రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు..
రూ.4.97 లక్షల కోట్ల సంపద వృద్ధి
సమీక్ష
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. మన సూచీల రాణింపునకు దోహద పడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 83.36 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.80% తగ్గి 86.59 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
- మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.4.97 లక్షల కోట్లు పెరిగి రూ.397.86 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 1,159.63 పాయింట్లు లాభపడింది.
- సెన్సెక్స్ ఉదయం 73,666.51 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 73,767.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 560.29 పాయింట్ల లాభంతో 73,648.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 189.40 పాయింట్లు పెరిగి 22,336.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,198.15-22,375.65 పాయింట్ల మధ్య కదలాడింది.
- మార్చి త్రైమాసిక లాభం 6% పెరగడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ఇంట్రాడేలో 4% దూసుకెళ్లి రూ.385 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.45% లాభంతో రూ.382.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,100.44 కోట్లు పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది.
- త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది.
- త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 25 రాణించాయి. ఎల్ అండ్ టీ 2.67%, బజాజ్ ఫైనాన్స్ 2.36%, యాక్సిస్ బ్యాంక్ 2.35%, అల్ట్రాటెక్ 2.13%, విప్రో 2.01%, ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.94%, ఇన్ఫోసిస్ 1.48%, హెచ్సీఎల్ టెక్ 1.24%, ఏషియన్ పెయింట్స్ 1.19% లాభపడ్డాయి. ఎన్టీపీసీ 2.24%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.17%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.46% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. మన్నికైన వినిమయ వస్తువులు 2.53%, పరిశ్రమలు 1.93%, యంత్ర పరికరాలు 1.65%, టెలికాం 1.17%, ఆర్థిక సేవలు 1.04%, వినియోగ 1.02% మెరిశాయి. యుటిలిటీస్ డీలాపడింది. బీఎస్ఈలో 2599 షేర్లు లాభాల్లో ముగియగా, 1310 స్క్రిప్లు నష్టపోయాయి. 148 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
వొడాఫోన్ ఐడియా ఎఫ్పీఓకు 7 రెట్ల స్పందన: వొడాఫోన్ ఐడియా రూ.18,000 కోట్ల ఫాలోఆన్ ఆఫర్ (ఎఫ్పీఓ) ముగిసే సరికి 6.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో 1260 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 8,011.29 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీల నుంచి 19.31 రెట్లు, ఎన్ఐఐల నుంచి 4.54 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 56% చొప్పున స్పందన దక్కింది. ఎఫ్పీఓలో రూ.88,124 కోట్ల విలువైన బిడ్లు వచ్చినప్పటికీ.. ఆఫర్ పరిమాణాన్ని రూ.12,600 కోట్లుగానే సంస్థ కొనసాగించింది. యాంకర్ మదుపర్ల నుంచి వచ్చిన రూ.5,400 కోట్లు కలిపితే, మొత్తం రూ.18,000 కోట్ల లక్ష్యాన్ని అందుకుంది.
నేటి బోర్డు సమావేశాలు: టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలెక్సీ, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్, ఎంసీఎక్స్ ఇండియా, సైయెంట్ డీఎల్ఎం, నెల్కో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్