రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్ ఎగుమతులు
మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి.
2023-24లో మనదేశం నుంచి
దిల్లీ: మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. ఇదే సమయంలో దేశం నుంచి మొత్తం అన్ని కంపెనీల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు కూడా 12 బి. డాలర్ల (సుమారు రూ. 99,600 కోట్ల) నుంచి 16.5 బి. డాలర్ల (సుమారు రూ. 1.37 లక్షల కోట్ల)కు చేరాయి. భారత్లో యాపిల్ ఫోన్ల తయారీ పెరగడం, ఎగుమతుల విలువ పెరిగేందుకు కారణమైందని ద ట్రేడ్ విజన్ ఎల్ఎల్సీ పేర్కొంది. ‘భారత్లో తయారీ కార్యకలాపాలను పెంచాలని యాపిల్ నిర్ణయించింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య తన సరఫరా వ్యవస్థను చైనా బయటకు విస్తరించాలని యాపిల్ భావించడం ఇందుకు కారణమ’ని తెలిపింది. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం తరహా భారత ప్రభుత్వ చర్యల వల్ల యాపిల్ వంటి కంపెనీలు స్థానిక తయారీ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ట్రేడ్ విజన్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) మోనికా ఒబెరాయ్ అంచనా వేశారు.
భారత్ తయారీ ఐఫోన్లపై అమెరికన్ల మక్కువ: భారత్ నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికాదే తొలిస్థానం. 2023-24లో భారత్ నుంచి 6బి.డాలర్ల (సుమారు రూ.50,000 కోట్ల) విలువైన స్మార్ట్ఫోన్లను అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో ఐఫోన్ల వాటానే 5.46 బి. డాలర్లు (రూ.45,300 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది నమోదైన 2.1 బి. డాలర్ల (సుమారు రూ.17,400 కోట్ల) తో పోలిస్తే ఈమొత్తం చాలా ఎక్కువ. భారత్లో తయారైన ఐఫోన్లపై అమెరికా వినియోగదార్లు మక్కువ చూపడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు