సంక్షిప్త వార్తలు
నూతన రిటైల్ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు.
కొత్త మార్కెట్లకు విస్తరణ: గోద్రెజ్ జెర్సీ
ఈనాడు, హైదరాబాద్: నూతన రిటైల్ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు. ఈ కొత్త తరహా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కేశవరంలో ఉన్న ప్లాంటులో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల పరిమాణాల్లో ఉత్పత్తులను తీసుకొస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోజుకు మొత్తం 7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 2 లక్షల లీటర్ల వరకూ ఉంటున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 50,000కు పైగా రిటైల్ విక్రయ కేంద్రాలున్నాయని, వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంపాటు నిల్వ ఉండే ఉత్పత్తులను ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల మేరకు టర్నోవర్ సాధించామని తెలిపారు.
ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓలో 15.48 లక్షల మంది చేరిక
దిల్లీ: 2024 ఫిబ్రవరిలో మొత్తం 15.48 లక్షల మంది సభ్యులు సంస్థలో చేరారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) శనివారం వెల్లడించింది. వీరిలో తొలిసారిగా 7.78 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.36 శాతంగా ఉన్నారని పేర్కొంది. తొలిసారిగా చేరిన 7.78 లక్షల మంది సభ్యుల్లో 2.05 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మహిళా సభ్యులు ఫిబ్రవరిలో 3.08 లక్షల మంది జతయ్యారు. తయారీ, మార్కెటింగ్ సేవలు, కంప్యూటర్ల వినియోగం, రహదారి మోటార్ రవాణా, ఆటోమొబైల్ సర్వీసింగ్, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో అధికంగా సభ్యులు చేరారు. మొత్తం నికర సభ్యుల్లో సుమారు 41.53 శాతం మంది నైపుణ్య సేవల్లో (మ్యాన్పవర్ సరఫరా, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు, ఇతర కార్యకలాపాలు) చేరారు.
జొమాటోకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు
దిల్లీ: ఆన్లైన్లో ఆహార పదార్థాలు డెలివరీ చేసే ప్లాట్ఫామ్ జొమాటో రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్, పెనాల్టీ ఆర్డర్ అందుకుంది. భారత్ వెలుపల ఉన్న తన అనుబంధ సంస్థలకు 2017 జులై నుంచి 2021 మార్చి వరకు ఎగుమతి సేవలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి ఈ డిమాండ్ నోటీసు అందుకున్నట్లు తెలుస్తోంది. గురుగ్రామ్ సీజీఎస్టీ అదనపు కమిషనర్ ఈ ఆర్డర్ను పంపించారు. ఇందులో జీఎస్టీ డిమాండ్ రూ.5,90,94,889 (వడ్డీ అదనం), అపరాధ రుసుము రూ.5,90,94,889గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!