73000 దిగువన బలహీనం!
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘జూన్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
సమీక్ష: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘జూన్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దేశీయంగా చూస్తే.. మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠమైన 0.53 శాతంగా నమోదైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు ప్రభావం చూపాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఆ వార్తలూ ప్రభావం చూపుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు 3.7% నష్టపోయి 87.1 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 83.38 నుంచి 83.44కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చొచ్చన్న భయాలతో, ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చైనా జీడీపీ మొదటి త్రైమాసికంలో 5.3% వృద్ధి సాధించింది. యూరో ఏరియా ద్రవ్యోల్బణం మార్చిలో 2.4 శాతానికి తగ్గింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 1.6% నష్టంతో 73,088 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.7% తగ్గి 22,147 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ షేర్లు నష్టపోగా.. చమురు-గ్యాస్, లోహ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.19,894 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.15,378 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.5,254 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో అప్రమత్తతను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సెన్సెక్స్, నష్టాల్లో ముగిసింది. ఒకదశలో 71,816 పాయింట్లకు పడిపోయిన సూచీ, కీలక మద్దతు స్థాయి 73,000 ఎగువకు చేరింది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో మార్కెట్ దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మరోవైపు రికవరీ వస్తే, 74,000 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ప్రభావం చూపుతాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, మన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలూ కీలకమే. ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఏసీసీ, ఎల్టీఐ మైండ్ట్రీ, ఎంఫసిస్, ఇండియన్ హోటల్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఈనెల 26న జరగనున్న లోక్సభ ఎన్నికల రెండోదశ పోలింగ్పై దృష్టిపెట్టొచ్చు. ఆస్ట్రేలియా, జపాన్, యూరో ఏరియా, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పరపతి సమావేశాలపై కన్నేయొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఇరాన్- ఇజ్రాయెల్ పరిణామాలు చమురు ధరలకు కీలకం కానున్నాయి.
తక్షణ మద్దతు స్థాయులు: 72,365, 71,816, 71,072
తక్షణ నిరోధ స్థాయులు: 73,473, 74,245, 74,952
సెన్సెక్స్ 73000 దిగువన ముగిస్తే, మరింత బలహీనపడొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
నేటి బోర్డు సమావేశాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా లాజిస్టిక్స్, ఆదిత్య బిర్లా మనీ, తేజాస్ నెట్వర్క్స్, ర్యాలీస్ ఇండియా, హాట్సన్ అగ్రో, కేశోరామ్ ఇండస్ట్రీస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే