అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది.
2023-24లో 18% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరిక
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది. బడ్జెట్లో సవరించిన అంచనాలను మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు బడ్జెట్ తొలి అంచనాల కంటే రూ.1.35 లక్షల కోట్లు (7.4%), సవరించిన అంచనాల కంటే రూ.13,000 కోట్లు (0.67%) అధికంగా నమోదైనట్లు తెలిపింది. ఫిబ్రవరి 1న సమర్పించిన తాత్కాలిక బడ్జెట్లో 2023-24 ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.19.45 లక్షల కోట్లకు సవరించింది. 2023-24లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలిక) 18.48% పెరిగి రూ.23.37 లక్షల కోట్లకు చేరాయి. నికర వసూళ్లు (రిఫండ్లు మినహాయించాక) 17.7% వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని, వ్యక్తులు, కార్పొరేట్ల ఆదాయ స్థాయి పెరుగుదలను ఇది సూచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.79 లక్షల కోట్ల రిఫండ్ అందించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది.
- 2022-23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.64 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.18.23 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం తొలుత నిర్దేశించుకుంది. తర్వాత రూ.19.45 లక్షల కోట్లకు సవరించింది. అంతకుమించి రూ.13,000 కోట్ల మేర అదనపు వసూళ్లు రావడం విశేషం.
- స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు (తాత్కాలిక) 13.06% పెరిగి రూ.11.32 లక్షల కోట్లకు చేరాయి. 2022-23లో ఇవి రూ.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు (తాత్కాలిక) రూ.8.26 లక్షల కోట్ల నుంచి 10.26% పెరిగి రూ.9.11 లక్షల కోట్లకు చేరాయి.
- స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీల లావాదేవీ పన్నుతో కలిపి) రూ.9.67 లక్షల కోట్ల నుంచి 24.26% పెరిగి రూ.12.01 లక్షల కోట్లకు చేరాయి. నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.8.33 లక్షల కోట్ల నుంచి 25.23% పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లు రూ.3.09 లక్షల కోట్ల నుంచి 22.74% పెరిగి రూ.3.79 లక్షల కోట్లకు పెరిగాయి.
- పరోక్ష పన్ను వసూళ్లు కూడా సవరించిన అంచనా రూ.14.84 లక్షల కోట్ల కంటే అధికంగానే నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. పరోక్ష పన్ను వసూళ్లు (కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్ సుంకాలతో కలిపి) గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే బాగా నమోదైనందుకు ఆనందంగా ఉందని సీబీఐసీ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ క్షేత్ర స్థాయి అధికారులకు ఇటీవలే లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి