సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది.
ప్రీమియర్ ఎనర్జీస్కు పీవీ మాడ్యూల్స్ ఎగుమతి కాంట్రాక్టు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, బంగ్లాదేశ్లో చేపట్టిన సోలార్ ఈపీసీ ప్రాజెక్టుకు ఈ మాడ్యూల్స్ ఎగుమతి చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ వెల్లడించింది. 2025 ఏప్రిల్ నాటికి పీవీ మాడ్యూల్స్ ఎగుమతిని పూర్తి చేయాల్సి ఉంది. ఈ కాంట్రాక్టుతో తమ పీవీ మాడ్యూల్స్ నాణ్యత, సామర్థ్యానికి గుర్తింపు వచ్చిందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ ఎస్.చిరంజీవి పేర్కొన్నారు.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ.1,272 కోట్ల రైట్స్ ఇష్యూ
దిల్లీ: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,271.83 కోట్ల వరకు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బుధవారం ప్రకటించింది. రైట్స్ ఇష్యూలో ఒక్కో షేరును రూ.300 చొప్పున కేటాయించనుంది. రైట్స్ ఇష్యూలో భాగంగా 4,23,94,270 ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లను వాటాదార్లకు కేటాయించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తెలిపింది. ఏప్రిల్ 23ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్య ప్రస్తుత వాటాదార్లు, ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వాటాదార్లకు ఉన్న ప్రతి 9 షేర్లకు ఒక రైట్స్ ఇష్యూ షేరు జారీచేసే అవకాశం ఉంది.
సౌర సొల్యూషన్ల రంగంలోకి యాపిల్
దిల్లీ: భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్మ్యాక్స్తో సంయుక్త సంస్థను ఐఫోన్ తయారీదారు యాపిల్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 6 పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను ఈ సంయుక్త సంస్థ అమర్చింది.
దైమ్లర్ ఇండియా నుంచి ఇక్యాంటర్
దిల్లీ: దేశీయంగా విద్యుత్ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డీఐసీవీ) వెల్లడించింది. ఆల్-ఎలక్ట్రిక్ తదుపరి తరం తేలికపాటి ట్రక్ ఇక్యాంటర్ను వచ్చే 6-12 నెలల్లో విడుదల చేస్తామని పేర్కొంది. 2022 ద్వితీయార్ధంలో జపాన్, ఐరోపాల్లో ఇక్యాంటర్ను ప్రదర్శించారు. ‘మా మొత్తం ఉత్పత్తి పోర్ట్ఫోలియోను కర్బన రహితం చేసే దీర్ఘకాలిక వ్యూహానికి తొలి అడుగులు వేయబోతున్నాం. ఇందులో భాగంగా 6-12 నెలల్లో ఇక్యాంటర్ను విపణిలోకి తీసుకొస్తామ’ని డీఐసీవీ ఎండీ, సీఈఓ సత్యకామ్ ఆర్య వెల్లడించారు.
జీల్లో నాలుగు కీలక విభాగాలు
దిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తన సంస్థాగత నిర్మాణాన్ని సవరించింది. ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా ఇకపై దేశీయ బ్రాడ్క్యాస్ట్ వ్యాపారం సహా కీలక విభాగాలకు నేరుగా నేతృత్వం వహిస్తారని సంస్థ బుధవారం ప్రకటించింది. బోర్డు అంగీకరించిన కొత్త సంస్థాగత నిర్మాణం ప్రకారం.. జీల్లో బ్రాడ్క్యాస్ట్, డిజిటల్, సినిమాలు, సంగీతం అనే నాలుగు కీలక వ్యాపార విభాగాలుంటాయి. పునీత్ గోయెంకా సోదరుడు అమిత్ గోయెంకా ప్రస్తుతం డిజిటల్ వ్యాపారానికి అధిపతిగా ఉండగా.. ఇంటర్నేషనల్ బ్రాడ్క్యాస్ట్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, బ్రాడ్క్యాస్ట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్ విభాగాల అదనపు బాధ్యతలూ చేపడతారు. దేశీయ బ్రాడ్క్యాస్ట్ వ్యాపారంలో ప్రస్తుతం దక్షిణ ఛానళ్ల క్లస్టర్లకు అధిపతిగా ఉన్న సిజు ప్రభాకరన్ పశ్చిమ క్లస్టర్ బాధ్యతలూ తీసుకుంటారు. తూర్పు క్లస్టర్ అధిపతి సామ్రాట్ ఘోష్ ఇక నుంచి ఉత్తర, ప్రీమియం క్లస్టర్ల అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఇలా పలు మార్పులను కంపెనీ చేపట్టింది.
అంబుజా సిమెంట్స్లో అదానీ మరో రూ.8,339 కోట్ల పెట్టుబడి
70.3 శాతానికి పెరిగిన వాటా
దిల్లీ: అంబుజా సిమెంట్స్లో గౌతమ్ అదానీ కుటుంబం అదనంగా రూ.8,339 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో కంపెనీలో వారి వాటా మరో 3.6% పెరిగి 70.3 శాతానికి చేరింది. ఇంతకుమునుపు 2022 అక్టోబరు 18న రూ.5000 కోట్లు, 2024 మార్చి 28న రూ.6,661 కోట్ల మేర నిధులను అంబుజా సిమెంట్స్లో అదానీ కుటుంబం పెట్టుబడిగా పెట్టింది. తాజా పెట్టుబడితో రూ.20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను పూర్తి చేసినట్లు అయ్యింది. అంబుజా సిమెంట్స్లో 63.2 శాతంగా ఉన్న అదానీల వాటా, ఈ రూ.20,000 కోట్ల పెట్టుబడితో 70.3 శాతానికి పెరిగింది. గత డిసెంబరు 31 నాటికి 76.1 మిలియన్ టన్నులుగా ఉన్న సంస్థ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 2028 కల్లా దాదాపుగా రెట్టింపు చేసి, 140 మిలియన్ టన్నులకు చేర్చాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పెట్టుబడులు అంబుజా సిమెంట్స్కు ఉపయోగపడనున్నాయి. ‘అంబుజాలో అదానీ కుటుంబం రూ.20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను పూర్తి చేసినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంద’ని అంబుజా సిమెంట్స్ సీఈఓ అజయ్ కపూర్ తెలిపారు.
నేటి బోర్డు సమావేశాలు: ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నెట్వర్క్ 18, టీవీ 18 బ్రాడ్కాస్ట్, ఓరియెంట్ హోటల్స్
బుధవారం మార్కెట్లు పనిచేయలేదు: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. మనీ, బులియన్, డెరివేటివ్ మార్కెట్లకు కూడా సెలవే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్