సంక్షిప్త వార్తలు
పైలట్ల సమస్యల పరిష్కారానికి బుధవారం విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పైలట్ల సమస్య పరిష్కారానికి విస్తారా యాజమాన్యం చర్చలు!
దిల్లీ: పైలట్ల సమస్యల పరిష్కారానికి బుధవారం విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత రెండు రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని, విమానాల రద్దు సంఖ్య కూడా తగ్గుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సుజుకీ మోటార్ కార్పొరేషన్ అరుదైన ఘనత
దిల్లీ: జపాన్ వాహన దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ దేశీయంగా 3 కోట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఈ ఘనత సాధించిన రెండో విపణిగా భారత్ నిలిచింది. 2024 మార్చికి సుజుకీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశంలో 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. 1983 డిసెంబరులో కంపెనీ దేశంలో ఉత్పత్తిని ప్రారంభించగా.. 40 ఏళ్ల నాలుగు నెలల్లో 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ రికార్డు అయిన 55 ఏళ్ల 2 నెలలను భారత్ బద్దలు కొట్టింది. సుజుకీ, భారత ప్రభుత్వం సంయుక్త సంస్థ మారుతీ ఉద్యోగ్ దేశంలో మారుతీ 800 మోడల్తో ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఇండియాకు గురుగ్రామ్, మనేసర్ (హరియాణా), హన్సల్పుర్ (గుజరాత్)ల్లో ప్లాంట్లు ఉన్నాయి.
ఇండిగోతో మలేసియా ఎయిర్లైన్స్ కోడ్షేర్ ఒప్పందం
ఇండిగోతో కోడ్షేర్ భాగస్వామ్యం కోసం ప్రాథమిక ఒప్పందాన్ని మలేసియా ఎయిర్లైన్స్ కుదుర్చుకుంది. భారత్, మలేసియాల మధ్య విమాన ప్రయాణ అనుసంధానం పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది. అలాగే ఇరు విమానయాన సంస్థలకూ ఈ ఒప్పందం ప్రయోజనం కలుగుతుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. భారత్తో విమానయాన అనుసంధానాన్ని మలేసియా ఎయిర్లైన్స్ బలోపేతం చేసుకుంటుందని పేర్కొంది. మలేసియా ఎయిర్లైన్స్కు ఉన్న విస్తృత నెట్వర్క్ ద్వారా ఆగ్నేయాసియాలోని మరిన్ని గమ్యస్థానాలను ఇండిగో తన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని పేర్కొంది. ప్రస్తుతం మలేసియా ఎయిర్లైన్స్ భారత్లోని తొమ్మిది ప్రధాన నగరాలు- దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, అమృత్సర్, త్రివేండ్రం-కు వారంలో 71 విమాన సర్వీసులను నడుపుతోంది.
ఆసుపత్రి బిల్లులకు రుణం: కెనరా బ్యాంక్
ఈనాడు, హైదరాబాద్: ఆసుపత్రి బిల్లును చెల్లించేప్పుడు ఎదురయ్యే నిధుల కొరతను తీర్చేందుకు ప్రత్యేక రుణ పథకాన్ని కెనరా బ్యాంక్ తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ఉన్న బీమా పాలసీకి మించి బిల్లు అయినప్పుడు మిగతా మొత్తాన్ని ‘కెనరా హీల్’ రుణం రూపంలో సమకూరుస్తుంది. పాలసీదారుడు, అతనిపై ఆధారపడిన వారికీ ఈ రుణం అందుబాటులో ఉంటుందని కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ అప్పుపై వార్షిక చలన వడ్డీ రేటు 11.25 శాతం, స్థిర వడ్డీ రేటు 12.30 శాతంగా ఉంటుందని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా ‘కెనరా ఏంజెల్’ పేరుతో పొదుపు ఖాతానూ తీసుకొచ్చింది. క్యాన్సర్ కేర్ పాలసీ, ముందస్తుగా మంజూరైన వ్యక్తిగత రుణం కెనరా రెడీక్యాష్, టర్మ్ డిపాజిట్లపై ఆన్లైన్లోనే రుణం తీసుకునే వెసులుబాటుతో కెనరా మై మనీలాంటివి ఇందులో అందిస్తోంది. పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు ఎలాంటి రుసుములూ ఉండవని పేర్కొంది. ఇప్పటికే ఖాతా ఉన్న మహిళలూ దీనికి మారొచ్చని తెలిపింది. దీంతోపాటు యూపీఐ చెల్లింపులను సులభంగా చేసేందుకు ‘123పే ఏఎస్ఐ’ని ప్రారంభించింది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో స్వయం సహాయక బృందాలకు ఇంటివద్దే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోన్న తొలి బ్యాంకుగా కెనరా బ్యాంకు నిలిచిందని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్