హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.17,622 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఏకీకృత పద్ధతిలో 2 శాతం పెరిగి రూ.17,622 కోట్లకు చేరింది.
డివిడెండు రూ.19.5
ముంబయి: జనవరి- మార్చి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఏకీకృత పద్ధతిలో 2 శాతం పెరిగి రూ.17,622 కోట్లకు చేరింది. స్టాండలోన్ పద్ధతిలోనూ నికర లాభం అంతకుముందు త్రైమాసికంలో (అక్టోబరు- డిసెంబరు)ని రూ.16,373 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 0.84 శాతం పెరిగి రూ.16,511.85 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 9.6 శాతం వృద్ధితో రూ.89,693.90 కోట్లకు పెరిగింది. అక్టోబర్-డిసెంబర్లో ఆదాయం రూ.81,719.65 కోట్లుగా ఉంది. భవిష్యత్లో ఎలాంటి అవరోధాలనైనా ఎదుర్కొనేందుకు రూ.10,900 కోట్లను బ్యాంకు కేటాయించింది.
పెరిగిన వడ్డీ ఆదాయం..: కీలక నికర వడ్డీ ఆదాయం 24.5 శాతం పెరిగి రూ.29,080 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం కూడా రూ.18,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 0.04 శాతం మెరుగై 3.44 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గగా.. నికర నిరర్థక ఆస్తులు 0.31 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయి. మొత్తం కేటాయింపులు రూ.13,510 కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి చివరినాటికి మొత్తం డిపాజిట్లు 26.4 శాతం పెరిగి రూ.23.80లక్షల కోట్లకు చేరాయి. స్థూల రుణాలు 55.4 శాతం వృద్ధితో రూ.24.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి 31 నాటికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 18.8 శాతంగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) నికర లాభం రూ.64,060 కోట్లుగా నమోదైంది.
650 కొత్త శాఖలు..: రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.19.5 డివిడెండును హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు సిఫారసు చేసింది. మార్చి త్రైమాసికంలో సుమారు 650 కొత్త శాఖలను బ్యాంకు తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 8,738కు చేరింది. అయితే మొత్తంగా 12,000 శాఖలను కలిగి ఉండాలన్నది తమ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ముఖ్య ఆర్థిక అధికారి(సీఎఫ్ఓ) శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?