73000-73485 శ్రేణిలో మద్దతు!
వరుసగా 3 వారాల లాభాల తర్వాత, గత వారం దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మన ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
సమీక్ష: వరుసగా 3 వారాల లాభాల తర్వాత, గత వారం దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మన ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దేశీయంగా ప్రభావం చూపే కీలక పరిణామాలు లేనందున, కార్పొరేట్ వార్తలు, ప్రకటనలే మార్కెట్లను నడిపించాయి. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 4 నెలల గరిష్ఠమైన 5.7 శాతంగా నమోదైంది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 4.85 శాతానికి చేరింది. బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్ల ఎగువకు చేరింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు దిగొచ్చన్న సంకేతాలు ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 83.31 నుంచి 83.38కు చేరింది. అంతర్జాతీయంగా.. ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అమెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.5 శాతంగా నమోదుకావడం కలవరపెట్టింది. దీంతో జూన్లో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చన్న అంచనాలు పెరిగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 74,245 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22,519 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో లోహ, చమురు-గ్యాస్, స్థిరాస్తి షేర్లు లాభపడగా.. మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఐటీ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.6,527 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.12,233 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.13,347 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:7గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్ 75,124 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణతో వెనక్కి వచ్చింది. ప్రస్తుతం 73,000- 73,485 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే, స్వల్పకాలంలో దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశీయ మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. బుధవారం శ్రీరామనవమి సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఈనెల 19న జరగనున్న లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్పై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ వారం ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ ఇన్సూరెన్స్, టాటా కమ్యూనికేషన్స్, జియో ఫైనాన్షియల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కీలకం కానున్నాయి. టోకు ద్రవ్యోల్బణం, ఆర్బీఐ ఎంపీసీ సమావేశ మినిట్స్, బ్యాంక్ రుణాల వృద్ధి, వాణిజ్య లోటు గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. అంతర్జాతీయంగా.. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై కన్నేయొచ్చు. యూరో ఏరియా పారిశ్రామికోత్పత్తి, అమెరికా రిటైల్ విక్రయాలు, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, అమెరికా తయారీ, యూరో ఏరియా ద్రవ్యోల్బణం, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్ గణాంకాలు ప్రభావం చూపొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాలిస్తే.. చమురు ధరలు పరుగులు తీసి, ఈక్విటీ మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
తక్షణ మద్దతు స్థాయులు: 73,485, 73,120, 72,363
తక్షణ నిరోధ స్థాయులు: 74,952, 75,300, 75,850
సెన్సెక్స్కు 73,000- 73,485 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!