పశ్చిమాసియాపైనే కళ్లన్నీ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలే మార్కెట్లకు కీలకం
బ్యాంకింగ్, లోహ షేర్లు రాణించొచ్చు
వాహన, టెలికాం స్క్రిప్లలోనూ సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగేంత వరకు విదేశీ మదుపర్లు ‘బేరిష్’ ధోరణిలోనే ప్రవర్తించొచ్చంటున్నారు. గత వారం చివరి 4 సెషన్లలో దేశీయ మార్కెట్లో వారు నికర విక్రేతలుగా నిలిచి రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో, ఎంపిక చేసిన స్క్రిప్లలో కదలికలు కనిపించొచ్చని తెలిపారు. నిఫ్టీ-50కి తక్షణ మద్దతు 22,100 వద్ద, నిరోధం 22,300-22,500 శ్రేణిలో కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ తిరిగి 22,000 స్థాయిని అందుకోవడం బలమైన పునాదిగా ఉండగలదని చెబుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయంటే..
- ఫలితాలకు ముందు ఎఫ్ఎమ్సీజీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం గణాంకాలను వెలువరచే టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే షేర్లలో కదలికలు కనిపించొచ్చు. సెరిలాక్ వివాదం నేపథ్యంలో నెస్లే షేర్లు స్వల్పకాలంలో స్తబ్దుగా కదలాడొచ్చు.
- బ్యాంకింగ్ షేర్లలో సానుకూలతలు ఉండొచ్చు. శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై ఆ ప్రభావం కనిపించొచ్చు. నిఫ్టీ బ్యాంక్ సూచీకి 46,500 వద్ద మద్దతు, 48,000 వద్ద నిరోధం కనిపిస్తోంది.
- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం దేశీయ యంత్రపరికరాల కంపెనీలపై పరిమిత ప్రభావాన్నే చూపొచ్చు. పశ్చిమాసియా నుంచి భెల్, భారత్ డైనమిక్స్, ఎల్ అండ్ టీలకు ఎంచదగ్గరీతిలో ఆర్డర్లయితే ఉన్నాయి. ఫలితాలకు ముందు ఈ రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలొచ్చు.
- ఐటీ కంపెనీల షేర్లు స్వల్పకాలానికి ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. ఈ వారంలో హెచ్సీఎల్ టెక్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎంఫసిస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఫలితాలు వెల్లడించనున్నాయి.
- ఇటీవల ర్యాలీ అనంతరం దిద్దుబాటుకు లోనైన ఔషధ సంస్థల షేర్లు ఊగిసలాడొచ్చు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు, అనుమతులు స్వల్పకాలంలో ఆయా షేర్లపై ప్రభావం చూపొచ్చు. బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ షేర్లలో కొంత సానుకూలతలు కనిపించొచ్చు. ఆల్కెమ్, సిప్లా, పిరమాల్ ఫార్మా, సన్ ఫార్మాపై విశ్లేషకులు బేరిష్గా ఉన్నారు.
- ప్రభావం చూపే వార్తలు లేనందున సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మదుపర్లు సిమెంటు ధరలపై ఓ కన్నేయవచ్చు. అల్ట్రాటెక్ షేరును పరిశీలించొచ్చు. రామ్కో సిమెంట్స్, జేకే సిమెంట్లపైనా ఆసక్తి పెరుగుతోంది.
- టెలికాం షేర్లు రాణించొచ్చు. ఫలితాలను గమనించాలి. రాబోయే వారాల్లో టారిఫ్ పెంపును అమలు చేసేవరకు ఈ రంగానికి సంబంధించి పెద్ద వార్తలేమీ ఉండకపోవచ్చు. వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల సమీకరణ వల్ల కంపెనీ పరిస్థితేమీ మారకపోవచ్చని ఓ బ్రోకరేజీ అంచనా వేస్తోంది.
- లోహ కంపెనీల షేర్లలో ‘బులిష్’ ధోరణి కనిపించనుంది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్ షేర్లు ‘బ్రేక్ అవుట్’కు సిద్ధంగా ఉన్నందున వాటిపై కన్నేయడం మంచింది.
- వాహన కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. బలమైన ఫలితాలు, సాధారణ వర్షపాతం అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల కదలికల ఆధారంగా చమురు షేర్లకు దిశానిర్దేశం లభించొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించే ఫలితాలను గమనించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!