పశ్చిమాసియాపైనే కళ్లన్నీ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలే మార్కెట్లకు కీలకం
బ్యాంకింగ్, లోహ షేర్లు రాణించొచ్చు
వాహన, టెలికాం స్క్రిప్లలోనూ సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగేంత వరకు విదేశీ మదుపర్లు ‘బేరిష్’ ధోరణిలోనే ప్రవర్తించొచ్చంటున్నారు. గత వారం చివరి 4 సెషన్లలో దేశీయ మార్కెట్లో వారు నికర విక్రేతలుగా నిలిచి రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో, ఎంపిక చేసిన స్క్రిప్లలో కదలికలు కనిపించొచ్చని తెలిపారు. నిఫ్టీ-50కి తక్షణ మద్దతు 22,100 వద్ద, నిరోధం 22,300-22,500 శ్రేణిలో కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ తిరిగి 22,000 స్థాయిని అందుకోవడం బలమైన పునాదిగా ఉండగలదని చెబుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయంటే..
- ఫలితాలకు ముందు ఎఫ్ఎమ్సీజీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం గణాంకాలను వెలువరచే టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే షేర్లలో కదలికలు కనిపించొచ్చు. సెరిలాక్ వివాదం నేపథ్యంలో నెస్లే షేర్లు స్వల్పకాలంలో స్తబ్దుగా కదలాడొచ్చు.
- బ్యాంకింగ్ షేర్లలో సానుకూలతలు ఉండొచ్చు. శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై ఆ ప్రభావం కనిపించొచ్చు. నిఫ్టీ బ్యాంక్ సూచీకి 46,500 వద్ద మద్దతు, 48,000 వద్ద నిరోధం కనిపిస్తోంది.
- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం దేశీయ యంత్రపరికరాల కంపెనీలపై పరిమిత ప్రభావాన్నే చూపొచ్చు. పశ్చిమాసియా నుంచి భెల్, భారత్ డైనమిక్స్, ఎల్ అండ్ టీలకు ఎంచదగ్గరీతిలో ఆర్డర్లయితే ఉన్నాయి. ఫలితాలకు ముందు ఈ రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలొచ్చు.
- ఐటీ కంపెనీల షేర్లు స్వల్పకాలానికి ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. ఈ వారంలో హెచ్సీఎల్ టెక్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎంఫసిస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఫలితాలు వెల్లడించనున్నాయి.
- ఇటీవల ర్యాలీ అనంతరం దిద్దుబాటుకు లోనైన ఔషధ సంస్థల షేర్లు ఊగిసలాడొచ్చు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు, అనుమతులు స్వల్పకాలంలో ఆయా షేర్లపై ప్రభావం చూపొచ్చు. బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ షేర్లలో కొంత సానుకూలతలు కనిపించొచ్చు. ఆల్కెమ్, సిప్లా, పిరమాల్ ఫార్మా, సన్ ఫార్మాపై విశ్లేషకులు బేరిష్గా ఉన్నారు.
- ప్రభావం చూపే వార్తలు లేనందున సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మదుపర్లు సిమెంటు ధరలపై ఓ కన్నేయవచ్చు. అల్ట్రాటెక్ షేరును పరిశీలించొచ్చు. రామ్కో సిమెంట్స్, జేకే సిమెంట్లపైనా ఆసక్తి పెరుగుతోంది.
- టెలికాం షేర్లు రాణించొచ్చు. ఫలితాలను గమనించాలి. రాబోయే వారాల్లో టారిఫ్ పెంపును అమలు చేసేవరకు ఈ రంగానికి సంబంధించి పెద్ద వార్తలేమీ ఉండకపోవచ్చు. వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల సమీకరణ వల్ల కంపెనీ పరిస్థితేమీ మారకపోవచ్చని ఓ బ్రోకరేజీ అంచనా వేస్తోంది.
- లోహ కంపెనీల షేర్లలో ‘బులిష్’ ధోరణి కనిపించనుంది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్ షేర్లు ‘బ్రేక్ అవుట్’కు సిద్ధంగా ఉన్నందున వాటిపై కన్నేయడం మంచింది.
- వాహన కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. బలమైన ఫలితాలు, సాధారణ వర్షపాతం అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల కదలికల ఆధారంగా చమురు షేర్లకు దిశానిర్దేశం లభించొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించే ఫలితాలను గమనించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకొని 22,783 దగ్గర కొనసాగుతోంది. -
కోపోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. -
సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే