రెండో రోజూ నష్టాలే
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, వాహన షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది.
సమీక్ష
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, వాహన షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.45 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.31% లాభంతో 88.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 73,757.23 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ, 73,540.27 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.65 పాయింట్లు తగ్గి 22,434.65 దగ్గర స్థిరపడింది.
- గుజరాత్లో 2000 మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్ను ప్రారంభించడంతో అదానీ పవర్ షేరు 5 శాతం దూసుకెళ్లి 52 వారాల గరిష్ఠమైన రూ.617.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.11,339.4 కోట్లు పెరిగి రూ.2.38 లక్షల కోట్లకు చేరింది.
- ఎస్ఆర్ఎమ్ కాంట్రాక్టర్స్ షేర్లు సూచీల్లో శుభారంభం చేశాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.210తో పోలిస్తే 7.14% లాభంతో రూ.225 వద్ద నమోదైంది. చివరకు 12.48% లాభంతో రూ.236.20 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.541.94 కోట్లుగా నమోదైంది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 16 డీలాపడ్డాయి. నెస్లే 2.73%, కోటక్ బ్యాంక్ 1.43%, టైటన్ 1.16%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.14%, బజాజ్ ఫిన్సర్వ్ 1.08%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.06% నష్టపోయాయి. ఎన్టీపీసీ 1.97%, టీసీఎస్ 1.67%, టెక్ మహీంద్రా 1.56%, యాక్సిస్ బ్యాంక్ 1.51%, భారతీ ఎయిర్టెల్ 1.41%, బజాజ్ ఫైనాన్స్ 1.40% లాభపడ్డాయి.
- సెక్యూరిటీల జారీ ద్వారా రూ.20,000 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు వొడాఫోన్ ఐడియా వాటాదార్లు ఆమోదం తెలిపారు.
- ఈ ఏడాది సెప్టెంబరుకు జిందాల్ కోక్లో ఉన్న మొత్తం 26 శాతం వాటాను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిందాల్ స్టెయిన్లెస్ వెల్లడించింది. మొదటి విడతలో 4.87 శాతం షేర్లను రూ.36.49 కోట్లకు జేఎస్ఎల్ ఓవర్సీస్కు విక్రయించింది. ఇదే సమయంలో స్పెయిన్ సంస్థ ఇబెర్జిందాల్లో మెజారిటీ వాటాను జిందాల్ స్టెయిన్లెస్ కొనుగోలు చేసింది.
- భారత్లో వృద్ధి చెందేందుకు బడ్జెట్, ఎకానమీ బ్రాండ్లను తీసుకొచ్చేందుకు అమెరికా సంస్థ వైంధామ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సన్నాహాలు చేస్తోంది. 2025కు దేశంలో 150 ఆస్తులను కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- వినియోగదారుల కోసం మార్పులు చేసిన లాయల్టీ పథకం ‘ఫ్లైయింగ్ రిటర్న్స్’ను ఎయిరిండియా తీసుకొచ్చింది. సులభమైన విధానం, మరిన్ని ఆకర్షణీయమైన ప్రోత్సాహాకాలు, ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2,033 కోట్ల మధ్యంతర డివిడెండ్ చెల్లించినట్లు పీఎఫ్సీ వెల్లడించింది.
- భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, సంయుక్త ఎండీగా అమిత్ కల్యాణీ నియమితులయ్యారు. ప్రస్తుత కంపెనీ ఛైర్మన్, ఎండీ బాబాసాహెబ్ ఎన్ కల్యాణీకి ఆయన కుమారుడు.
- ఏప్రిల్ 8 నుంచి క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో నాలుగు కొత్త సూచీలను తీసుకురానున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. ఈ కొత్త సూచీలు నిఫ్టీ టాటా గ్రూప్ 25% క్యాప్, నిఫ్టీ500 మల్టీక్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టీక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్స్మాల్ హెల్త్కేర్గా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం