నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి.
సమీక్ష
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.55% లాభంతో 87.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో 71,816.46 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం బలంగా పుంజుకుంది. ఒకదశలో 73,210.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసి, చివరకు 599.34 పాయింట్ల లాభంతో 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 151.15 పాయింట్లు పెరిగి 22,147 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,777.65- 22,179.55 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 1,156.57 పాయింట్లు, నిఫ్టీ 372.4 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
- భారత్ సహా పలు దేశాల్లో విక్రయిస్తున్న శిశు ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం ఉంటోందన్న వార్తలతో నెస్లే ఇండియా షేరు క్షీణత కొనసాగింది. శుక్రవారం మరో 1.04% నష్టపోయిన షేరు రూ.2,437.10 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.10,610.55 కోట్లు తగ్గి రూ.2.34 లక్షల కోట్లకు పరిమితమైంది.
- భవిష్యత్తు ఆదాయ వృద్ధి అంచనాలు నిరాశపరచడంతో ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో 2.47% తగ్గి రూ.1,378.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 0.63% నష్టంతో రూ.1,411.60 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,655.37 కోట్లు తగ్గి, రూ.5.85 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ 3.38%, ఎం అండ్ ఎం 2.90%, మారుతీ 2.54%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.49%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.46%, విప్రో 1.92%, భారతీ ఎయిర్టెల్ 1.71%, బజాజ్ ఫిన్సర్వ్ 1.53%, ఐటీసీ 1.40%, టాటా స్టీల్ 1.31% రాణించాయి. హెచ్సీఎల్ టెక్ 1.35%, నెస్లే 1.04%, టీసీఎస్ 0.93%, ఎల్ అండ్ టీ 0.89%, టాటా మోటార్స్ 0.84% వరకు నష్టపోయాయి.
- నారాయణమూర్తి మనవడికి రూ.4.2 కోట్ల డివిడెండ్: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి 5 నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి డివిడెండ్ రూపేణా రూ.4.20 కోట్లు దక్కనున్నాయి. ఇటీవల మనవడికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల షేర్లను నారాయణమూర్తి ఇచ్చారు. కంపెనీ గురువారం ఒక్కోషేరుపై రూ.28 డివిడెండ్ ఇవ్వడంతో, ఆ షేర్లపై ఏకాగ్రహ్కు ఈ మొత్తం లభించనుంది.
- రానా కపూర్కు బెయిల్: రూ.466.51 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారనే ఆరోపణల కేసులో యెస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రానా కపూర్కు ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. 2020 మార్చిలో కపూర్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, 8 కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటిలో ఆయనకు బెయిల్ లభించింది.
- ఈపీఎఫ్ఓలోకి 1.65 కోట్ల మంది: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నికరంగా 1.65 కోట్ల మంది చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022-23లో చేరిన 1.38 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 19% అధికం. దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడాన్ని ఇది సూచిస్తోంది. గత ఆరున్నరేళ్లలో 6.1 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చేరారు. 2018-19లో 61.12 లక్షలు, 2019-20లో 78.58 లక్షలు, 2021-21లో 77.08 లక్షలు, 2021-22లో 1.22 కోట్లు మంది చొప్పున ఈపీఎఫ్ఓలో చేరారు.
- కెనరా బ్యాంక్ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు రికార్డు తేదీగా మే 15ను నిర్ణయించింది.
- వాహన విడిభాగాల తయారీ సంస్థ ఎమ్ఫోర్స్ ఆటో టెక్ ఐపీఓ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.93-98 ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.54 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి.
- వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల ఎఫ్పీఓ రెండో రోజు పుంజుకుంది. ఇష్యూలో 1260 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 617.46 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్ మదుపర్ల నుంచి వచ్చిన రూ.5400 కోట్లు కలిపితే, రెండో రోజు ముగిసేసరికి రూ.12,000 కోట్లకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి.
- భారత్, ఇతర విపణుల్లో ఇటలీ స్పోర్ట్స్ బ్రాండ్ లోట్టో ఉత్పత్తులను విక్రయించేందుకు ఆసంస్థ యాజమాని డబ్ల్యూహెచ్పీ గ్లోబల్ నుంచి బ్రాండ్ లైసెన్స్ను కొనుగోలు చేసినట్లు స్పోర్ట్వేర్ ప్లాట్ఫామ్ అజిలిటాస్ స్పోర్ట్స్ వెల్లడించింది. 40 ఏళ్ల పాటు ఈ లైసెన్సు పనిచేస్తుంది.
నేటిబోర్డు సమావేశాలు: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్టెల్తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
Nithin Kamath: కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హర్షం వ్యక్తం చేశారు. -
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్