సూచీలకూ యుద్ధ భయాలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.
లాభాల స్వీకరణకు అవకాశం
లోహ, యంత్రపరికరాల షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనా
17న మార్కెట్లకు శ్రీరామనవమి సెలవు
స్టాక్ మార్కెట్
ఈ వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.. ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని వారంటున్నారు. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానుంది. సాంకేతికంగా నిఫ్టీ-50 సూచీ 22,500 పాయింట్ల కిందకు లేదా 22,750 పైకి వెళితేనే స్పష్టమైన దిశకు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి 22,500 వద్ద మద్దతు ఉందని.. ఈ స్థాయి కిందకు వస్తే 22,350కు పడిపోవచ్చని అంచనా. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. ఫలితాలకు ముందు ఎంపిక చేసిన షేర్లలో కదలికలకు ఎక్కువ అవకాశం ఉంది. అరబిందో ఫార్మా, సన్ఫార్మా షేర్లు మరింత ఒత్తిడికి గురికావొచ్చు.
- చమురు-గ్యాస్ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. చమురు ధరలు పెరగడంతో బీపీసీఎల్, ఐఓసీఎల్ వంటి మార్కెటింగ్ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు.
- ఫలితాల నేపథ్యంలో సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మార్చి త్రైమాసికంలో కంపెనీలు అధిక విక్రయాలనే నమోదు చేశాయని అంచనా.
- ఎక్కువ శాతం వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. వాహన సూచీకి 21,700 వద్ద మద్దతు, 22,100 వద్ద నిరోధం కనిపిస్తోంది. బజాజ్ ఆటో, మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ రాణించే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్, మారుతీ ఒత్తిడిలో కొనసాగొచ్చు.
- ఐటీ షేర్లు ఊగిసలాడొచ్చు. అంచనాలను మించి టీసీఎస్ రాణించడం, ఈ రంగ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు. ఇన్ఫోసిస్ (గురువారం), విప్రో (శుక్రవారం) ఫలితాలనూ గమనించాలి.
- లోహ కంపెనీల షేర్లు బులిష్ ధోరణిలో ట్రేడవవచ్చు. సానుకూల ప్రాంతీయ, అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు నేపథ్యం. ప్రపంచ వ్యాప్తంగా కమొడిటీ ధరల్లో పెరుగుదల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందొచ్చు. హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్ షేర్లను గమనించొచ్చు.
- ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలను అంచనా వేయొచ్చు. కొద్ది నెలలుగా కొత్త వినియోగదార్లు పెరుగుతుండడం ఈ రంగానికి సానుకూలతను తీసుకురావొచ్చు. వొడాఫోన్ ఐడియా షేరు ఈ వారం రూ.14.25 దాకా వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
- నిఫ్టీ బ్యాంక్ ఈ వారం 50,000 స్థాయిని అధిగమించొచ్చని అంచనా. సాంకేతికంగా 48,300-48,100 స్థాయి వద్ద లాంగ్ ట్రేడ్స్లోకి అడుగుపెట్టొచ్చు. ఈనెల 20న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వెలువడనున్నాయి.
- బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. అయితే షేర్లు అధిక విలువల్లో ఉన్నందున, లాభాలు పరిమితంగా ఉండొచ్చు.
- ఎఫ్ఎమ్సీజీ షేర్లు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ వృద్ధి స్తబ్దుగా ఉండడానికి తోడు, విక్రయాల పరిణామాల్లో ఒత్తిడి ఎదుర్కొంటుండడం ఇందుకు నేపథ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట