సంక్షిప్త వార్తలు
పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్ టెక్నాలజీ సంస్థ ఎస్ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్ కార్టన్ ప్యాక్లలో అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేక కార్టన్ ప్యాక్లలో హెరిటేజ్ ఫుడ్స్ శీతల పానీయాలు
ఈనాడు, హైదరాబాద్: పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్ టెక్నాలజీ సంస్థ ఎస్ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్ కార్టన్ ప్యాక్లలో అందుబాటులోకి తెచ్చింది. ఎస్ఐజీ తమకు ఫ్లెక్సిబుల్ ఫిల్లింగ్ సొల్యూషన్స్, వినూత్న ఎసెప్టిక్ ప్యాకేజింగ్ పరిజ్ఞానాన్ని సరఫరా చేసినందున.. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా శీతల పానీయాలను, ఇతర ఉత్పత్తులను విడుదల చేయగలుగుతున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. ఎస్ఐజీ ఎక్స్స్లిమ్ 12 అసెప్టిక్ ఫిల్లింగ్ మెషీన్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తన యూనిట్లో హెరిటేజ్ ఫుడ్స్ ఏర్పాటు చేసింది. ఈ యంత్రం గంటకు 12,000 కార్టన్ ప్యాక్లను నింపుతుంది. 80-200 మిల్లీలీటర్ల పరిమాణాల్లో ప్యాక్ చేయొచ్చు. దీనివల్ల వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా శీతల పానీయాలను అందించగలమని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా తెలిపారు. విలువ జోడించిన ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడంపైనా తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని, దీనికి నూతన సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. అసెప్టిక్ కార్టన్ ప్యాక్లను పూర్తిగా పునర్వినియోగానికి అనువైనవని, తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు.
కిమ్స్ హాస్పిటల్స్ అనుబంధ సంస్థకు ఐటీ నోటీసు
ఈనాడు, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు అనుబంధ సంస్థ అయిన ఎస్పీఏఎన్వీ మెడిసెర్చ్ లైఫ్సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.306.97 కోట్లకు ‘డిమాండ్ నోటీసు’ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 156 కింద 2022-23 అసెస్మెంట్ ఏడాదికి సంబంధించి ఈ నోటీసు ఇచ్చినట్లు కిమ్స్ హాస్పిటల్స్ మంగళవారం బీఎస్ఈకి తెలిపింది. మార్చి 29వ తేదీతో నోటీసు జారీ అయినట్లు పేర్కొంది. ఎస్పీఏఎన్వీ మెడిసెర్చ్ లైఫ్సైన్సెస్ మూలధనం, షేరు ప్రీమియం ఖాతా, సెక్యూరిటీ లేని రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంబంధించిన ప్రశ్నలకు తగిన వివరణ ఇవ్వలేదనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసినట్లు వివరించింది. చట్ట ప్రకారం ఈ నోటీసు నిలవదని, దీనిపై ఎన్ఎఫ్ఏసీ (నేషనల్ ఫేస్లెస్ అప్పీల్ సెంటర్) లో అప్పీలు చేయబోతున్నట్లు కిమ్స్ హాస్పిటల్ వెల్లడించింది.
భారత్ తయారీ సర్వర్లు ప్రారంభించిన హెచ్పీఈ
దిల్లీ: భారతదేశంలోనే సర్వర్లను తయారు చేస్తామని చెప్పిన ఏడాదిలోపే, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్పీఈ) భారీ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను తీసుకొచ్చింది. 2023 జులై లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలను ఈ కంపెనీ ప్రకటించింది. భారత తయారీ సంస్థ వీవీడీఎన్ టెక్నాలజీస్తో కలిసి తొలి అయిదేళ్లలో 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8300 కోట్ల) విలువైన హై వాల్యూమ్ సర్వర్లను తయారు చేస్తామని ఆ సమయంలో పేర్కొంది. పెరుగుతున్న భారత వినియోగదార్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మేడ్ ఇన్ ఇండియా సర్వర్లను భారీ స్థాయిలో తీసుకొచ్చినట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా తమ లాంటి తయారీదార్లకు ఊతమిచ్చినందుకు కేంద్రం, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హెచ్పీఈ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సోమ్ సత్సంగి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..