రక్షణ రంగ తయారీ కళకళ
రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,350 కోట్ల టర్నోవర్ సాధించింది.
ఉత్పత్తులకు అనూహ్య గిరాకీ
పెరుగుతున్న ఎగుమతులు
కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు
ఈనాడు - హైదరాబాద్
రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,350 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ సంస్థ చేతిలో ప్రస్తుతం రూ.19,468 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఎగుమతి ఆర్డర్లే రూ.2,500 కోట్ల వరకు ఉండటం గమనార్హం. కేవలం బీడీఎల్ మాత్రమే కాదు.. రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు ఇటీవల కాలంలో అధికంగా ఆదాయాలు, లాభాలు నమోదు చేస్తున్నాయి. పెద్దఎత్తున ఆర్డర్లు సంపాదించడమే ఇందుకు నేపథ్యం. ఇటువంటి సానుకూలత గతంలో లేదు. మనదేశం రక్షణ పరికరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడేది. కొన్ని దశాబ్దాల పాటు మన సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, యుద్ధ నౌకలను రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాం. దీనికి భిన్నమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.
రూ.21,000 కోట్లకు పైగా ఎగుమతులు
నాలుగైదేళ్లుగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2023-24లో మనదేశం నుంచి రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2022-23లో రక్షణరంగ ఎగుమతులు రూ.15,918 కోట్లు కావడం గమనార్హం. రక్షణ దళాలకు అవసరమైన పరికరాల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన మనదేశం, ఈ విధంగా ఎగుమతులు చేసేలా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రక్షణ రంగానికి చెందిన దేశీయ సంస్థలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి తోడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈ మార్పునకు వీలుకల్పించాయని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.
వివిధ దేశాలకు సరఫరా
మనదేశం నుంచి రక్షణ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈజిప్టు, ఇటలీ, యూఏఈ, భూటాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు మనదేశం నుంచి రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు జెఫ్రీస్ అనే అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సేవల సంస్థ తాజాగా వివరించింది. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్.. వంటి దేశాల నుంచి గల్ఫ్ దేశాలు ఏటా 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 91,500 కోట్ల)కు పైగా ఆయుధాలు, ఆయుధ సామగ్రి దిగుమతి చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆ దేశానికి రక్షణ పరికరాలు భారతదేశం నుంచీ ఎగుమతి అయ్యే అవకాశం ఉందని జెఫ్రీస్ పేర్కొంది. దేశీయ అవసరాలు తీర్చుతూనే, ఎగుమతులపై దృష్టి సారించడం వల్లే మనదేశంలోని రక్షణ రంగ సంస్థలకు అనూహ్య వృద్ధి అవకాశాలు అందివస్తున్నాయి. ప్రస్తుతం ఆయుధ సామగ్రి, క్షిపణులు, గస్తీ నౌకలను ఎగుమతి చేస్తుండగా, భవిష్యత్తులో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను సైతం ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సంస్థలకు భారీ ఆర్డర్లు
ఈ నేపథ్యంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీఈఎల్, మజ్గావ్ షిప్యార్డ్, బీడీఎల్, కొచిన్ షిప్యార్డ్, ఎల్అండ్టీ, భారత్ ఫోర్జ్ .. వంటి అగ్రశ్రేణి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో పాటు చిన్న, మధ్యస్థాయి రక్షణ రంగ సంస్థలకూ ఆర్డర్లు పెరుగుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మిధాని, బీడీఎల్తో పాటు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీఈఎల్ యూనిట్లతో ప్రైవేటు రంగంలో అస్త్ర మైక్రోవేవ్, భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థలు, ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. రక్షణ ఉత్పత్తుల రంగం విస్తరించడం, ఎగుమతి అవకాశాలు పెరగడం వల్ల ఈ సంస్థలకు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం లభిస్తోంది. కొన్నేళ్ల పాటు రక్షణ రంగ సంస్థలు ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తాయని జెఫ్రీస్ విశ్లేషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?