ఏడాదిలో రూ.10,000 క్లబ్బులోకి 8 షేర్లు
గత ఏడాదికాలంలో నిఫ్టీ 500 సూచీలోని 8 షేర్లు తొలిసారిగా రూ.10,000 క్లబ్బులోకి అడుగుపెట్టాయి. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలకు ఇది అద్దంపట్టడమే కాకుండా, స్టాక్మార్కెట్లో పెట్టుబడి అవకాశాలకు ఉన్న సానుకూల పరిస్థితులను ఇది తెలియజేస్తోంది.
మదుపర్లకు భారీగా ప్రతిఫలం
గత ఏడాదికాలంలో నిఫ్టీ 500 సూచీలోని 8 షేర్లు తొలిసారిగా రూ.10,000 క్లబ్బులోకి అడుగుపెట్టాయి. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలకు ఇది అద్దంపట్టడమే కాకుండా, స్టాక్మార్కెట్లో పెట్టుబడి అవకాశాలకు ఉన్న సానుకూల పరిస్థితులను ఇది తెలియజేస్తోంది. షేరు ధర నాలుగు అంకెల స్థాయి నుంచి ఐదు అంకెల స్థాయికి చేరడం ఏ కంపెనీ చరిత్రలో అయినా కీలక మైలురాయి అవుతుంది. ఆయా కంపెనీలపై మదుపర్లకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మారుతుంది.
ఆ షేర్లు ఇవే
1) మారుతీ సుజుకీ షేరు ధర తొలిసారి 2023 ఆగస్టులో రూ.10,000ను తాకింది. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 12న) ట్రేడింగ్ ముగిసేనాటికి మారుతీ షేరు రూ.12,274.60 వద్ద ముగిసింది. మంగళవారం (9న) రూ.12,980 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
2) ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 2023 డిసెంబరులో రూ.10,000 మైలురాయిని అందుకుంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లను అధిగమించింది. అయితే ప్రస్తుతం షేరు రూ.10,000 దిగువకు వచ్చింది. శుక్రవారం రూ.9,646.95 వద్ద షేరు ముగిసింది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయింపులు పెంచడం, అందుబాటు గృహ రంగానికి ప్రోత్సాహకాలు, పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి బలమైన గిరాకీ లాంటివి సిమెంటు రంగానికి కలిసి రావడమే, అల్ట్రాటెక్ షేరు రాణింపునకు ఉపకరించింది.
3) ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ వోల్ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ షేరు ఈ ఏడాది ఏప్రిల్ 2న రూ.10,000ను చేరింది. ఒక ఏడాది వ్యవధిలో ఈ షేరు 257% ప్రతిఫలాన్ని పంచింది. కిందటేడాది ఏప్రిల్లో రూ.2,900 వద్ద ఉన్న షేరు.. శుక్రవారం (12న) రూ.9,975.85 వద్ద ముగిసింది. దేశంలో పెరుగుతున్న విద్యుత్ గిరాకీ అవసరాలకు తగ్గట్లుగా పునరుత్పాదక, థర్మల్ విద్యుత్ సామర్థ్యాలను పెంచడం వల్ల.. వోల్ట్యాంప్ లాంటి ట్రాన్స్ఫార్మర్ తయారీ సంస్థలకు ప్రయోజనం కలుగుతోంది. ఆ ప్రభావం షేరు పనితీరులోనూ ప్రతిబింబిస్తోంది.
4) ఫౌండ్రీ పరిశ్రమలకు అవసరమైన పరికరాలను తయారు చేసే కంపెనీ డిసా ఇండియా షేరు ధర గతేడాది జూన్లో తొలిసారి రూ.10,000ను అందుకుంది. ఆ తర్వాతి రెండు నెలల్లో రూ.15,000 మైలురాయినీ అధిగమించింది. 2023 డిసెంబరులో రూ.17,570 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని చేరింది. అక్కడ నుంచి డీలాపడుతూ వస్తున్న షేరు శుక్రవారం రూ.13,850 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో షేరు 77% మేర ప్రతిఫలాన్ని పంచింది.
5) మెషినింగ్ టూల్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్ను తయారు చేసే కంపెనీ వెంట్ ఇండియా షేరు కూడా గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చడమే కాకుండా.. 2023 జూన్లో రూ.10,000 మైలురాయిని తాకింది. ఆ తర్వాత మూడు నెలల్లోనే రూ.15,000ను చేరింది. అప్పటి నుంచి లాభాల స్వీకరణ చోటుచేసుకున్నప్పటికీ.. షేరు రూ.10,000 స్థాయిని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం షేరు రూ.12,193.05 (2024 ఏప్రిల్ 12న) వద్ద ఉంది.
6) బెనారస్ హోటల్స్ షేరు ఈ ఏడాది జనవరిలో రూ.10000 స్థాయిని అందుకుంది. అయితే ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం షేరు రూ.8,791.95 వద్ద ఉంది. అయితే ఏడాదికాలంలో ఈ షేరు 137% పెరగడం గమనార్హం.
7) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.10000 మైలురాయిని తాకింది. తదుపరి ఈ షేరు కూడా ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. ఈ షేరు ఏప్రిల్ 12న రూ.8,220.35 వద్ద ముగిసింది. ఏడాదికాలంలో ఈ షేరు కూడా 127% మేర రాణించింది.
8) స్విచ్ల తయారీ సంస్థ కేసీ ఇండస్ట్రీస్ షేరు గతేడాది జూన్లో రూ.10,000 క్లబ్లోకి చేరింది. 2023 చివర్లో రూ.20,000 మైలురాయిని కూడా అందుకుంది. ప్రస్తుతం రూ.18,416.15 వద్ద ట్రేడవుతోంది. ఏడాదికాలంలో ఈ షేరు 133% పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట