ప్రీమియర్ ఎనర్జీస్ రూ.1500 కోట్ల ఐపీఓ
సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు సిద్ధమైంది.
ఈనాడు, హైదరాబాద్: సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) వద్ద ఐపీఓ దరఖాస్తు(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) దాఖలు చేసింది. దీని ప్రకారం ఈ సంస్థ రూ.1,500 కోట్ల విలువకు కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయటంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు, కొందరు ఇన్వెస్టర్లు 2.82 కోట్ల షేర్లు విక్రయిస్తారు.
ప్రమోటరు చిరంజీవ్ సింగ్ సాలుజతో పాటు ఇన్వెస్టర్లు సౌత్ ఏషియా గ్రోత్ ఫండ్-2 హోల్డింగ్స్ ఎల్ఎల్సీ, సౌత్ ఏషియా ఈబీటీ ట్రస్ట్ ఇందులో ఉన్నాయి. ఐపీఓ కంటే ముందు ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ కింద రూ.300 కోట్లకు ఈక్విటీ షేర్లు కేటాయించే ఆలోచన కంపెనీకి ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.1,168 కోట్లు తన అనుబంధ కంపెనీ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి అవసరాలకు కేటాయిస్తారు. ఈ సబ్సిడరీ కంపెనీ 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ మాడ్యూల్ తయారీ యూనిట్ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.
దాదాపు పాతికేళ్ల క్రితం ఏర్పాటైన ప్రీమియర్ ఎనర్జీస్కు ప్రస్తుతం 2 గిగావాట్ల సోలార్ సెల్, 3.36 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇదే కాకుండా ఈపీసీ సేవలు, ఓ అండ్ ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) సేవలు ఈ సంస్థ అందిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల 5 యూనిట్లు ఈ సంస్థకు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,428 కోట్ల ఆదాయాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి రూ.2,017 కోట్ల ఆదాయాన్ని ప్రీమియర్ ఎనర్జీస్ ఆర్జించింది. కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.5,300 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ సంస్థ తొలి పబ్లిక్ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం