విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.
జనవరి- మార్చిలో 7.8% క్షీణత
స్వల్పంగా తగ్గిన ఆదాయం
ఏప్రిల్- జూన్లో ఆదాయ వృద్ధి -1.5% నుంచి 0.5% ఉండొచ్చని అంచనా
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే అవకాశాల విషయంలో ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. పోటీ సామర్థ్యం పెంచుకునేందుకు, వ్యాపార విలువ అధికమయ్యేందుకు ఉపకరిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత, మా క్లయింట్ల అవసరాలను మార్చేస్తోంది. పెద్ద ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించడంతో పాటు పెద్ద క్లయింట్లు, భాగస్వాములతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.’
శ్రీనివాస్ పల్లియా, సీఈఓ, విప్రో
దిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో నికర లాభం జనవరి- మార్చిలో 7.8% తగ్గి రూ.2,834.60 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,074.50 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.23,190.30 కోట్ల నుంచి 4.2% తగ్గి రూ.22,208.30 కోట్లుగా నమోదైంది. లాభం, ఆదాయాల పరంగా కంపెనీ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లుగానే నమోదయ్యాయి. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి (ఏప్రిల్- జూన్) త్రైమాసికంలో స్థిర కరెన్సీ రూపేణా ఐటీ సేవల విభాగ ఆదాయ వృద్ధి (-)1.5% నుంచి 0.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది పరిశ్రమ అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2617- 2670 మిలియన్ డాలర్ల (సుమారు రూ.21,721 - రూ.22161 కోట్ల) శ్రేణిలో ఐటీ సేవల విభాగ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) శ్రీనివాస్ పల్లియా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..
- జనవరి- మార్చి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగ ఆదాయం ఏడాదిక్రితంతో పోలిస్తే 6.4% తగ్గి 2657.4 మిలియన్ డాలర్లకు పరిమితం కాగా.. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 0.1% పెరిగింది.
- ఐటీ సేవల నిర్వహణ మార్జిన్ 16.4 శాతంగా నమోదైంది. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు పెరిగింది.
- జనవరి- మార్చిలో మొత్తంగా 3.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. వీటిల్లో పెద్ద కాంట్రాక్టుల విలువ 1.2 బిలియన్ డాలర్లు. ఏడాదిక్రితం ఇదే సమయంలో దక్కించుకున్న పెద్ద కాంట్రాక్టుల విలువతో పోలిస్తే ఈ మొత్తం 9.5% ఎక్కువ.
- పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 2.6% తగ్గి రూ.11,045.20 కోట్లకు పరిమితం కాగా.. ఆదాయం 0.8% తగ్గి రూ.89,760.30 కోట్లుగా నమోదైంది.
- 24,516 మంది ఉద్యోగులు తగ్గారు: 2024 మార్చి చివరికి కంపెనీ సిబ్బంది సంఖ్య 2,34,054గా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 24,516 మంది, జనవరి- మార్చి త్రైమాసికంలో 6,180 మంది చొప్పున ఉద్యోగుల సంఖ్య తగ్గింది. విప్రో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది ఆరో త్రైమాసికం కాగా.. వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం.
- వలసల రేటు 14.2 శాతం వద్ద యథాతథంగా ఉంది.
3 కంపెనీల్లోనే 64,000 మంది: దేశంలో 3 దిగ్గజ ఐటీ కంపెనీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 64,000 మంది సిబ్బంది తగ్గారు. టీసీఎస్లో 13,249 మంది, ఇన్ఫోసిస్లో 25,994 మంది, విప్రోలో 24,516 మంది సిబ్బంది తగ్గినట్లు ఆయా సంస్థలే వెల్లడించాయి.
రిషద్, అజీమ్ పునర్నియామకం
విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా రిషద్ ఎ.ప్రేమ్జీని అయిదేళ్ల కాలానికి అంటే 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కొనసాగేలా పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా అజీమ్ ప్రేమ్జీ పునర్నియామకానికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. ఆయన 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కూడా ఇదే ఈ పదవిలో కొనసాగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట