నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
ఎఫ్ఎస్ఎస్ఏకు కేంద్రం ఆదేశాలు
దిల్లీ: భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. భారతదేశంలో నెస్లే విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో చక్కెర అధికంగా వినియోగించిందన్న స్విస్ స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ ఐ అండ్ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీఎఫ్ఏఎన్) నివేదిక వెలువడిన నేపథ్యంలో ఈ ఆదేశాలొచ్చాయి. భారత్ సహా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వర్థమాన దేశాల్లో అధిక చక్కెర ఉన్న ఉత్పత్తులను నెస్లే విక్రయిస్తోందని ఆ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికలోని అంశాలపై నిగ్గుతేల్చాలంటూ, నెస్లేపై దర్యాప్తు చేపట్టాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి లేఖ రాసినట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) అధిపతి నిధి ఖరే తెలిపారు.
దేశ పిల్లల ఆరోగ్యం, భద్రతపై ఆందోళనతోనే: జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో విక్రయిస్తున్న సెరిలాక్లో మాత్రం చక్కెర వినియోగించకుండా.. భారత్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో మాత్రం ఒక సర్వింగ్కు 2.7 గ్రాముల వరకు చక్కెరను నెస్లే కలుపుతోందని ఆ నివేదిక ఆరోపించింది. అధిక చక్కెర ఉండే ఉత్పత్తుల వల్ల పిల్లల ఆరోగ్యం, భద్రతపై ప్రభావం పడుతుందన్న ఆందోళనల మధ్య ఈ లేఖ రాసినట్లు నిధి ఖరే తెలిపారు.
- నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) కూడా నివేదిక తమ దృష్టికి వచ్చినట్లు.. ఎఫ్ఎస్ఎస్ఏఐకి నోటీసు జారీ చేసినట్లు తెలిపింది.
- గత అయిదేళ్లలో వేరియంట్ను బట్టి భారత్లోని శిశు ఆహార ఉత్పత్తుల్లో 30 శాతం వరకు యాడెడ్ షుగర్ను తగ్గించినట్లు గురువారం నెస్లే వివరణ ఇచ్చింది. థాయ్లాండ్లో విక్రయించే నెస్లే శిశు ఉత్పత్తుల్లో 6 గ్రాముల (ఒక్కో సర్వింగ్) చక్కెర ఉండగా.. ఫిలిప్పీన్స్లో ఎనిమిదింట అయిదు శాంపిళ్లలో ఇది 7.3 గ్రాములుగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్