రూ.40 లక్షల కోట్లకు.. మన స్థిరాస్తి రంగం
భారతీయ స్థిరాస్తి రంగం మార్కెట్ పరిమాణం 2015 నుంచి 73% వృద్ధి చెంది, ప్రస్తుతం రూ.40.48 లక్షల కోట్ల (482 బిలియన్ డాలర్లు) స్థాయికి చేరింది.
సీఐఐ-నైట్ఫ్రాంక్ నివేదిక
దిల్లీ: భారతీయ స్థిరాస్తి రంగం మార్కెట్ పరిమాణం 2015 నుంచి 73% వృద్ధి చెంది, ప్రస్తుతం రూ.40.48 లక్షల కోట్ల (482 బిలియన్ డాలర్లు) స్థాయికి చేరింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఉమ్మడిగా ‘ఇండియా రియల్ ఎస్టేట్: ఎ డికేడ్ ఫ్రమ్ నౌ’ పేరిట విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2034 నాటికి మార్కెట్ పరిమాణం 1,487 బి.డాలర్ల (సుమారు రూ. 123.42 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. నిర్మాణ, సేవలు, నివాస, వాణిజ్య విభాగాల ఉత్పత్తుల విలువ 2015లో 279 బి.డాలర్లు (సుమారు రూ23.15 లక్షల కోట్లు)గా ఉంది. 2024 నాటికి ఇది 482 బి.డాలర్ల (సుమారు రూ.40 లక్షల కోట్ల)కు చేరింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తోడ్పాటుతో, స్థిరాస్తి రంగం గణనీయంగా రాణించింది’ అని నివేదిక వివరించింది. భారతీయ స్థిరాస్తి రంగం దాదాపు 250 అనుబంధ పరిశ్రమలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.
ఉపాధి కల్పనలో 18% వాటా: వ్యవసాయ రంగం తర్వాత దేశీయంగా అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో స్థిరాస్తి ఒకటి. ఉపాధి కల్పనలో స్థిరాస్తి రంగం వాటా 18% వరకు ఉందని నివేదిక తెలిపింది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో దీని వాటా ప్రస్తుతం 7.3% కాగా, 2034 నాటికి ఇది 10.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.
విస్తరణకు కారణాలివీ: స్థిరాస్తి మార్కెట్ పరిణామం పెరగడానికి ప్రధాన కారణం నివాస గృహాలకు, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరగడం, విస్తరిస్తున్న ఆతిథ్య, రిటైల్ రంగాలని నివేదిక వివరించింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్, అడ్వైజరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దంలో భారత్ ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధిస్తుందని, దీనికి స్థిరాస్తి రంగం కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 2034 నాటికి 1,50,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.124.50 లక్షల కోట్ల) స్థాయికి ఈ రంగం విలువ చేరుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదాయంలో వృద్ధి, వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, మౌలిక వసతుల అభివృద్ధి, భారత్లో తయారీ వంటివి ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు.
2034 నాటికి నివాస గృహాల మార్కెట్ విలువ 906 బి.డాలర్ల (సుమారు రూ.75.20 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని, ఆఫీసు రంగం 125 బి.డాలర్ల (సుమారు రూ.10.38 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని అంచనాలున్నాయని నివేదిక అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. లాభాల్లో సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!