విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.
జనవరి- మార్చిలో 7.8% క్షీణత
స్వల్పంగా తగ్గిన ఆదాయం
ఏప్రిల్- జూన్లో ఆదాయ వృద్ధి -1.5% నుంచి 0.5% ఉండొచ్చని అంచనా
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే అవకాశాల విషయంలో ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. పోటీ సామర్థ్యం పెంచుకునేందుకు, వ్యాపార విలువ అధికమయ్యేందుకు ఉపకరిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత, మా క్లయింట్ల అవసరాలను మార్చేస్తోంది. పెద్ద ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించడంతో పాటు పెద్ద క్లయింట్లు, భాగస్వాములతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.’
శ్రీనివాస్ పల్లియా, సీఈఓ, విప్రో
దిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో నికర లాభం జనవరి- మార్చిలో 7.8% తగ్గి రూ.2,834.60 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,074.50 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.23,190.30 కోట్ల నుంచి 4.2% తగ్గి రూ.22,208.30 కోట్లుగా నమోదైంది. లాభం, ఆదాయాల పరంగా కంపెనీ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లుగానే నమోదయ్యాయి. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి (ఏప్రిల్- జూన్) త్రైమాసికంలో స్థిర కరెన్సీ రూపేణా ఐటీ సేవల విభాగ ఆదాయ వృద్ధి (-)1.5% నుంచి 0.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది పరిశ్రమ అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2617- 2670 మిలియన్ డాలర్ల (సుమారు రూ.21,721 - రూ.22161 కోట్ల) శ్రేణిలో ఐటీ సేవల విభాగ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) శ్రీనివాస్ పల్లియా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..
- జనవరి- మార్చి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగ ఆదాయం ఏడాదిక్రితంతో పోలిస్తే 6.4% తగ్గి 2657.4 మిలియన్ డాలర్లకు పరిమితం కాగా.. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 0.1% పెరిగింది.
- ఐటీ సేవల నిర్వహణ మార్జిన్ 16.4 శాతంగా నమోదైంది. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు పెరిగింది.
- జనవరి- మార్చిలో మొత్తంగా 3.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. వీటిల్లో పెద్ద కాంట్రాక్టుల విలువ 1.2 బిలియన్ డాలర్లు. ఏడాదిక్రితం ఇదే సమయంలో దక్కించుకున్న పెద్ద కాంట్రాక్టుల విలువతో పోలిస్తే ఈ మొత్తం 9.5% ఎక్కువ.
- పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 2.6% తగ్గి రూ.11,045.20 కోట్లకు పరిమితం కాగా.. ఆదాయం 0.8% తగ్గి రూ.89,760.30 కోట్లుగా నమోదైంది.
- 24,516 మంది ఉద్యోగులు తగ్గారు: 2024 మార్చి చివరికి కంపెనీ సిబ్బంది సంఖ్య 2,34,054గా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 24,516 మంది, జనవరి- మార్చి త్రైమాసికంలో 6,180 మంది చొప్పున ఉద్యోగుల సంఖ్య తగ్గింది. విప్రో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది ఆరో త్రైమాసికం కాగా.. వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం.
- వలసల రేటు 14.2 శాతం వద్ద యథాతథంగా ఉంది.
3 కంపెనీల్లోనే 64,000 మంది: దేశంలో 3 దిగ్గజ ఐటీ కంపెనీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 64,000 మంది సిబ్బంది తగ్గారు. టీసీఎస్లో 13,249 మంది, ఇన్ఫోసిస్లో 25,994 మంది, విప్రోలో 24,516 మంది సిబ్బంది తగ్గినట్లు ఆయా సంస్థలే వెల్లడించాయి.
రిషద్, అజీమ్ పునర్నియామకం
విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా రిషద్ ఎ.ప్రేమ్జీని అయిదేళ్ల కాలానికి అంటే 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కొనసాగేలా పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా అజీమ్ ప్రేమ్జీ పునర్నియామకానికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. ఆయన 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కూడా ఇదే ఈ పదవిలో కొనసాగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసూళ్లలో జైఎస్టీ
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
గోద్రేజ్ విభజన.. షేర్ల బదిలీతోనే
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి