దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది.
దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు
లాభాలు పెరిగే అవకాశం
ఈనాడు - హైదరాబాద్
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. వీటిని చాలావరకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో పెన్సిలిన్ జీ, అజిత్రోమైసిన్, సెఫ్ట్రియాగ్జోన్, విటమిన్ బి1, అమోక్సిసిలిన్.. తదితర ఔషధాలున్నాయి. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో వీటి ధరలు, 2023 ఇదే కాలంతో పోల్చిచూస్తే దాదాపు 14% తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
కలిసొచ్చిన పీఎల్ఐ పథకం
చైనాలో ముడి ఔషధాల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. మనదేశంలో మాత్రం వీటి ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది. కొవిడ్-19 పరిణామాల తర్వాత కేంద్రం ప్రభుత్వం ‘ముడి ఔషధాల దేశీయ ఉత్పత్తి పెంచి, చైనాపై ఆధారపడటం తగ్గించాలని’ నిర్ణయించి, ఆ దిశగా చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణం. ముడి ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద రాయితీలు, ప్రోత్సాహకాలు వర్తింపజేస్తుండటం ఉపకరిస్తోంది. పీఎల్ఐ పథకం కింద పెన్సిలిన్ జీ ఔషధాల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద భారీ యూనిట్ను అరబిందో ఫార్మా నెలకొల్పింది. దేశంలోని మరికొన్ని చోట్ల ముడి ఔషధాల ఉత్పత్తి కోసం యూనిట్లు ఏర్పాటవుతున్నందున, దేశీయంగా వీటి ఉత్పత్తి, సరఫరా పెరుగుతోంది. తత్ఫలితంగానే ముడి ఔషధాల ధరలు మనదగ్గర కొంత తగ్గినట్లు తెలుస్తోంది. దేశీయ ఫార్మా కంపెనీలకు ఇది కలిసొచ్చే పరిణామమే. అయితే రవాణా ఛార్జీలు పెరగడం, మార్కెటింగ్- బ్రాండింగ్- విక్రయాల ఖర్చులూ అధికమై ఫార్మా కంపెనీలు కొంత ఇబ్బంది పడుతున్నాయి.
ఆదాయాలు 15% పెరిగే వీలు
దేశీయ మార్కెట్లో తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు) విక్రయిస్తున్న అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల జనవరి- మార్చి ఆదాయాలు, ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చితే సగటున 15% వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సానుకూలత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లో అధిక విలువ గల జనరిక్ ఔషధాలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. కానీ పోటీ నేపథ్యంలో, ఈ ఔషధాలపై వచ్చే ఆదాయం కొంత తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో వినియోగించే జనరిక్ రెవ్లీమిడ్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సిప్లా.. తదితర కంపెనీలు అమెరికాలో అందిస్తున్నాయి. కానీ పోటీ వల్ల ఈ మందుపై లాభాలు క్రమేపీ తగ్గుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని కొత్త జనరిక్ ఔషధాలను మన కంపెనీలు అమెరికాలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అందువల్ల దేశీయ ఫార్మా కంపెనీలు సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతాయని, 2025, 2026 ఆర్థిక సంవత్సరాల్లో మెరుగైన ఆదాయాలు నమోదు చేయగలుగుతాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం