3 నెలల గరిష్ఠానికి టోకు ధరలు

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో స్వల్పంగా పెరిగి 0.53 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్ఠం. కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లి, ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం.

Published : 16 Apr 2024 03:50 IST

మార్చిలో 0.53 శాతానికి చేరిక

దిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో స్వల్పంగా పెరిగి 0.53 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్ఠం. కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లి, ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 0.20 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు టోకు ద్రవ్యోల్బణం ప్రతిద్రవ్యోల్బణ స్థితిలోనే ఉంది. గత నవంబరులో సానుకూలంగా మారి 0.26 శాతంగా నమోదైంది. 2023 మార్చిలో ఇది 1.41 శాతంగా ఉంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..

  • ఈ ఏడాది మార్చిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 6.88 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలలో ఇది 5.42 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణ రేటు -2.39 శాతం నుంచి గణనీయంగా పెరిగి 19.52 శాతానికి చేరింది.
  • బంగాళాదుంపల ద్రవ్యోల్బణ రేటు -25.59% నుంచి 52.96 శాతానికి, ఉల్లిపాయల ద్రవ్యోల్బణం -36.83% నుంచి 56.99 శాతానికి పెరిగింది.
  • తృణధాన్యాల ద్రవ్యోల్బణం 12 నెలల గరిష్ఠమైన 9 శాతానికి పెరగ్గా, పప్పు ధాన్యాల ధరల్లో 17.2 శాతం పెరుగుదల నమోదైంది.
  • ముడి చమురు ద్రవ్యోల్బణం కూడా 10.26 శాతానికి పెరిగింది. కిందటేడాది మార్చిలో -23.53 శాతంగా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని