన్ఫోసిస్ 0.84%, టీసీఎస్ 0.83% మేర డీలాపడ్డాయి. ఎం అండ్ ఎం 2.95%, నెస్లే 1.42%, టాటా మోటార్స్ 1.23%, ఎస్బీఐ 1.21%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.19% లాభపడ్డాయి.
- ఆస్తుల నగదీకరణపై రూ.40,314 కోట్ల సమీకరణ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో పలు పద్ధతుల్లో ఆస్తుల నగదీకరణ ప్రక్రియ ద్వారా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.40,314 కోట్లు సమీకరించింది. ప్రభుత్వం విధించుకున్న రూ.28,968 కోట్ల లక్ష్యం కంటే ఇది అధికం. 2022-23లో ఇలా సమీకరించిన మొత్తం రూ.32,855 కోట్లుగా ఉంది.
- దేశంలో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఫ్లేవర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.1,266 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పెప్సికో ఇండియా వెల్లడించింది. ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాదిలో మొదలై, 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- గతేడాది విమానాల లీజు సంస్థ నార్డిక్ ఏవియేషన్ క్యాపిటల్తో కుదిరిన సెటిల్మెంట్లో భాగంగా త్వరలో క్యూ400 విమానాన్ని అందుకోనున్నట్లు స్పైస్జెట్ తెలిపింది.
- టీఏసీ ఇన్ఫోసెక్ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 392.56 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 20,23,200 షేర్లను ఆఫర్ చేయగా, 79,42,29,600 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- అమెరికా కంపెనీ, సంయుక్త సంస్థ భాగస్వామి స్టేట్ స్ట్రీట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్తో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ హెచ్సీఎల్ ఇన్వెస్ట్మెంట్ యూకే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సంయుక్త సంస్థలో మొత్తం 49% వాటాను విక్రయించనుంది.
- అల్ట్రాటెక్ 2 కొత్త ప్లాంట్లు: రెండు గ్రే సిమెంట్ తయారీ ప్లాంట్లను ప్రారంభించినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ వెల్లడించింది. దీంతో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 151.6 మిలియన్ టన్నులకు చేరింది. తమిళనాడు కరూర్లో 2.70 మి.టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను, ఛత్తీస్గఢ్ కుకురిడ్లో 2.70 మి.టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సమీకృత సిమెంట్ ప్లాంట్ను కంపెనీ ప్రారంభించింది.
నిఫ్టీ లాట్ పరిమాణం తగ్గింపు
నిఫ్టీ 50 డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్ పరిమాణాన్ని ఎన్ఎస్ఈ సగానికి తగ్గించింది. ప్రస్తుతం ఉన్న నిఫ్టీ 50 లాట్ పరిమాణాన్ని 50 నుంచి 25 చేసింది. ఫిన్నిఫ్టీ లాట్ పరిమాణం 40 నుంచి 25కు, మిడ్క్యాప్ నిఫ్టీ లాట్ పరిమాణం 75 నుంచి 50కు చేరింది. బ్యాంక్ నిఫ్టీ లాట్ 15 లో మార్పులు చేయలేదు. నిఫ్టీ-50 లాట్ పరిమాణంలో మార్పులు ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఫిన్ నిఫ్టీలో మార్పులు ఈ ఏడాది జులై 30 నుంచి, మిడ్క్యాప్ నిఫ్టీలో మార్పులు జులై 29 నుంచి అమలు కానున్నాయి.
కంపెనీలకు వరుస పన్ను డిమాండ్లు
- నాందేడ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ నుంచి రూ.5.51 కోట్ల పన్ను డిమాండ్ను యునైటెడ్ స్పిరిట్స్ అందుకుంది. ఇందులో రూ.2.99 కోట్ల వడ్డీ కలిపి ఉంది.
- సేవా పన్ను డిమాండ్, జరిమానా ఆదేశాల కింద రూ.184 కోట్లు చెల్లించాల్సిందిగా జొమాటో నోటీసులు అందుకుంది. 2014 అక్టోబరు-2017 జూన్ మధ్య కాలానికి ఈ నోటీసులు వచ్చాయి.
- ఆదాయపు పన్ను విభాగం నుంచి రూ.46 కోట్ల డిమాండ్ నోటీసులు అందుకున్నట్లు స్థిరాస్తి సంస్థ శోభా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?