ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది.
క్వెస్ కార్ప్ నివేదిక
ముంబయి: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. 2023 మార్చితో పోలిస్తే గత నెలలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు 154% పెరిగాయని, నైపుణ్య వృద్ధి ఇందుకు ఉపకరించిందని తెలిపింది. టెలికాం రంగంలో నియామకాలకు గిరాకీ (64%) బాగా ఉండటంతో మొత్తం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు పెరిగాయని పేర్కొంది. లైటింగ్, వాహన రంగాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో ప్రాంతాల వారీగా చూస్తే 33% వాటాతో తమిళనాడు అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. పరిశ్రమ నిపుణుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించినట్లు క్వెస్ కార్ప్ తెలిపింది.
- ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ముఖ్యంగా తయారీలో వివిధ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయి. మొబైల్ తయారీ రంగంలో వీరికి గిరాకీ బాగా ఉంది. తర్వాత స్థానాల్లో రిటైల్, సేవల రంగాలు ఉన్నాయి.
- 2025-26 నాటికి 10 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి ఎలక్ట్రానిక్స్ విపణి పరిమాణం 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33.20 లక్షల కోట్ల)కు పెరుగుతుందని ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి