సంక్షిప్త వార్తలు
గేమింగ్ పరిశ్రమకు నియంత్రణ లాంటిది అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్దారు. అది స్వతంత్రంగానే ఉండాలని, అప్పుడే వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
గేమింగ్కు నియంత్రణ అవసరం లేదు : ప్రధాని
దిల్లీ: గేమింగ్ పరిశ్రమకు నియంత్రణ లాంటిది అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్దారు. అది స్వతంత్రంగానే ఉండాలని, అప్పుడే వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గేమింగ్ రంగానికి నియంత్రణ అవసరం ఉందా? అని నమన్ మాథుర్ అనే ఒక గేమర్ అడిగిన ఓ ప్రశ్నకు పై విధంగా ప్రధాని సమాధానం ఇచ్చారు. నియంత్రణ అనేది ఇక్కడ సరైన పదం కాదు.. ఎందుకంటే ప్రభుత్వం సహజంగానే జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు. ‘ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో గేమింగ్ పరిశ్రమపై నియంత్రణ ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించాలి. లేదంటే సంఘటిత, చట్ట విధానం కిందకు తీసుకొచ్చి దేశీయ అవసరాలకు తగ్గట్లుగా పరిశ్రమను తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా దాని ప్రాముఖ్యాన్ని పెంచాలి’ అని ప్రధాని వివరించారు.
గ్రాన్యూల్స్లో తనిఖీ.. ‘అభ్యంతరాలు’ లేవు
ఈనాడు, హైదరాబాద్: గ్రాన్యూల్స్ ఇండియాకు విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో ఉన్న యూనిట్- 5ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) బృందం తనిఖీ చేసింది. ఈ యూనిట్లో ఏపీఐ ఔషధాలు, ఫార్ములేషన్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రీ-అప్రూవల్ ఇన్స్పెక్షన్ (పీఏఐ), సీజీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్) అనుమతుల కోసం దరఖాస్తు చేయగా, దానిపై యూఎస్ఎఫ్డీఏ బృందం తనిఖీ చేసింది. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తనిఖీ పూర్తయినట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందువల్ల ఇబ్బందులు లేకుండా తనిఖీ పూర్తయినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది.
రూట్ మొబైల్ ఓపెన్ ఆఫర్లో రూ.2,500 కోట్ల షేర్లకు టెండర్
దిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సంస్థ రూట్ మొబైల్ పబ్లిక్ వాటాదార్లు సుమారు రూ.2,500 కోట్ల విలువైన షేర్లను ఓపెన్ ఆఫర్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. బెల్జియంకు చెందిన ప్రాక్సిమిస్ గ్రూప్ తన అనుబంధ సంస్థ ద్వారా రూట్ మొబైల్లో 57.56 శాతం వాటాను రూ.5,922.4 కోట్లకు నగదు లావాదేవీ ద్వారా దక్కించుకోవడంతో ఓపెన్ ఆఫర్ తెరపైకి వచ్చింది. నియంత్రణ సంస్థల మార్గదర్శకాల ప్రకారం, ఓపెన్ మార్కెట్ ఆఫర్లో 26 శాతం వాటాను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేయాలి. ఎంటీఓ (మాండేటరీ టేకోవర్ ఆఫర్) వివరాల ఆధారంగా ప్రాక్సిమస్ ఓపల్ తన వాటాను సుమారు 75 శాతానికి పెంచుకునే అవకాశం ఉంది. 1,57,68,803 ఈక్విటీ షేర్లకు పబ్లిక్ వాటాదార్లు టెండరు వేసినట్లు రూట్ మొబైల్ తెలిపింది. టెండరు గడువు ప్రస్తుతం ముగిసింది. రూట్ మొబైల్ షేరు బీఎస్ఈలో శుక్రవారం 0.54 శాతం తగ్గి రూ.1,600.65 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్