యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు.
ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ మంది ఆసక్తి
రైల్వేలో ప్యూన్ ఉద్యోగాలకూ పీహెచ్డీల దరఖాస్తు
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్
వాషింగ్టన్: దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. నిరుద్యోగ సమస్య దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోందని, యువత నైపుణ్యాలు పెంచి, వారికి ఉపాధి చూపకపోతే.. పరిస్థితులు ఇబ్బందికరంగా మారొచ్చనే అంచనాను వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారని, పీహెచ్డీ చేసిన వారు సైతం రైల్వేలో ప్యూన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలోనూ తగిన ఉద్యోగాలు లభించకపోవడమే ఇందుకు కారణమన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘మేకింగ్ ఇండియా యాన్ అడ్వాన్స్డ్ ఎకానమీ బై 2047’ అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ రాజన్ మాట్లాడారు.
యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ మధ్య స్థాయిలోనే ఉందని, ఈ విషయంలో చైనా, కొరియా వంటి దేశాలు అధిక ప్రతిఫలాన్ని పొందాయని గుర్తు చేశారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాలని సూచించారు.
అప్రెంటిస్షిప్ మంచి ఆలోచన: మన మానవ వనరుల సామర్థ్యాలను కొంతైనా మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న ఉద్యోగాల స్వభావాన్ని పాక్షికంగా మార్చడం వంటి అంశాలపైనా పని చేయాలని రఘురామ రాజన్ పేర్కొన్నారు. ‘నైపుణ్యాల పెంపునకు అప్రెంటిస్షిప్ మంచి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఈ ఆలోచనను ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. చిప్ పరిశ్రమ కోసం రూ.వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వాలు, అత్యధికులకు ఉపాధి కల్పించే తోలు రంగం వంటి వాటిపై శీతకన్ను వేస్తున్నాయని వివరించారు. మన దేశానికి చెందిన చాలా మంది ఆవిష్కర్తలు, సింగపూర్, సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు వెళ్లి, అక్కడ సంస్థలు స్థాపించేందుకు, ‘తుది వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకే’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజన్ తెలిపారు. చాలా మంది భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథంతో ఉంటున్నారని, కానీ వారు దేశీయంగా ఉండటానికి ఇష్టపడటం లేదన్నారు. యువ భారత్ మనస్తత్వాన్ని విరాట్ కోహ్లీతో రాజన్ పోల్చారు. ప్రపంచంలో ఎవరికంటే తాము తీసిపోమనే దృక్పథంతో ఉంటున్నారని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.