వస్తువుల ఎగుమతులు 3.11% తగ్గాయ్
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల, మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్ డాలర్ల (సుమారు రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది.
2023-24పై వాణిజ్య శాఖ
దిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల, మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్ డాలర్ల (సుమారు రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో దిగుమతులు కూడా 715.97 బి.డాలర్ల (సుమారు రూ.59.42 లక్షల కోట్ల) నుంచి 5.41% తగ్గి 677.24 బి.డాలర్ల (సుమారు రూ.56.22 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 240.17 బి.డాలర్లు (సుమారు రూ.19.93 లక్షల కోట్లు)గా నమోదైంది. దేశ వస్తువుల ఎగుమతులు మార్చిలో కాస్త తగ్గి 41.68 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.46 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు 5.98% తగ్గి 57.28 బి.డాలర్ల (సుమారు రూ.4.75 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.
ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఔషధాలే ఎక్కువ: 2023-24లో ఎగుమతులకు ఎలక్ట్రానిక్స్, ఔషధాలు-ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, ముడి ఇనుము, కాటన్ యార్న్/ఫాబ్స్/మేడ్-అప్స్, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, సిరామిక్, గ్లాస్వేర్ తదితరాలు ఊతంగా నిలిచాయి. మొత్తం ఎగుమతులు (వస్తువులు+సేవలు) 2023-24లో 776.68 బి. డాలర్ల (సుమారు రూ.64.46 లక్షల కోట్ల)కు చేరి ఉంటాయని అంచనా. 2022-23లోని 776.40 బి. డాలర్ల (సుమారు రూ.64.44 లక్షల కోట్ల) తో పోలిస్తే స్వల్పంగా అధికం.
పశ్చిమాసియా సంక్షోభం: ‘పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దీనిపై ఎక్కువ మాట్లాడలేమ’ని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తవాల్ పేర్కొన్నారు.
9.67% పెరిగిన ఫార్మా ఎగుమతులు: ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.32 లక్షల కోట్ల (27.85 బిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సర ఎగుమతులు రూ.2.1 లక్షల కోట్ల (25.39 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఇవి 9.67% అధికమని వాణిజ్య శాఖ తెలిపింది. మార్చిలో ఎగుమతులు రూ.23 వేల కోట్ల (2802.78 మిలియన్ డాలర్లు) మేరకు ఉన్నాయి. 2023 మార్చితో పోలిస్తే ఇది 12.73% అధికం. నియంత్రణపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ అమెరికాకు ఔషధ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 15 శాతానికిపైగా వృద్ధి సాధించాయి. 2022-23 ఇదే కాలంలో ఎగుమతులు 6.18 శాతమే వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో అమెరికా మార్కెట్కు ఔషధ ఎగుమతుల విలువ 7.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.65,000 కోట్లు)గా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ మొత్తం 6.8 బి.డాలర్లే (సుమారు రూ.56,500 కోట్లు). మన దేశ ఔషధ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా 30% ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్