టీసీఎస్ లాభం రూ.12,434 కోట్లు
దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించింది. భారత వ్యాపారం బలమైన పనితీరు కనబరచడం ఇందుకు కారణం.
తుది డివిడెండు రూ.28
‘ప్రతిభావంతుల’కు రెండంకెల ఇంక్రిమెంటు
తగ్గిన వలసల రేటు
‘‘అంతర్జాతీయంగా స్థూల అనిశ్చిత వాతావరణం నెలకొన్నా, మెరుగైన లాభాల మార్జిన్ నమోదు చేశాం. రికార్డు స్థాయిలో కొత్త ఆర్డర్లు సాధించాం. మా వ్యాపార నమూనా బలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.’’
టీసీఎస్ సీఈఓ, ఎండీ కె. కృతివాసన్
ముంబయి: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించింది. భారత వ్యాపారం బలమైన పనితీరు కనబరచడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.12,434 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.11,392 కోట్లతో పోలిస్తే 9% అధికం. ఏకీకృత ఆదాయాలు 3.5% పెరిగి రూ.61,237 కోట్లుగా నమోదయ్యాయి. ఆపరేటింగ్ మార్జిన్ 1.5% పెరిగి 26 శాతానికి చేరడం లాభంలో వృద్ధికి కారణంగా నిలిచింది.
పెరిగిన దేశీయ వ్యాపార వాటా..
బీఎస్ఎన్ఎల్తో రూ.15,000 కోట్ల ఒప్పందం కారణంగా భారత వ్యాపారం ద్వారా కంపెనీ ఆదాయం 38% పెరిగింది. దీంతో మార్చి త్రైమాసిక ఆదాయంలో కంపెనీ దేశీయ వ్యాపార వాటా 6.7 శాతానికి చేరింది. ఏడాది కిందట ఇదే నెలలో ఇది 5 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 52.4% నుంచి 50 శాతానికి తగ్గింది. అమెరికా ఆదాయంలో 2.3% క్షీణత నమోదు కావడం ఇందుకు కారణం.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ నికర లాభం 9% పెరిగి రూ.45,908 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2022-23లోని రూ.2,25,458 కోట్ల నుంచి రూ.2,40,893 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండు రూ.28 ఇవ్వాలని ప్రతిపాదించారు.
రికార్డు స్థాయి ఆర్డర్లు: నాలుగో త్రైమాసికంలో కంపెనీ రికార్డు స్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లను పొందింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 42.7 బి. డాలర్ల ఆర్డర్లను నమోదు చేసింది.
19 ఏళ్లలో తొలిసారిగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య:
- సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ సిబ్బంది సంఖ్య 1759 తగ్గింది. మార్చి ఆఖరుకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,01,546కు చేరుకుంది. 2023 మార్చి 31 నాటి సిబ్బంది 6,14,795 మందితో పోలిస్తే, 13,249 మంది తగ్గినట్లయింది. 19 ఏళ్లలోనే తొలిసారిగా ఏడాదివారీగా సిబ్బంది సంఖ్య తగ్గడం ఇప్పుడే.
- ఐటీ సిబ్బంది వలసల రేటు మాత్రం డిసెంబరు ఆఖరు నాటి 13.3% నుంచి 12.5 శాతానికి తగ్గింది. మెరుగైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులకు రెండంకెల్లో ఇంక్రిమెంటు ఉంటుందని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.
- అందరు ఉద్యోగులకు 4.5 - 7% మేర వేతన పెంపు ఉంటుందని తెలిపారు.
- వృద్ధి పరంగా 2023-24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉంటుందని సీఈఓ తెలిపారు.
40,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు. నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ ద్వారా 10,000 మందిని నియమించుకునే ప్రక్రియను సంస్థ ప్రారంభించిందని, ఈ నెల 26న ఈ పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత