73000 దిగువన బలహీనం!
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘జూన్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
సమీక్ష: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘జూన్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దేశీయంగా చూస్తే.. మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠమైన 0.53 శాతంగా నమోదైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు ప్రభావం చూపాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఆ వార్తలూ ప్రభావం చూపుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు 3.7% నష్టపోయి 87.1 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 83.38 నుంచి 83.44కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చొచ్చన్న భయాలతో, ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చైనా జీడీపీ మొదటి త్రైమాసికంలో 5.3% వృద్ధి సాధించింది. యూరో ఏరియా ద్రవ్యోల్బణం మార్చిలో 2.4 శాతానికి తగ్గింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 1.6% నష్టంతో 73,088 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.7% తగ్గి 22,147 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ షేర్లు నష్టపోగా.. చమురు-గ్యాస్, లోహ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.19,894 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.15,378 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.5,254 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో అప్రమత్తతను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సెన్సెక్స్, నష్టాల్లో ముగిసింది. ఒకదశలో 71,816 పాయింట్లకు పడిపోయిన సూచీ, కీలక మద్దతు స్థాయి 73,000 ఎగువకు చేరింది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో మార్కెట్ దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మరోవైపు రికవరీ వస్తే, 74,000 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ప్రభావం చూపుతాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, మన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలూ కీలకమే. ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఏసీసీ, ఎల్టీఐ మైండ్ట్రీ, ఎంఫసిస్, ఇండియన్ హోటల్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఈనెల 26న జరగనున్న లోక్సభ ఎన్నికల రెండోదశ పోలింగ్పై దృష్టిపెట్టొచ్చు. ఆస్ట్రేలియా, జపాన్, యూరో ఏరియా, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పరపతి సమావేశాలపై కన్నేయొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఇరాన్- ఇజ్రాయెల్ పరిణామాలు చమురు ధరలకు కీలకం కానున్నాయి.
తక్షణ మద్దతు స్థాయులు: 72,365, 71,816, 71,072
తక్షణ నిరోధ స్థాయులు: 73,473, 74,245, 74,952
సెన్సెక్స్ 73000 దిగువన ముగిస్తే, మరింత బలహీనపడొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
నేటి బోర్డు సమావేశాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా లాజిస్టిక్స్, ఆదిత్య బిర్లా మనీ, తేజాస్ నెట్వర్క్స్, ర్యాలీస్ ఇండియా, హాట్సన్ అగ్రో, కేశోరామ్ ఇండస్ట్రీస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. -
సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్