సంక్షిప్త వార్తలు
నూతన రిటైల్ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు.
కొత్త మార్కెట్లకు విస్తరణ: గోద్రెజ్ జెర్సీ
ఈనాడు, హైదరాబాద్: నూతన రిటైల్ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు. ఈ కొత్త తరహా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కేశవరంలో ఉన్న ప్లాంటులో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల పరిమాణాల్లో ఉత్పత్తులను తీసుకొస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోజుకు మొత్తం 7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 2 లక్షల లీటర్ల వరకూ ఉంటున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 50,000కు పైగా రిటైల్ విక్రయ కేంద్రాలున్నాయని, వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంపాటు నిల్వ ఉండే ఉత్పత్తులను ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల మేరకు టర్నోవర్ సాధించామని తెలిపారు.
ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓలో 15.48 లక్షల మంది చేరిక
దిల్లీ: 2024 ఫిబ్రవరిలో మొత్తం 15.48 లక్షల మంది సభ్యులు సంస్థలో చేరారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) శనివారం వెల్లడించింది. వీరిలో తొలిసారిగా 7.78 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.36 శాతంగా ఉన్నారని పేర్కొంది. తొలిసారిగా చేరిన 7.78 లక్షల మంది సభ్యుల్లో 2.05 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మహిళా సభ్యులు ఫిబ్రవరిలో 3.08 లక్షల మంది జతయ్యారు. తయారీ, మార్కెటింగ్ సేవలు, కంప్యూటర్ల వినియోగం, రహదారి మోటార్ రవాణా, ఆటోమొబైల్ సర్వీసింగ్, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో అధికంగా సభ్యులు చేరారు. మొత్తం నికర సభ్యుల్లో సుమారు 41.53 శాతం మంది నైపుణ్య సేవల్లో (మ్యాన్పవర్ సరఫరా, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు, ఇతర కార్యకలాపాలు) చేరారు.
జొమాటోకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు
దిల్లీ: ఆన్లైన్లో ఆహార పదార్థాలు డెలివరీ చేసే ప్లాట్ఫామ్ జొమాటో రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్, పెనాల్టీ ఆర్డర్ అందుకుంది. భారత్ వెలుపల ఉన్న తన అనుబంధ సంస్థలకు 2017 జులై నుంచి 2021 మార్చి వరకు ఎగుమతి సేవలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి ఈ డిమాండ్ నోటీసు అందుకున్నట్లు తెలుస్తోంది. గురుగ్రామ్ సీజీఎస్టీ అదనపు కమిషనర్ ఈ ఆర్డర్ను పంపించారు. ఇందులో జీఎస్టీ డిమాండ్ రూ.5,90,94,889 (వడ్డీ అదనం), అపరాధ రుసుము రూ.5,90,94,889గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!