సూచీలకూ యుద్ధ భయాలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.
లాభాల స్వీకరణకు అవకాశం
లోహ, యంత్రపరికరాల షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనా
17న మార్కెట్లకు శ్రీరామనవమి సెలవు
స్టాక్ మార్కెట్
ఈ వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.. ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని వారంటున్నారు. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానుంది. సాంకేతికంగా నిఫ్టీ-50 సూచీ 22,500 పాయింట్ల కిందకు లేదా 22,750 పైకి వెళితేనే స్పష్టమైన దిశకు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి 22,500 వద్ద మద్దతు ఉందని.. ఈ స్థాయి కిందకు వస్తే 22,350కు పడిపోవచ్చని అంచనా. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. ఫలితాలకు ముందు ఎంపిక చేసిన షేర్లలో కదలికలకు ఎక్కువ అవకాశం ఉంది. అరబిందో ఫార్మా, సన్ఫార్మా షేర్లు మరింత ఒత్తిడికి గురికావొచ్చు.
- చమురు-గ్యాస్ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. చమురు ధరలు పెరగడంతో బీపీసీఎల్, ఐఓసీఎల్ వంటి మార్కెటింగ్ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు.
- ఫలితాల నేపథ్యంలో సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మార్చి త్రైమాసికంలో కంపెనీలు అధిక విక్రయాలనే నమోదు చేశాయని అంచనా.
- ఎక్కువ శాతం వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. వాహన సూచీకి 21,700 వద్ద మద్దతు, 22,100 వద్ద నిరోధం కనిపిస్తోంది. బజాజ్ ఆటో, మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ రాణించే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్, మారుతీ ఒత్తిడిలో కొనసాగొచ్చు.
- ఐటీ షేర్లు ఊగిసలాడొచ్చు. అంచనాలను మించి టీసీఎస్ రాణించడం, ఈ రంగ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు. ఇన్ఫోసిస్ (గురువారం), విప్రో (శుక్రవారం) ఫలితాలనూ గమనించాలి.
- లోహ కంపెనీల షేర్లు బులిష్ ధోరణిలో ట్రేడవవచ్చు. సానుకూల ప్రాంతీయ, అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు నేపథ్యం. ప్రపంచ వ్యాప్తంగా కమొడిటీ ధరల్లో పెరుగుదల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందొచ్చు. హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్ షేర్లను గమనించొచ్చు.
- ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలను అంచనా వేయొచ్చు. కొద్ది నెలలుగా కొత్త వినియోగదార్లు పెరుగుతుండడం ఈ రంగానికి సానుకూలతను తీసుకురావొచ్చు. వొడాఫోన్ ఐడియా షేరు ఈ వారం రూ.14.25 దాకా వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
- నిఫ్టీ బ్యాంక్ ఈ వారం 50,000 స్థాయిని అధిగమించొచ్చని అంచనా. సాంకేతికంగా 48,300-48,100 స్థాయి వద్ద లాంగ్ ట్రేడ్స్లోకి అడుగుపెట్టొచ్చు. ఈనెల 20న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వెలువడనున్నాయి.
- బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. అయితే షేర్లు అధిక విలువల్లో ఉన్నందున, లాభాలు పరిమితంగా ఉండొచ్చు.
- ఎఫ్ఎమ్సీజీ షేర్లు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ వృద్ధి స్తబ్దుగా ఉండడానికి తోడు, విక్రయాల పరిణామాల్లో ఒత్తిడి ఎదుర్కొంటుండడం ఇందుకు నేపథ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎలా వస్తుంది.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మందలింపు
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి