ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది.
ఆర్బీఐ ఏప్రిల్ బులెటిన్
ముంబయి: దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. గత నెలలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.9 శాతానికి దిగి వచ్చింది. దీనికి ముందు రెండు నెలల సరాసరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదైంది. ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమయంలో సీపీఐ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 2023 ఫిబ్రవరి నుంచి ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీ రేట్లను మార్చకుండా 6.5 శాతం వద్దే ఆర్బీఐ ఉంచింది. ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరుతో ఆర్బీఐ ప్రచురించిన తాజా వ్యాసంలో.. అంతర్జాతీయ వృద్ధి 2024 తొలి త్రైమాసికంలో స్థిరంగా కొనసాగిందని పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం సానుకూలంగా మారిందనీ తెలిపింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ట్రెజరీ ప్రతిఫలాలు, తనఖా రేట్లు పెరగడంతో, వడ్డీ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు వస్తున్నాయి. మనదేశంలోకి పెట్టుబడులు అధికంగా వస్తుండటం, వ్యాపార, వినియోగదారు సెంటిమెంట్తో వాస్తవిక జీడీపీ పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అయితే వాతావరణ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళననూ వ్యక్తం చేసింది. ఇందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ రచయితల వ్యక్తిగత అభిప్రాయాలేనని, ఆర్బీఐకు సంబంధం లేదని వ్యాసం పేర్కొంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్రా నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్లో వ్యాసాలు రాసింది. దీని ప్రకారం..
వర్షపాతం బాగుంటే..: 2024 వసంత కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు కూడా 1850 నుంచి చూస్తే ఈ మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపాయి. 1880-1899 సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ (3.01 డిగ్రీల ఫారిన్హీట్) ఎక్కువగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసినట్లు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతే, ఆహార పదార్థాల ధరలపై ఒత్తిళ్లు తగ్గుతాయి. స్వల్ప కాలంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తితే, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.
రుణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన పెరిగిందని, ప్రైవేటు రంగ బ్యాంకుల (పీవీబీలు) వద్ద ఇది అధికంగా (19.3%) ఉందని బులెటిన్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) వద్ద రుణ వృద్ధి 14.7 శాతంగా ఉంది.ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే పీఎస్బీల్లో రుణ రేట్లు తక్కువగా, డిపాజిట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!