+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది.
4 రోజుల్లో ఆవిరైన రూ.9.30 లక్షల కోట్ల సంపద
సమీక్ష
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గడానికి తోడు ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 83.52 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.63% తగ్గి 86.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు రాణించాయి.
మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో రూ.9.30 లక్షల కోట్లు ఆవిరై రూ.392.89 లక్షల కోట్లకు చేరింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 2,549.16 పాయింట్లు కుదేలైంది.
సెన్సెక్స్ ఉదయం 73,183.10 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ, 530 పాయింట్ల లాభంతో 73,473.05 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, ఒకదశలో 72,365.67 పాయింట్లకు పడిపోయింది. చివరకు 454.69 పాయింట్లు నష్టపోయి 72,488.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 152.05 పాయింట్లు తగ్గి 21,995.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,961.70- 22,326.50 పాయింట్ల మధ్య కదలాడింది.
- భారత్ సహా పలు దేశాల్లో శిశు ఉత్పత్తుల్లో అధిక చక్కెర వినియోగిస్తున్నట్లు వార్తలు రావడంతో నెస్లే ఇండియా షేరు 3.31% కుదేలై రూ.2,462.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,137.49 కోట్లు తగ్గి రూ.2.37 లక్షల కోట్లకు చేరింది.
- త్రైమాసిక లాభం 38% పెరగడంతో జస్ట్ డయల్ షేరు 12.97% దూసుకెళ్లి రూ.1,009.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1,024.85 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.
- కంపెనీలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.8,339 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో అంబుజా సిమెంట్స్ షేరు ప్రారంభ ట్రేడింగ్లో 3.88% లాభపడి రూ.640.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు లాభాల స్వీకరణతో 0.11% తగ్గి రూ.616.30 వద్ద ముగిసింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 26 నష్టపోయాయి. టైటన్ 3.31%, యాక్సిస్ బ్యాంక్ 2.72%, ఎన్టీపీసీ 2.19%, టాటా మోటార్స్ 2.12%, ఐటీసీ 1.64%, బజాజ్ ఫిన్సర్వ్ 1.50%, టెక్ మహీంద్రా 1.35%, సన్ఫార్మా 1.29%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.13%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.13% నీరసపడ్డాయి. ఎయిర్టెల్ 4.15%, పవర్గ్రిడ్ 2.13%, ఇన్ఫోసిస్ 0.41% లాభపడ్డాయి.
- క్లౌడ్ సేవలు అందించే బ్లేజ్క్లాన్ టెక్నాలజీస్ను అనుబంధ సంస్థ ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా రూ.485 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయ్యేందుకు 6-8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
- తమ శ్రీలంక కార్యకలాపాలను డైలాగ్ యాక్సియటాతో ఈక్విటీ స్వాప్ లావాదేవీ పద్ధతిలో విలీనం చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ శ్రీలంక టర్నోవర్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.294 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్టెల్ మొత్తం వ్యాపారంలో ఇది 0.21 శాతానికి సమానం.
- హీటింగ్ పరికరాల తయారీ సంస్థ జేఎన్కే ఇండియా ఐపీఓ ఈనెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.395- 415 ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.650 కోట్లు సమీకరించనుంది. యాంకర్ మదుపర్లు 22న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 36 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రపంచంలో మూడో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా అవతరించినట్లు హిందుస్థాన్ జింక్ తెలిపింది
- హరియాణాలోని మనేసర్ తయారీ ప్లాంట్లో కొత్త ఇంజిన్ అసెంబ్లీ లైన్ను హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రారంభించింది. రోజుకు ఇక్కడ 600 ఇంజిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
- వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల ఫాలోఆన్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు మొదటి రోజైన గురువారం 26% స్పందనే లభించింది. 1260 కోట్ల షేర్లను సంస్థ ఆఫర్ చేయగా, 331.24 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
- కంపెనీ ఖాతాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో దిల్లీకి చెందిన లీల్ ఎలక్ట్రికల్స్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.14.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ ప్రమోటర్ భరత్రాజ్ పంజ్, ఆరుగురు మాజీ అధికారులను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి అయిదేళ్ల పాటు నిషేధించింది. నమోదిత సంస్థల్లో వారు మూడేళ్ల పాటు పనిచేయరాదని ఆదేశించింది.
- భవిష్యత్ కార్యాచరణను కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించడంతో వేదాంతా షేరు ఇంట్రాడేలో 4.41% పరుగులు తీసి రూ.394.70 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.88% లాభంతో రూ.388.90 వద్ద ముగిసింది. ఈ నెలలో కంపెనీ షేరు 45% దూసుకెళ్లడం విశేషం. గత 10 ఏళ్లలో షేరుకు ఇది అతిపెద్ద ఒకనెల లాభం.
నేటి బోర్డు సమావేశాలు: విప్రో, జియో ఫైనాన్షియల్, హిందుస్థాన్ జింక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్టెల్తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
Nithin Kamath: కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హర్షం వ్యక్తం చేశారు. -
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి