నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి.
సమీక్ష
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.55% లాభంతో 87.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో 71,816.46 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం బలంగా పుంజుకుంది. ఒకదశలో 73,210.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసి, చివరకు 599.34 పాయింట్ల లాభంతో 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 151.15 పాయింట్లు పెరిగి 22,147 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,777.65- 22,179.55 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 1,156.57 పాయింట్లు, నిఫ్టీ 372.4 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
- భారత్ సహా పలు దేశాల్లో విక్రయిస్తున్న శిశు ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం ఉంటోందన్న వార్తలతో నెస్లే ఇండియా షేరు క్షీణత కొనసాగింది. శుక్రవారం మరో 1.04% నష్టపోయిన షేరు రూ.2,437.10 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.10,610.55 కోట్లు తగ్గి రూ.2.34 లక్షల కోట్లకు పరిమితమైంది.
- భవిష్యత్తు ఆదాయ వృద్ధి అంచనాలు నిరాశపరచడంతో ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో 2.47% తగ్గి రూ.1,378.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 0.63% నష్టంతో రూ.1,411.60 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,655.37 కోట్లు తగ్గి, రూ.5.85 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ 3.38%, ఎం అండ్ ఎం 2.90%, మారుతీ 2.54%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.49%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.46%, విప్రో 1.92%, భారతీ ఎయిర్టెల్ 1.71%, బజాజ్ ఫిన్సర్వ్ 1.53%, ఐటీసీ 1.40%, టాటా స్టీల్ 1.31% రాణించాయి. హెచ్సీఎల్ టెక్ 1.35%, నెస్లే 1.04%, టీసీఎస్ 0.93%, ఎల్ అండ్ టీ 0.89%, టాటా మోటార్స్ 0.84% వరకు నష్టపోయాయి.
- నారాయణమూర్తి మనవడికి రూ.4.2 కోట్ల డివిడెండ్: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి 5 నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి డివిడెండ్ రూపేణా రూ.4.20 కోట్లు దక్కనున్నాయి. ఇటీవల మనవడికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల షేర్లను నారాయణమూర్తి ఇచ్చారు. కంపెనీ గురువారం ఒక్కోషేరుపై రూ.28 డివిడెండ్ ఇవ్వడంతో, ఆ షేర్లపై ఏకాగ్రహ్కు ఈ మొత్తం లభించనుంది.
- రానా కపూర్కు బెయిల్: రూ.466.51 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారనే ఆరోపణల కేసులో యెస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రానా కపూర్కు ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. 2020 మార్చిలో కపూర్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, 8 కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటిలో ఆయనకు బెయిల్ లభించింది.
- ఈపీఎఫ్ఓలోకి 1.65 కోట్ల మంది: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నికరంగా 1.65 కోట్ల మంది చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022-23లో చేరిన 1.38 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 19% అధికం. దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడాన్ని ఇది సూచిస్తోంది. గత ఆరున్నరేళ్లలో 6.1 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చేరారు. 2018-19లో 61.12 లక్షలు, 2019-20లో 78.58 లక్షలు, 2021-21లో 77.08 లక్షలు, 2021-22లో 1.22 కోట్లు మంది చొప్పున ఈపీఎఫ్ఓలో చేరారు.
- కెనరా బ్యాంక్ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు రికార్డు తేదీగా మే 15ను నిర్ణయించింది.
- వాహన విడిభాగాల తయారీ సంస్థ ఎమ్ఫోర్స్ ఆటో టెక్ ఐపీఓ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.93-98 ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.54 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి.
- వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల ఎఫ్పీఓ రెండో రోజు పుంజుకుంది. ఇష్యూలో 1260 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 617.46 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్ మదుపర్ల నుంచి వచ్చిన రూ.5400 కోట్లు కలిపితే, రెండో రోజు ముగిసేసరికి రూ.12,000 కోట్లకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి.
- భారత్, ఇతర విపణుల్లో ఇటలీ స్పోర్ట్స్ బ్రాండ్ లోట్టో ఉత్పత్తులను విక్రయించేందుకు ఆసంస్థ యాజమాని డబ్ల్యూహెచ్పీ గ్లోబల్ నుంచి బ్రాండ్ లైసెన్స్ను కొనుగోలు చేసినట్లు స్పోర్ట్వేర్ ప్లాట్ఫామ్ అజిలిటాస్ స్పోర్ట్స్ వెల్లడించింది. 40 ఏళ్ల పాటు ఈ లైసెన్సు పనిచేస్తుంది.
నేటిబోర్డు సమావేశాలు: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..