అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది.
లాభం 30% వృద్ధితో రూ.7,969 కోట్లకు
2023-24కు రూ.20 తుది డివిడెండు; రూ.8 ప్రత్యేక డివిడెండు
వరుసగా అయిదో త్రైమాసికంలోనూ తగ్గిన ఉద్యోగుల సంఖ్య
2024-25కు 1-3% ఆదాయ వృద్ధి అంచనా
‘గత ఆర్థిక సంవత్సరంలో పెద్ద కాంట్రాక్టుల విలువ రికార్డు స్థాయికి చేరడం.. క్లయింట్లకు మాపై ఉన్న బలమైన విశ్వాసాన్ని తెలియజేస్తోంది. జెనరేటివ్ ఏఐ విభాగంలో మా సామర్థ్యాలను విస్తరించుకోవడాన్ని కొనసాగిస్తాం.’
ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్
దిల్లీ: ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,128 కోట్లతో పోలిస్తే, ఇది 30% అధికం. ఏకీకృత ఆదాయం కూడా రూ.37,923 కోట్ల నుంచి 1.3% పెరిగి రూ.37,441 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 20.1 శాతంగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 (400%) తుది డివిడెండును, ఒక్కో షేరుపై రూ.8 ప్రత్యేక డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
2023-24 మొత్తానికి
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ రూ.26,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 లాభం రూ.24,095 కోట్లతో పోలిస్తే ఈసారి 8.9% పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం రూ.1,46,767 కోట్ల నుంచి 4.7% పెరిగి రూ.1,53,670 కోట్లకు చేరింది. నిర్వహణ మార్జిన్ 20.7 శాతంగా ఉంది.
2023-24లో పెద్ద కాంట్రాక్టుల మొత్తం విలువ 17.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్ల)కు చేరింది. కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇందులో 52% నికరంగా కొత్త కాంట్రాక్టులేనని కంపెనీ తెలిపింది.
23 ఏళ్లలో తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది
2023-24 చివరికి కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,240గా ఉంది. 2022-23 చివరికి ఉన్న 3,43,234 మందితో పోలిస్తే ఈసారి 25,994 (7.5%) మంది తగ్గారు. ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఉద్యోగుల సంఖ్య తగ్గడం గత 23 ఏళ్లలో ఇప్పుడే. జనవరి- మార్చి త్రైమాసికంలోనూ 5,423 మంది ఉద్యోగులు తగ్గారు. తద్వారా వరుసగా అయిదో త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లయ్యింది. జనవరి- మార్చిలో వలసల రేటు 12.6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇది 12.9 శాతంగా ఉంది.
సామర్థ్య వినియోగం 82-83%
‘గత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ సామర్థ్య వినియోగం ట్రెయినీలతో కలిపి 77 శాతంగా ఉంది. అప్పటి వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది సామర్థ్యాన్ని వినియోగించుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు మారడంతో.. దానికి అనుగుణంగా మా విధానంలో మార్పులు చేసుకున్నాయి. ఉద్యోగ సామర్థ్య వినియోగం 82-83 శాతానికి పెరిగింది. మా వలసల రేటు గణనీయంగా తగ్గింది. నికరంగా మా ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు కనిపించడానికి ఇదే కారణమ’ని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేశ్ తెలిపారు.
85% ప్రతిఫలం లక్ష్యం
వాటాదార్లకు అధిక ప్రతిఫలాన్ని అందించేందుకే వ్యూహాత్మక, నిర్వహణ నిధుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే అయిదేళ్లకు (2024-25 నుంచి 2028-29 వరకు) మూలధన కేటాయింపు విధానాన్ని బోర్డు ఆమోదించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ విధానంలో వాటాదార్లకు 85% ప్రతిఫలాన్ని పంచాలని కంపెనీ భావిస్తోంది. వార్షిక డివిడెండును కూడా పెంచుకుంటూ వెళ్లాలని అనుకుంటోంది. కంపెనీ చేతిలో 848 మిలియన్ డాలర్ల (రూ.7000 కోట్లకు పైగా) నగదు నిల్వలు ఉన్నాయి. గత 11 త్రైమాసికాల్లోనే ఇవి అత్యధికం.
రూ.4,000 కోట్లతో ఇన్-టెక్ కొనుగోలు
జర్మనీ సంస్థ ఇన్-టెక్లో 100% వాటాను పూర్తిగా నగదు రూపేణా రూ.4,000 కోట్ల (450 మిలియన్ యూరోల)కు కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. విద్యుత్తు వాహనాలకు సంబంధించి సొల్యూషన్లను ఇన్-టెక్ అభివృద్ధి చేస్తోంది. ఈ లావాదేవీ 2024-25 రెండో అర్ధభాగం కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కొనుగోలు వల్ల జర్మనీ వాహన తయారీదార్లతో సంబంధాలు పెరగడంతో పాటు... జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా, యూకే, చెక్ రిపబ్లిక్, రొమేనియా, స్పెయిన్, భారత్ దేశాల్లోని వివిధ విభాగాల్లో నైపుణ్యమున్న 2,200 మంది సిబ్బంది బృందం ఇన్ఫోసిస్తో కలుస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 1-3 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 4-7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే. నిర్వహణ మార్జిన్ 20-22 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ప్రాంగణ ఎంపికల సంఖ్యను నిర్ణయించలేదు
ఇకపై ఫ్రెషర్ల (తాజా ఉత్తీర్ణుల)ను పూర్తిగా కళాశాల ప్రాంగణ ఎంపికల ద్వారానే నియమించుకోబోమని సీఎఫ్ఓ వెల్లడించారు. సగం కంటే తక్కువ మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా, మిగతా వారిని ఇతర మార్గాల్లో నియమించుకుంటామని పేర్కొన్నారు. అందువల్లే ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రాంగణ నియామకాల లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకోలేదని తెలిపారు. గత నాలుగు త్రైమాసికాలుగా ఇన్ఫోసిస్, ప్రాంగణ ఎంపికలకు దూరంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్టెల్తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
Nithin Kamath: కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హర్షం వ్యక్తం చేశారు. -
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?