దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది.
దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు
లాభాలు పెరిగే అవకాశం
ఈనాడు - హైదరాబాద్
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. వీటిని చాలావరకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో పెన్సిలిన్ జీ, అజిత్రోమైసిన్, సెఫ్ట్రియాగ్జోన్, విటమిన్ బి1, అమోక్సిసిలిన్.. తదితర ఔషధాలున్నాయి. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో వీటి ధరలు, 2023 ఇదే కాలంతో పోల్చిచూస్తే దాదాపు 14% తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
కలిసొచ్చిన పీఎల్ఐ పథకం
చైనాలో ముడి ఔషధాల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. మనదేశంలో మాత్రం వీటి ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది. కొవిడ్-19 పరిణామాల తర్వాత కేంద్రం ప్రభుత్వం ‘ముడి ఔషధాల దేశీయ ఉత్పత్తి పెంచి, చైనాపై ఆధారపడటం తగ్గించాలని’ నిర్ణయించి, ఆ దిశగా చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణం. ముడి ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద రాయితీలు, ప్రోత్సాహకాలు వర్తింపజేస్తుండటం ఉపకరిస్తోంది. పీఎల్ఐ పథకం కింద పెన్సిలిన్ జీ ఔషధాల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద భారీ యూనిట్ను అరబిందో ఫార్మా నెలకొల్పింది. దేశంలోని మరికొన్ని చోట్ల ముడి ఔషధాల ఉత్పత్తి కోసం యూనిట్లు ఏర్పాటవుతున్నందున, దేశీయంగా వీటి ఉత్పత్తి, సరఫరా పెరుగుతోంది. తత్ఫలితంగానే ముడి ఔషధాల ధరలు మనదగ్గర కొంత తగ్గినట్లు తెలుస్తోంది. దేశీయ ఫార్మా కంపెనీలకు ఇది కలిసొచ్చే పరిణామమే. అయితే రవాణా ఛార్జీలు పెరగడం, మార్కెటింగ్- బ్రాండింగ్- విక్రయాల ఖర్చులూ అధికమై ఫార్మా కంపెనీలు కొంత ఇబ్బంది పడుతున్నాయి.
ఆదాయాలు 15% పెరిగే వీలు
దేశీయ మార్కెట్లో తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు) విక్రయిస్తున్న అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల జనవరి- మార్చి ఆదాయాలు, ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చితే సగటున 15% వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సానుకూలత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లో అధిక విలువ గల జనరిక్ ఔషధాలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. కానీ పోటీ నేపథ్యంలో, ఈ ఔషధాలపై వచ్చే ఆదాయం కొంత తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో వినియోగించే జనరిక్ రెవ్లీమిడ్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సిప్లా.. తదితర కంపెనీలు అమెరికాలో అందిస్తున్నాయి. కానీ పోటీ వల్ల ఈ మందుపై లాభాలు క్రమేపీ తగ్గుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని కొత్త జనరిక్ ఔషధాలను మన కంపెనీలు అమెరికాలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అందువల్ల దేశీయ ఫార్మా కంపెనీలు సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతాయని, 2025, 2026 ఆర్థిక సంవత్సరాల్లో మెరుగైన ఆదాయాలు నమోదు చేయగలుగుతాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?